(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
10
బిజెపి పార్టీ రామజన్మభూమి వివాదం రెకెత్తించింది. అద్వాని నాయకత్వలో జరిగిన రథయాత్ర మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎదో విదంగా అధికారంలోకి రావటానికి పన్నిన కుట్రలో బాగంగానే రామజన్మభూమి వివాదం ముందుకు తెచ్చారు. దానికి తోడు ‘మోడి’ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన గుజరాత్ అల్లర్లు ముస్లీంలూచకోత హిందు మతోన్మాదాన్ని తీవ్ర స్తాయికి తీసుకపోయింది. కాంగ్రెసు పదెండ్ల పాలన ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సరికదా అనేక కుంభకోణాతో భ్రష్టు పట్టపోయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో నరెంద్రమోడి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.
పదిహెడవ లోకసభ ఎన్నికలను ప్రకటించింది. ఏప్రిల్ రెండవ వారం నుండి నాల్గవ వరకు ఏడు పేజుల్లో జరుగనున్నాయి.
రామయ్య కాలనీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అసలే ఎండలు మండి పోతున్నాయి. అంత కంటే ఎక్కువగా ఎన్నికల వేడి మొదలైంది. రామగుండం పెద్దపల్లి పార్లమెంటు యస్సి నియోజక వర్గంలోకి వస్తుంది. కాని ఎన్నికల్లో పోటీ పడుతున్నాది మాత్రం ఇద్దరు హేమాహేమీలు. పేరుకు వాళ్ళు యస్సిలేకాని అర్థికంగా బాగా బలం కలిగినోళ్ళు.
తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి తరుపున ‘వెంకటేశ్నేతను పోటికి నిలిపారు. రాజకాయాల్లో ఏదీ శాశ్వతం కాదు గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిదిలోని చెన్నూరు నియోజక వర్గం నుండి వెంకటేశ్ కాగ్రెసు తరుపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిండు. అంతా అర్నెల్ల కాలేదు. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినవి. పార్లమెంటు ఎన్నికల ప్రకటన వెలువడిన తరవుఆత ఆయన టి.ఆర్.యస్ పార్టీలోకి మారి సీటు దక్కించుకున్నాడు.
రాజకీయ పార్టీలు ఏవి ఏవిలువలు పాటించటం లేదు. ఎన్నికల్లో గెలువగలిగే సత్త ఉండి, డబ్బు దస్కం బాగా ఖర్చుపేట్టె వారిని ఏరి కోరి, పిలిచి మరి టికట్ ఇస్తానయి. అంటే గెలుపు గుర్రాల మీద పార్టీలు పందెం కాస్తున్నాయి. అ విదంగా చూసినప్పుడు ‘వెంకటేశ్ నేత’ అందుకు సమర్థుడని పార్టీ బావించింది. పెద్దపెద్ద కంట్రాక్టులు చేసి ఆయన వందల కొట్లు సంపాధించిండు.
ఎన్నికలంటే మాటలు కాదు కొట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పుట్టపిత్తులా పైసలు ఎగజల్లి ఓట్లు రాబట్టుకోవాలి. ఎన్నికల్లో నెగ్గిన తరువాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చు. రాజకీయాలు పక్తు వ్యాపారం అయిన చోట అంతకంటే ఎక్కువ ఏమి అశించలేము.
ఇటువంటి రాజకీయాల్లో అరితేరిన వాడు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చంద్రశేఖర్ రావు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరుంది అవిదంగా ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకిజరిగిన ఎన్నికల్లో నెగ్గి మొదటి ముఖ్యమంత్రి అయిండు.
అధికారంలోకి వచ్చిన తరువాత అయన అసలు రంగు బయట పడసాగింది.
ఏ ఆశల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడిండ్లో ఆ ఆశలను నీరుగరుస్తు పోయిండు. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి, తనకు ఎవరు రాజకీయాల్లో పోటీ రాకుండా ఉండటం కోసం ఉధ్యమంలో తనతో కలిసి పనిచేసిన వారిని ఒక పద్దతి ప్రకారం పక్కకు పెట్టి అవకాశ వాదులు, జంపు జాలానిలను, తన చెప్పు చేతుల్లో మెదిలే వాళ్ళను పార్టీలో చేర్చుకొని వారికే సీట్లు ఇచ్చి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిండు. తన అధికారాన్ని పటిష్ట పరుచుకొని తన తదనంతరం తన వారసుడే అధికారంలో వచ్చే లక్ష్యంతో మొత్తం యాంత్రంగం సిద్దం చేసిండు.
ఇప్పుడిక రాష్ట్రంలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అని తలలు ఊపపటం తప్ప ప్రనజాప్రతినిధులు ఎవరు ఎదురు చెప్పె పరిస్థితి లేదు.
వాస్తవానికి టి.ఆర్.యస్. పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ సీటు వివేక్ కు ఇవ్వాల్సి ఉండే. వివేక్ రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రమిక వెత్తె కాకుండా అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రంలోను పలుమార్లు మంత్రి పదివి చేసిన సుదీర్ఘ రాజకాయ చరిత్ర కల్గిన వెంకటస్వామి కొడుకు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.యస్ పార్టీకి మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర వహించిండు. సోనియా గాంధీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు సాసు చేయించటంలో వెంకటస్వామి పాత్ర ఉంది. ఎమైతే నేమి తెలంగాణ వచ్చింది. అయితే అవసరానికి బొంత పురుగు నైనా ముద్దుపెట్టుకొనే టి.ఆర్.యస్ నాయకునికి అవసరం లేదనుకుంటే నిర్దక్షక్ష్మీ్యంగా కాలతో తన్నె స్వబావం కూడా ఉంద. అవిదంగా చంద్రశెఖర్రావుకు వివేక్ మధ్య విబేదాలు పొడుసూపినవి. అందుకు మరో కారణం కూడా ఉంది. కేసిఆర్ మొదటి సారి ఎన్నికలకు పోయినప్పుడు తల ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిండు. తాను తెలంగాణ రాష్ట్రనికి కావాలి కుక్కలా ఉంటాగాని ఏ పదవులు అశించనని పలు సందర్భాల్లో ప్రకటించిండు. అవిదంగా తెలంగాణలో టి.ఆర్.యస్ అధికారంలోకి వస్తె మొదటి ముఖ్యమంత్రివి నువ్వె నంటూ వివేక్కు ఆశ చూపి డబ్బు దస్కం కాజెసిండు. చివరికి ఎన్నికల ముందు సీట్లు పంచేకాడ వివిక్ను ముఖ్యమంత్రి పోటీదారుడుగా రాకుండా చేయ్యటానికి వివేక్కు పార్లమెంటు సీటు ఇచ్చిండు. అంతే తనను ముఖ్యమంత్రి కాకుండా చేయటానికి కపట నాటకం అడుతున్నాడని గ్రహించిన వివేక్ టి.ఆర్.యస్ పార్టీని వీడి మళ్ళి కాంగ్రెసు పార్టీలో చెరి అ పార్టీ తరుపున పెద్దపల్లి పార్లమెంటుకు పోటి చేసిండు. కాని అప్పటికి టి.ఆర్.యస్ గాలి ఉండటం వలన అపార్టీ అభ్యర్థి చెతలో ఓడిపోయిండు.
సామన్యులకైతే ఎవడు అధికారంలో ఉన్నా ఓరిగేది ఏముండదు కాని వ్యాపార వెత్తలకు పారిశ్రామిక వెత్తలకు అధికారం అండలేకుండా మనుగడ సాధించటం కష్టం అప్పటికి కెంద్రంలో రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెసు పార్టీ, ఒడిపోయి కెంద్రంలో జిజెపి ప్రభుత్వం రావటంతో రెంటికి చెడ్డ రేవడిలా అయింది వివేక్ రాజకీయ పరిస్థితి. దాంతో ఆయన చివరికి రాజీపడి పోయి అనివార్యంగా మళ్ళీ టి.ఆర్.యస్ పార్టీలోకి వచ్చిండు. అట్లా వచ్చిన వారికి ఎదో నామినేటడ్ పదవి అయితే కెసిఆర్ ఇచ్చిండు కాని వీడు ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని బావించిన కెసిఆర్అదను చూసి వివేక్ను చావు దెబ్బతీసిండు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు చివరినిముషం ముగిసే వరకు నాన్చి చివరినిమిషంలో వెంకటేశ్కు సీటు ఇచ్చిండు. వివేక్ ఇంకో పార్టీ తరుపున ముఖ్యంగా కాంగ్రెసు తరుపున పోటీ చెయటానికి వీలు లేకుండా చేసిండు. దాంతో వివేక్కు అటు టి.ఆర్.యస్ తరుపున కాని కాంగ్రెసు తరుపున కాని పోటికి నిలబడే పరిస్థితిలేకుండా పోయింది.
కాంగ్రెసు పార్టీ చివరి నిముషం వరకు వివేక్ను సీటు ఇవ్వటానికే ఎదురు చూసింది. కాని చంద్రశెఖర్రావు వారికి అటు వంటి అవకాశం ఇవ్వలేదు.
కాని చాల విచిత్రం ఏమిటంటే కాంగ్రెసు తరుపున ప్రస్థుతం పోటీ చేస్తున్న చంద్రశెఖర్రావు కూడా ఒకప్పుడు టి.ఆర్.యస్ పార్టీకి చెందినవాడు. అ పార్టీ తరుపున ఎమ్మెల్యెగా నెగ్గి రాజశెఖర్ రెడ్డి ప్రభుత్వంలో టి.ఆర్.యస్ పార్టీ తరుపున మంత్రిగా చేసినవాడు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి తన భవితవ్యాన్ని తెల్చుకోవటానికి బరిలోకి దిగిండు.
జిజెపి పార్టీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంనుండి నిన్న మొన్నటి నక్సలైట్ మూమెంటు వరకు అనేక పోరాటలు జరుగటం వలన ప్రజల్లో కమూనిస్టు బావజాలం ఎక్కువ. పలితంగా జిజెపి మతోన్మోద రాజకీయాలు తెలంగాణలో అంతగా ప్రబావం చూపలేక పోయింది. హైద్రాబాద్ పట్టణంలో మాత్రం ఎం.ఐ.ఎం. ప్రాబల్యం ఎక్కువ ముస్లీంమతో న్మోదాన్ని రెచ్చగోట్టి అక్కడ అ పార్టీకి ఒక పార్లమెంటు సీటు, అరేడు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు గెలుస్తుంటాయి. దానికి ప్రతిగా అ ప్రాంతంలో బిజెపి హిందు సమాజాన్ని రెచ్చ గొట్టె కొంత బలంసంపాదించి అక్కడి నుండే ఒక రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది తప్ప తెలంగాణ వ్యాపితంగా దాని ప్రాబల్యం తక్కువ కాని ఈ సారి కెంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వలన దాని అండ దండలతో బిజెపిపార్టీ తెలంగాణలో పాగా వేయాటానికి సిద్దమై చాలచోట్ల తను అభ్యుర్థులను నిలిపింది. అవిదంగా బిజెపి కూడా పెద్దపల్లి అసెంబ్లికితన అభ్యర్థిని నిలిపింది.
ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఇది వరలో అయితే రెపు ఎన్నికలనగా అంతో ఇంతో తాగబోయించి, పదో పర్కొ చేతుల్లో పెట్టి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఖర్చుబాగా పెరిగిపోయింది. చివరికి మీటింగ్లు పెట్టాలన్నా ర్యాలీలు తీయలన్నా జనాలకు బిర్యాని పొట్లాలు ఇచ్చి మందు పోసి మీదికేలి రోజు మూడు నాలుగు వందల చేతిలో పెడ్తెకాని జనం రావటంలేదు. ఇవ్వాళ ఈ మీటింగ్లకు పోయిన వాళ్ళె మరో రోజు మరో పార్టీ పిలిచే మీటింగ్ లకు పోతాండ్లు. ఇకతాగు బోతులకైతే ఎన్నికలు వచ్చిన వంటే పండుగే మరి.
కాంగ్రెసు నాయకుడు ఒక పర్యయం వచ్చి కాలనీలో ఇల్లిల్లు తిరిగి పోయిండు. టి.ఆర్.యస్ నాయకుడు వెంకటేశం మాత్రం కాలనీకైతే రాలేదు. కాని ఆయన అనుచరుడు సత్యనారయణను పంపించి గోదవరిఖనిలో తమనాయకులతో జరిగే బారి బహిరంగ సభకు మనిషికి ఐదువందలు ఇచ్చి మరి తీసుకపోయిండ్లు.
రామయ్య కాలనీలో కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు. ఒకటితెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ల దైతే రెండోది కాంగ్రెసు వాళ్ళది. ఈ రెండు పార్టీలు కాకుండా బిజెపికి చెదిన అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నడుకాని అతనికి అంతగా అర్థిక స్థోమత లేదు. ఎదో ఒకటి రెండు సార్లు జీపుల్లో వచ్చి ఒక రౌండు కాలనీలో తిరిగి పోయిండ్లు. అది కూడా కంట్రాక్టరు రంగయ్య బలవంతం మీద.
కాలనీలో కాంగ్రెసు పార్టీకి చిన్న చితుక కంట్రాక్టులు చేసే జానకిరాం నాయకత్వం వహిస్తే టి.ఆర్.యస్ పార్టీకి సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు.
గంగమ్మకల్లు బట్టీ కాడ సాయంత్రమే కాదు. పొద్దంత కూలీలు ముగుతున్నారు.
‘‘మీరేమి రంది పడకుండ్లే కడుపు నిండా తాగుండ్లే బిల్లు సంగతి నేను చూసుకుంటా’’ అంటూ జానికిరాం బరోసా ఇచ్చిపోయిండు.
సాయంత్రం అయితే కనుకమల్లు ఇంటికాడ చీప్ లిక్కర్ పంచుతాండ్లు. అవిషయం తెలిసి రాంలాల్ వచ్చి నాగయ్యను కనకమల్లు ఇంటికి తీసుక పోయిండ్లు. అక్కడ రాజీరు కనిపించి ‘‘కొడుకు టి.ఆర్.యస్ తండ్రి కాంగ్రెసు’’ అన్నాడు వ్యంగంగా....
అమాటకు నాగయ్యకు మనసుకు బాదేసింది సత్తెన్న గులాబి జెండా పట్టుకొని తిరుగుతాండు. నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సత్యనారాయణ సత్తెయ్యను వెంటేసుకొని తిరుగుతండు. ‘రామయ్య కాలనీ బాధ్యతంత నువ్వె చూడాలి’ అంటూ సత్యనారాయణ సత్తెయ్య మీద బారం పెట్టిండు.
అప్పటి నుండి సత్తెయ్య క్షణం రికామి లేకుండా తిరుగుతాండు. అవసరం కొద్ది ఎమ్మెల్యే రాసుక పుసుక తిర్గెసరికి సత్తయ్య ఉబ్బితబ్బిబ్బు అయి ఎన్నికలు తప్ప వేరే లోకం లేకుండా పోయింది.
రాజీరు మాటలకు చిన్నబోయిన నాగయ్యను చూసి రాంలాల్ ‘‘వాడుత్తతాగుబోతు... వాని ఇంట్లకేలి ఎమన్నా ఇస్తాడా.. మంచి మంచోళ్లె ఇయ్యల ఈ పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటాండ్లు. రాజీరు మాటలేమి పట్టించుకోకు అన్నాడు.
అయిన నాగయ్య మనసు ఓప్పక కనకమల్లు ఇంట్ల అడుగుపెట్టక అటునుంచి అటే తిరిగి వచ్చిండు. అది చూసి కనకమల్లు ఎన్నికల సమయంలో ఇటువంటివ ఏం పట్టించుకోవద్దు అంటూ రాజీరు మీద కోపం చేసిండు.
తెంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో మొదటి నుండి పని చేసిన కవారిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారిన వాన్ని పిలిచి టికట్ ఇచ్చుడేందీ అంటూ మొదటి నుండి జెండా మోసిన వాళ్ళు కొందరు అలిగి పార్టీ విడిచిపోయిండ్లు. మరికొందరిని బురదగించి నామినేట్డ్ పదువులు వస్తయని ఆశ చూపి కొందరిని డబ్బులిచ్చి కొందరిని అధికార పార్టీ కాపాడుకొన్నాది.
ఓట్ల కోసం నాయకులు కులాల పేరు మీద ప్రాంతాల పేరుమీద జనాలను చీల్చిండ్లు. జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి ‘‘ఇదిగోమనమంత ఒక్కటిగా ఉండాలి. లోకలోల్ల మాటలు విని మనం బొర్లా పడవద్దు. కాంగ్రెసుపార్టీ అంటే ఎనకటి నుంచి ఉన్న పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్థాపించిన పార్టీ కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చె ప్రాంతీయ పార్టీలు ఇవ్వాల ఉంటాయి రేపు మట్టికలుస్తయి వాటిని నమ్ముకుంటే లాభం లేదు. నేను చంద్రశేఖర్ సారుతోని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఆయన చేసే మొదటి పని ఏటంటే మన అందరికి రేషన్ కార్డులు ఇప్పిసతనన్నడు. మన ఓరియా వాళ్ళకు తాగేందుకు మంచి నీళ్ల పంపులు వేయిస్తనన్నడు.
‘‘అంటూ చెప్పుకొచ్చిండు.
జనాలకు ఆ మాటలు సమజ్ కాలే ఇయ్యాల ఎన్నికలు వచ్చినయిని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవటానికి ఇటు ఓరియా వాళ్ళమని అటు ఆంద్రోళ్లని ఎదో ఎదో చెప్పుతున్నరు కాని వాళ్ల జీవితంలోవాళ్ళె ప్పుడు అ తెడాలు పాటించనే లేదు. కూలి చేసేకాడ అందరు సమానమే. ప్రాంతలు వేరైనా వారందరి బాధలు ఒక్క తీరుగానే ఉన్నాయి. ఒకరి కష్ట సుఖల్లో మరోకురు పాలుపంచుకున్నారు. అక్క తమ్ముడు అంటూ వరసలు పెట్టి పిలుచుకున్నారు. అంతెందుకు నెల రోజుల క్రింద లారీమీది క్లినర్ పనలు చేసే చన్నులాల్ చనిపోతే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు కలిసి మనిషింత చందాలు వేసుకొని చావు చెసిండ్లు.
చన్నులాల్కు ఎనక ముందు ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో ఓరిస్సాలోని మారు మూల గ్రామం ఒక్కడే పని వెతుక్కుంటు వచ్చిండు. అందరితో కలవిడిగా ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు. ఎమైందో ఎమో వానికి టి.బి. వచ్చింది. చీకేసిన బొక్కలా బొక్కలు తేరి, తిండికి లేక ఎండి పోయి ఎండిపోయి సచ్చిండు.
జానకిరాం కూడా ఒకప్పుడు అందరిలాగే పొట్ట చేతపట్టుకొని బ్రతక వచ్చిండు. కాని కాస్త హుషారు తనం ఎక్కువ. అట్ల ఇట్ల చేసి కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీ పనిచేస్తూ క్రమంగా సబ్ కంట్రాక్టులు పట్టి నాల్గు పైసలు సంపాదించిండు. ఎవరిని లెక్క చేసేటోడుకాదు. అటువంటి వాడు ఎన్నికల వచ్చే సరికి మెత్తమెత్తగా మాట్లాడుతాండు. లేని ప్రేమ వొలక పోస్తాండు.
‘‘ముందుగాల పంపులు వేయించుండ్లీ, నీళ్ళు దొరకక హరిగోస పడ్తానం’’ అంటూ బసంత్ నాగ్ భార్య సుభనా అడ్డుతగిలింది.
జానకిరాం సుభన కేసి చూసి ‘‘ఎన్నికల్లోగెలిచినంక చేయించే మొదటి పని అదే’’ అన్నాడు మరోసారి.
‘‘ఆఎన్నికలైనంకమా మొఖం ఎవలు చూస్తరు’’ అంటూ హరిరాం అడ్డుపడ్డడు.
‘‘ఎన్ని ఏన్నికలు చూడలేదు ఎన్నికలప్పుడు గిట్లనే చెప్తరు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్లు. రెషన్ కార్డులు ఇప్పిస్తమన్నారు. పంపులు వేయిస్తమన్నారు. ఓట్లు వేయించుకొని గెలిచి ఇటు మొఖంరాలే’’ అంటూ మరోకరుగుణిగిండు.
జానకిరాంకు మనసులోకోపం కల్గింది కాని బయట పడలేదు. మొఖం మీద శాంతాన్ని తెచ్చుకొని’’ టి.ఆర్.యస్ వాళ్ళ పనే అంత. ఎన్నికలప్పుడు మాట చెప్తరు. గెలిచినంక ఇటుదిక్కు అయినా రారు. కాని మన సారు అట్లా కాదు. మాటిస్తె చేసేదాక నిదురపోడు’’ అన్నాడు బరోసాగా...
‘‘ఆ అందరుగంతే’’ అన్నాడు మరోకరు.
పరిస్థితి చెయ్యిదాటెట్టుందని జానకి రాంకు అర్థమైంది. ఇంకా ఎక్కువసేపు మీటింగ్ పొడిగిస్తె ప్రమాదమని బావించిండు.
‘‘ఇదిగో నామాట నమ్ముండ్లీ. మనమంతా ఒక్కకటే ఈ సారి మాట తప్పెదుంటే మళ్ళీ మీకు నా మొఖం చూయించ’’ అన్నాడు.
మీటింగ్ ముగించి జానకిరాం సోన్లాల్, ప్రసాత్, రాంజీని, గోపాల్, బాసంతనాగ్ను వెంట బెట్టుకొని వెళ్ళిపోతుంటే సుభాన పెద్ద గా గొంతు చేసుకొని ‘‘ఇంట్ల తిండికేం లేదు. తాగితందానలాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదన్నా ఉంటే మాకే ఇచ్చిపోండ్లి’’అంది.
జానకిరాం చిన్నగానవి ‘‘ఇప్పుడదేంలేదు’’ అంటూ వాళ్ళను తోలుకొని పోయిండు.
రామయ్య కాలనీలో జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి మాట్లాడిన సంగతి తెలిసి సుబ్బారావు అగమెఘాల మీద తెలుగోళ్ళ గుడిసెలను చుట్టెసి బెంగాలివాళ్ళ గుడిసెల కేసి నడిచిండు.
‘‘బెంగాలి వాళ్ళయి ఎన్ని ఓట్లుంటయి’’ అని సత్తయ్యను అడిగిండు.
‘‘ఎంతలేదన్నా యాబై అరువై ఉంటయి’’ అన్నాడు సత్తయ్య వినయంగా...
ఒక్క ఓటు కూడా జారిపోవద్దు.. అందర్ని కలువాలి ఎట్లయితే వింటరో అట్లా విన్పించాలి. డబ్బుల గురించి అలోచించవద్దు... ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓట్లు మనకు పడాలి’’అన్నాడు సుబ్బరావు.
సమస్యేలేదు సార్... ఒక్క ఓటు కూడా అపోజిషన్కు పోదు... అందరు మనోళ్ళె’’అన్నాడు సత్తయ్య...
‘‘అట్లాఅనుకోవద్దు...వోవర్ కాన్పిడేన్స్కు పోతే అసలుకే మోసం వస్తది’’ అన్నాడు సుబ్బారావు బొమ్మలు ఎగరేసి.
సుబ్బారావు తన అనుచరులతో కలిసి బెంగాలి వాళ్ళ గుడిసెలకేసి నడిచిండు.
తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వచ్చిన వారికి ఉపాధి కల్పించటంకోసం దేశంలోని వివిద ప్రాంతలకు పంపించిండ్లు. అట్లా కొంత మంది రామగుండుం వచ్చిండ్లు. ఎన్టిపిసి పనులు సాగినప్పుడు అందులో చాల మంది పని చేసిండ్లు. కాని నిర్మాణపు పనులు పూర్తయిన తరువాత పనులు లేక చాలమంది వేరే ప్రాంతాలకు వలసపోయిండ్లు. చాల కొద్ది మంది మాత్రం మిగిలిండ్లు.
బెంగాలికార్మికులు ఉండే గుడిసెలు మిగితా కార్మికులు ఉండే గుడిసెల కంటే కాస్త బిన్నంగా ఉంటాయి. ఉన్నంతలో గుడిసేలను బందోబస్తుగా కట్టుకుంటరు. శుచి శుభ్రత పాటిస్తరు.
సుబ్బారావు తన అనుచరులతో అక్కడికి చేరుకునే సరికి టి.కే సర్కార్ ఇంటి మీద కాంగ్రెసు జెండా ఎగురుతు కన్పించింది. సత్తయ్య కేసి ఇదెంటన్నట్టుగా చూసిండు.
‘‘వాడుత్త తలతిక్కవాడు. ఊరంత ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టుగా ఉంటాడు. వానితో అయ్యదిమి లేదు. మిగిత వాళ్ళంత మనతోనే’’ అన్నాడు సత్తయ్య...
సుబ్బయ్య ప్రచారానికి వసున్న సంగతి సత్తయ్య ముందే బెంగాలి కుటుంబాలను కలిసి చెప్పి పెట్టి ఉంచిండు. కొంత మంద పనులు కూడా మానుకొని ఉండిపోయిండ్లు. వీళ్ళు అక్కడికి పోయే సరికి బినయ్ మండల్, డూకిరాం, విమల్పాండే ఎదురోచ్చి రెండు చేతులు జోడించిండు. సుబ్బారావు ప్రతిగా చిర్నవ్వులు చిందిస్తూ’’ ఏంటీ సంగతి ఎట్లా ఉంది’’ అని అడిగిండు.
‘‘అంత ఓకే సార్’’ అంటూ బినయ్ మండల్ బదులిచ్చిండు. సుబ్బారావు సర్కార్ ఇంటికేసి చూస్తూ’’ కాంగ్రెసు వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది’’ అంటూ తనుమానంగా చూసిండు.
‘‘అది కాదు సార్ టికే సర్కార్ జానకిరాం మనిషి ఆయన్ని పట్టుకొనే క్యాజువల్ వర్కర్ అయ్యిండు’’ మిగితా వాళ్ళంతా మనం ఎంత చెప్పితే అంతా’’ అన్నాడు మిమల్పాండే...
‘‘ఎమో’’ అంటూ సుబ్బారావు దీర్ఘం తీసిండు.
‘‘అదేం లేదు సారు మా మాటలు నమ్మండి’’ అన్నాడు బినయ్మండల్...
గుడిసెల మధ్య కాస్త కాళీస్థలంఉన్న చోట పెరిగిన వేపచెట్టు నీడన మూడు కుర్చిలు వేసి ఉన్నాయి. అందరు అటుకేసి నడిచిండ్లు. సబ్బారావు, సత్తయ్య మరోకరు కుర్చిలో కూచోగా మిగిత వాళ్ళంత వాళ్ళ చుట్టు నిలబడ్డారు.
మీటింగ్ అనే సరికి అడోళ్ళు మొగోళ్ళు పిల్లలు వచ్చిండ్లు. అరువై ఎండ్ల పైబడిన సరస్వతి మండల్ కూడా వచ్చింది. ఆమెకు కండ్లు సరిగా కనిపిస్తలేవు. ఎవరో పెద్ద లీడర్లు వస్తరంటే అగం అగం వచ్చింది. ఆమె కొడుకు ‘కోశన్’ మండల్ను కంట్రాక్టరు పనిలో నుండి తీసేసిన తరువాత ఇంట్లో వెళ్లటం కష్టమైతంది. పెద్ద లీడర్లు వస్తాండ్లు అంటే వాళ్ళను బ్రతిమిలాడి ఎట్లనో అట్లనో కొడుకును తిర్గి పనిలో పెట్టించాలనే యావతో వచ్చింది.
సుబ్బారావు కాసేపు అది ఇది మాట్లాడన తరువాత మెల్లగా అసలు విషయం ఎత్తిండు ‘‘మీకు అందరికి ఎన్నికలు జర్గుతున్న సంగతి తెలుసు. మన టి.ఆర్.యస్పార్టీ తరుపున వెంకటేశ్ అన్ననను పార్టీ నిలబెట్టింది. మనమంత కలిసి ఆయన్ని గెలిపించాలి మీకేమన్నా సమస్యలుంటే అవి పరిష్కరిస్తాం. ప్రభుత్వం మనది మనం ఎదీ అనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’’ అంటూ క్షణమాగి అందరికేసి చూసి మళ్ళీ మాట్లాడ సాగిండు.
‘‘మీ సమస్య ఎందో నాకు తెలియందాకాదు. డ్యాంకట్టినప్పటి నుండి మీరు చేపలు పట్టుకొని బ్రతుకుతాండ్లు. మధ్యలో సొసైటీలు పుట్టుకొచ్చి మిముల్ని బయటికి నెట్టెసిండ్లు. దాంతో చాల మందికి బ్రతుకు తురువు పోయింది’’ అన్నాడు.
‘‘నిజమే’’ అన్నట్టు చాల మంది తలలు అడించిండ్లు.
‘‘అందుకేనేనేమంటానంటే సొసైటీ వాళ్ళు బ్రతకాలి, మీరు బ్రతకాలి అందరు బ్రతికే ఉపాయం అలోచించాలి. అందుకే ఎన్నికలు అయిన తరువాత వెంకటేశన్నా మీరు కూడా డ్యాంలో చేపలు పట్టుకునే ఎర్పాటుల చేయిస్తనన్నడు. వెంకటేశన్న గురించి మీకు తెలియదు అల్తు పాల్తు ముచ్చట్లు చెప్పెటోడు కాదు. ఎదాన్నా చేస్తనంటే అరునూరైనా చేస్తడు అటువంటి మనిషి’’ అంటూ చెప్పుకొచ్చిండు.
‘‘మీరా పనిచేస్తే మేమంత రుణపడి ఉంటాం’’ అంటూ బినయ్ మండల్ రెండు చెతులు జోడించిండు.
‘‘ఆ విషయం మాకు వదిలేసి మీరు నిర్రందిగా ఉండండ్లీ’’ అంటూ సుబ్బారావు వెంట వచ్చిన మరో లీడర్ కేశవులు బరోసా ఇచ్చిండు’’
జనం సంతృప్తిగా చూసిండ్లు.
సరస్వతి మండల్కు ఈ మాటలేమి తలకు ఎక్కటంలేదు. తన కొడుకు సంగతెందో తెలుసుకోవాలని వచ్చింది. మనసులో తొలుస్తున్న అవెదన మాటల రూపం సంతరించుకోగా....
అయ్యా మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంటలేడు’’ మీరు చెప్పివాన్ని పనిలో పెట్టియ్యాలి అంది.
‘‘దానికి వీళ్ళెమి చేస్తరే’’ విమల్ పాండే ముసల్దాని మాటకు అడ్డుపోయిండు.
‘‘మరెందుకు వచ్చిండ్లు’’
‘‘ఓట్లు వెయ్యాలి ఓట్లు’’ఎవరో అన్నరు.
‘‘ఓట్టు వేస్తే ఏమొస్తది. ఎన్నిసార్లు వెయ్యాలట’’ అంటూ మసక బారిన కండ్లతోని పరిక్షగా చూసింది.
గా ముసల్దాని మాటలు పట్టించకోకండ్లీ సారు ఎడ్డ ముసల్ది భర్త చనిపోయిండు. కొడుకుకు పనిలేక తిరుగుతాండు’’ అన్నాడు గోపాల్.
సుబ్బారావు తెలిగ్గా నవ్వి ‘‘ఎర్కె ఎర్కె’’అంటూ ముసల్దానిమాటలు పట్టించుకోకుండా బినయ్మండల్తో మాటల్లోకి దిగిండు.
‘‘అయ్యా ఏం చెప్పకపోతిరి’’ ముసల్ది మళ్ళి అడిగింది.
‘‘అరేయ్ ముసల్దాన్ని ఇక్కడి నుంచి తీస్కపొండ్లిరా’’ ఎవరో కసిరిండు.
ఓ ఇద్దరు ముందుకు వచ్చి అవ్వ సార్ నీ కొడుకును పనిలో పెట్టిస్తరు... పదపద అంటూ రెండు రెక్కలు పట్టుకొని దాదాపు బలవంతంగా ప్రక్కకు తీస్క పోయిండ్లు.
అ ముసల్ది గింజుకుంటూ ‘‘పనులు లేకుంటే మనష్యులు ఎట్లా బతుకతరు. తిండిలేక కడుపులు మాడ్చుకొని చస్తానం’’ అంటూ గింజుకుంటుంది.
కాసేపు మాట్లాడిన తరువాత ‘‘మీకే మన్నా అవసరం ఉంటే సత్తన్న చూస్తడు... ఎవరు మోహమాట పడవద్దు...కాని ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’’ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు పోవటానికి లేచిండు. బినయ్ మండల్ చాయ్తాగి పోవాలని బలవంతంచేసిండు. కాని ఇంకా క్రషర్ నగర్ కాకాతియ నగర్ తిరుగాల్సి ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ ఇంటి కాడ తీరుబడిగా చాయ్ తాగుతా’’ అంటూ సుబ్బారావు లేచిండు.
రోడ్డుకు ఒక వైపు ఎన్టిపిసి దేదీప్యమానంగా ఉంటే రోడ్డుకు అవలవైపున దుకాణాలు, వర్క్షాపులున్నాయి. వాటిని అనుకొని గుట్ట బోరుమీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే పులి పాకల్లోనే ఎంత లేదన్నా రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.
ఎన్నికలప్పుడు తప్ప నాయకులు వాళ్ళ గుడిసెలకు రావటం జరుగదు. ఎండ్లు గడుస్తున్న వాళ్ల బ్రతుకుల్లో మార్పెమి రాలేదు.
వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఒక విదమైన కపం వాసన గప్పుమంది. అయినా అదేమి పట్టించుకోకుండా ముందుకు సాగిండ్లు. భగవాన్ మెస్త్రీకి వాళ్ళ కంట్రాక్టరు దివాకర్రావు అరోజు అక్కడ మీటింగ్ ఉండే సంగతి ముందే చెప్పి పెట్టడం వలన, ఆయన జనాలను కుప్పెసి నాయకులకోసం ఎదురుచూస్తుండి పోయిండు.
సుబ్బారావు రావటం చూసి భగవాన్ మెస్త్రీ ఎదురొచ్చి ఆయన్ని తొడ్కొని పోయి ఒక్క రాల చెట్టు కాడికి తీసుక పోయిండు. అప్పటికే అక్కడ పోగేసిన జనం పులుకుపుకున చూస్తున్నారు.ఒంటిమీద సరిగా బట్టలు లేని పిల్లలు రంగురంగుల జెండాలను జనాలను చూసి హడావిడి చేస్తున్నారు.
భగవన్ మేస్త్రీ సుబ్బారువు కేసి అబ్బురంగ చూసి ‘‘వీళ్ళంత మనోళ్ళె సారు...’’ అన్నాడు.
సుబ్బారువు చిన్నగా చిర్నవు నవ్వ తలాడించిండు. ‘‘తీళ్ళంతా దివాకర్రావుదగ్గర పని చేసేవాళ్ళే కదా’’ అన్నాడు.
‘‘చాల మంది వాళ్ళే సార్ కొద్ది మంచి మాత్రం అక్కడిక్కడ కూలిపనులు చేసేవాళ్ళు ఉన్నారు. కానిమెజార్టీ మనవాళ్ళే’’అన్నాడు భగవాన్మేస్త్రీ...
అప్పటికి మధ్యహ్నం దాటి పోయింది. కడుపులో అకలిగా ఉన్నా, మళ్ళి ఇక్కడి దాక రావటం ఎందుకని సుబ్బారావు ఒక్కడి దాక వచ్చిండు. దాంతో ఆయన వీలయినంత తొందరలో మీటింగ్ ముగించాలనే అలోచనలో ఉండిపోయి, ఎక్కువ అలస్యం చేకుండా, అక్కడ గుమి కూడిన జనాలను ఉద్దెశించి మాట్లాడటం మొదలు పెట్టిండు. తాము ఎన్నికల్లో గెలిస్తె ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తియ్యతియ్యని మాటలు చెప్పసాగిండు.
దస్త్రు భార్య శ్రావణబాయ్ అతని మాటలకు అడ్డుపోయి ‘‘పోయిన సారి ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు బోరింగ్లు వెయించిండ్లు. కాని అందులో చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చె తోవల ఎన్టిపిసి మురికి నీళ్ళ కాలువ ప్రక్కన మేము తవ్వుకున్న బాయి నీళ్ళె తాగుతనం. ఎండ కాలం వస్తై అయిత నీళ్ళు కూడా దొరకతలేవు. గదాని సంగతెందో చూడాలి’’ అంది పెద్ద గొంతుక చేసుకొనని...
టీకురాం భార్య పుష్ప కల్పించుకొని ‘‘వర్షకాలంలో కూడా నీళ్లకు కరువువొస్తాంది. బాయిలకు మురికినీరు చేరి తాగవశం అయితలేదు’’ అంది. ‘‘రేషన్బియ్యం వస్తలేవు’’ అన్నారు మరోకరు.
సుబ్బారావు ఒపిగ్గా విన్నడు. ‘‘మీకు ఏఏ సమస్యలు ఉన్యాయో అవన్ని మన భగవాలన్ మేస్త్రీకి చెప్పండి. ఈ సారి మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం’’ అన్నాడు. భాగవన్ మేస్త్రీ కేసి తిరిగి ‘‘వీళ్ళ సమస్యలన్ని రాసుకొని వచ్చి అఫీసుకాడికి రా, ఎన్నికలు అయిన తరువాత చేసే మొదటి పని అదే’’ అన్నాడు.
భగవాన్ చెమట కంపుతో నిండిన అపరిసారల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలేకు పోయిండ్లు. బలవంతుపు పేరంటం ఎదో ముగించుకున్నట్టుగా, ఎంత హడావిడిగా నైతే వచ్చిండ్లో అంతే హడావిడిగా ఎల్లిపోయిండ్లు.
పోతు పోతు భగవాన్ మేస్త్రీని ప్రక్కకు పిలిచిన సుబ్బారావు ‘‘సాయంత్రం వీళ్ళ ఎర్పాట్లు ఎవో నువ్వె చూడాలి. ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’ అన్నాడు గుమ్మనంగా...
రాజీరు మాటలు అవమానం అన్పించి కోపంతో నాగయ్య ఇంటికైతే వచ్చిండు కాని మనసు లో మాత్రం తాగాలనే కొరిక అలాగే ఉండిపోయింది.
కాలనీలో చినన్న ప్దె అనకుండా తాగి ఊగుతాండ్లు. కాలనీలో రెండు గ్రూపులుగా చీలి పోయిండ్లు. ఒకటి టి.ఆర్.యస్ పార్టీ అయితే మరోకటి కాంగ్రెసు వాళ్ళది. ఎవరు ఖర్చుకు వెనుకాడటంలేదు. గంగమ్మ కల్లు దుకాణం కాడ జాతర సాగుతుంది. ఇక మీటింగ్లప్పుడు, ఎదైనా జూల్సు తీసినప్పుడైతే పండుగైతాంది. బిర్యాని పొట్లాలు, చీప్ లిక్కర్ పవ్వలకు ఎక్కలేదు. అకలికి మొఖం వాచిపోయి ఉన్న వాళ్ళు తినేకాడికి తిని బిర్యాని పొట్లాలను చాటు మాటుగా ఇంటికి తీస్కపోతాండ్లు. ఇదంతా సుబ్బారావు కనిపెట్టక పోలేదు... లేకి ముండా కొడుకులు... ఎన్ని రోజులు తింటరో తననియ్.. అనుకొన్నాడు. పై నాయకులెమో పైసల గురించి లెక్క చేయకుండ్లి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఓట్లు మాత్రం మనకు పడాలి’’అంటున్నారు.
టి.ఆర్.యస్ పార్టీ వాళ్ళ దాటికి కాంగ్రెసు వాళ్ళు తట్టుకోవటం కష్టమైతంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి శెఖర్రావుకు టిక్కట్ అయితే ఇచ్చిందికాని పార్టీ పంపించిన డబ్బులు ఏమూలకు సరిపోతలేవు. తన చేతి చమురు కొంత ఖర్చు పెట్టిండు కాని అపోజిషన్ వారితో సరితూగటం లేదు.
టి.ఆర్.యస్ పార్టీ అధికారంలో ఉంది. దాని అధినాయకునికి ఎన్నికల్లో ఎట్ల గెలువాలో, •నాన్ని ఎట్లా బురిడి కొట్టించాలో తెలిసినంత విధ్య మరోకరకి తెలియదు. దానికి తోడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిండు. ఎట్లాగైనా చేసి ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉండిడబ్బుకు ఎనక ముందు చూడటం లేదు.
నాగయ్య ఇంట్లా నుండి బయిటికి వచ్చె సరికి గులాబి రంగు జెండాలు పట్టుకొని చిన్న పిల్లలు జైతెలంగాణ అంటూ బిగ్గరగా అరుచుకుంటూ ఊరేగుతాండ్లు. తన ముందు నుండే పోతున్న పిల్లల్లో ఎనిమిదెండ్ల దస్త్రు కొడుకు వినయ్ను ఆపిన నాగయ్య ఉత్సుకత కొద్ది ‘‘జెండాలు ఎక్కడియిరా’’ అని అడిగిండు.
‘‘సత్తెన్న ఇచ్చిండు’’ పైసలు కూడా ఇచ్చిండు అన్నాడు పిల్లవాడు ఉత్సాహంగా...
కొడుకు పేరు చెప్పె సరికి నాగయ్య మనసులో బాదేసింది. ఎన్నికల్లో వాడు కాలనీలో అన్ని తనై వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన ‘‘ఊరంత పైసలు పంచుతాండు. పవ్వలుపంచుతాండు కాని అయ్య అని ఒక పవ్వ అయినా ఇయ్యక పాయే’’ అంటూ తనలో తనే గుణుక్కున్నడు.
పిల్లలు అరుచుకుంటూ అతన్ని దాటేసి పోయిండ్లు. విసురుగా ఇంట్లోకి వచ్చిన నాగయ్యకు భార్య ఎదురు పడింది. దాంతో కొడుకు మీద కోపం భర్య మీద తీల్చిండు.
‘‘ఊరంత పవ్వలు పంచుతాండు... ఇంట్లా అయ్య ఉన్నడన్న జాషే లేకపాయే’’ అన్నాడు విసురుగా...
శాంతమ్మ ఒకసారి భర్తకేసి తేరపారచూసి ‘‘ ఆ పాపపు సోమ్ము తాగకుంటెంది ఇయ్యల తాగిపిస్తరు తినిపిస్తరు.. తరువాత మొఖం చాయించరు, జనం ఇంట్ల పాడుగాను ఎర్రి లేసిన కుక్కల తీర్గ పుణ్యానికి వచ్చిదంటే పీకలదాక తాగుతండ్లు. అంటూ గయ్యిమంది.
భార్య కోపం చూసి నాగయ్య వెనక్కి తగ్గి ‘‘అదికాదే... అంటూ ఎదో చెప్పబోయిండు.
‘‘వాడెమో పని బందు పెట్టి పిచ్చోని తీర్గ ఎన్నికలంటూ తిరగబట్టె, ఇంటికాడ కోడులు ఒక్కతే కూలిపనులు చేసుకుంటూ కుటుంబం ఎల్ల దీయబట్టె. ఎన్నికల్లో తిరుగతే ఎమోస్తదట.... ఇయ్యల అవసరం కొద్ది సత్తెన్నా అని బుదగరించే సరికి వీడు ఎక్కడ అగుతలేడు. నాకు వాడు ఎరుకే వీడు ఎరుకే అంటూ విర్ర వీగుతాండు. నాకు రేపు ఎన్నికలు అయిపోని ఎవ్వడన్నా లీడర్ వీని మొఖం చూస్తడా? అసంగతి వానికి అర్థం అయితలేదు... చేసుకుంటే బ్రతికటోళ్ళం.... ఎవని బుద్ది వాని కుండాలే’’ అంటూ కొడుకు మీద కోపం చేసిండు.
నాగయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి పోతుంటే రాంలాల్ కేకేసి నాగన్న ఎం చేస్తానవు. ఇందక పోదం రావే’’ అని పిలిచిండు.
నిన్న జరిగిన అవమానం గుర్తుకు విచ్చి నాగయ్య ‘‘మళ్ళి ఎక్కడికి’’ అని అడిగిండు.
‘‘సత్తెన్న గోపాల్ ఇంటికాడ పవ్వలు పంచుతండట... పోదాం రావే’’ అన్నాడు నోరు తెరిచి....
సత్తెన్న పేరు చెప్పెసరికి నాగయ్య కోపం కాస్త నీరుగారి పోయింది. చడి సప్పుడు చేయకుంటా రాంలాల్ వెంటనడిచిండు.
‘‘పోండ్లీ పోండడ్లీ మంది ఉచ్చ తాగటానికి... వీళ్ళకు ఎట్లా బుద్దివస్తదో’’ అంటూ వెనుక నుండి శాంతమ్మ అరుస్తున్న లెక్క చెయ్యకుండా నాగయ్య ముందుకు పోయిండు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రచారవేడి మరింత పెరిగింది. సత్తయ్య ఒక వైపు జానికిరాం మరో వైపు పోటిపడి రామయ్య కాలనీలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం చెయ్యల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాండ్లు.
గంగమ్మ కల్లు మొద్దు కాడ రెండు పార్టీలకు చెందిన వారి మధ్య మాటామాట పెరిగింది.
‘‘అరెయ్ తెలంగాణలో బ్రతికుతు తెలంగాణకే ద్రోహం చేస్తారారా’’ అటూ పుటగాతాగిన రాజం ఓరియా కార్మికుడు మాలిక్ బిహరీతో గర్షణ పడ్డడు.
మాలిక్ బీహరీ ఏ మాత్రం తగ్గలేదు. లప్పటికే రెండు పవ్వలు లాగించిండు. మళ్ళీ మందిని తోలుకొని కల్లు బట్టకాడికి వచ్చిండు. అది ఇది పడే సరికి మనిషకి భూమీద కాలు అగుతలేదు.
‘‘తెంలంగాణ మీ అయ్య సొత్తారా.. మా సొనియమ్మ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా’’ అంటూ ఎదురు తిరిగిండు.
మాటమాట పెరిగి చివరికి తన్నులాటకు దారి తీసింది. విషయం తెలిసి సత్తెయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు.
‘‘ఎక్కడి నుంచి బ్రతక వచ్చిన వాల్లకే ఇంతుంటే మనకు ఎంతుండాలి’’ అంటూ ఇంతేత్తు లేచిండు.
‘‘ఇదే అదును అనుకున్న సుబ్బారావు’’ వాళ్ళ కింత డిమండి రావాటానికి కారణం ఆ జానకి రాంగాడు. వాని అసర చూసుకొనే వీళ్ళు ఎగురుతాండ్లు... ముందు వాని సంగతి చూడాలి’’ అంటూ సన్నగా ఎగదోసిండు.
‘‘నిజమే ముందు వాని సంగతి చూడాలి’’ అన్నాడు సుబ్బారావు అనుచరు శివరాం...
జానికిరాం మొదటి నుండి కాలనీలో ఉన్న వ్యక్తి. దాంతో పరిచయాలు ఎక్కువ. ఒక్క పికే రామయ్య కాలనీలోనే కాదు. క్రషర్ నగర్లోని ఓరియా కార్మికులను కూడా సెంటిమెంటు రేకేత్తించి ఒకటి చేసిండు. దానిక తోడు తనకున్న పాత పరిచయాలతో చాపక్రింద నీరులాగా ప్రచారం సాగించిండు. టి.ఆర్.యస్ పార్టీ వాళ్ళకు కాలనీలో అంత బలమైన నాయకత్వం లేదు. అ పార్టీ తరుపున సత్తయ్య ఉన్నడు కాని, అతను యువుకుడు జానకిరాం లాగా కూలీలతో మొదటి నుండి సంబందం ఉన్న వ్యక్తి కాదు.
నిన్న మొన్నటి వరకు సత్తయ్య తన పనెందో తాను అన్నట్టుగా బ్రతుకుతు వచ్చిండు. అటు వంటి సత్యయ్యను సుబ్బారావు దగ్గరికి తీసి జుజాల మీద చేతులేసి నీ అంతటోడు లేడు అనే సరికి ఉబ్బి పోయిండు. పనికి ఎగనామం పెట్టి రాత్రింబావాళ్లు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిండు. అపోజిషన్ పార్టీని దెబ్బతీయాలంటే జానకిరాంను అడ్డు తొలగించాలని బావించిండు సుబ్బారావు. మనసులో ఆ అలోచన పెట్టుకొని మెల్లగా సత్తయ్యను ఎగదోసిండు.
సత్తయ్య ఉబ్బిపోయి ‘‘వాని సంగతి నాకు వదిలెయ్యండి’’ అంటూ అవేశ పడ్డడు.
‘‘వాడెక్కడి నుంచో వచ్చి మనదగ్గర పెత్తనం చేస్తానంటే ఎట్లా కుదురుద్దీ... మనం ఎంత చెప్పితే అంత....వాని గంతి చూడాల్సిందే’’ అంటూ సుబ్బారావు మరింత రెచ్చగొట్టిండు.
సత్తయ్య రెచ్చిపోయి, రాజయ్య, దశరథం చిట్టపల్లి చంద్రయ్య, మరికొంత మందిని వేంటేసుకొని జానికిరాం మీద దాడికి పోయిండు. అందరికందరు పుటగా తాగి ఉన్నారు. ఎవరు చక్కగా నిలబడే పరిస్థితి లేకుండా ఉంది.
వీళ్ళు పోయే సరికి జానకిరాం ఓరియా వాళ్ళ గుడిసెల కాడ ఎదురైండు. ఆయన వెంట ఓరియా కార్మికులు కిషన్, చ్రకధర్ మరి కొంత మంది ఉన్నారు.
జానకిరాం ను చూసే సరికి సత్తయ్యకు ఎక్కడ లేని కోపం కల్గింది. వెతక పోయిన తీగ కాలుకే తగిలిందని సంబర పడ్డడు. ‘‘నాకొడుకు ఈ సారి తప్పించుకోవద్దు’’ అంటూ అందరి కంటే ముందు ఉరికిండు.
దూరం నుండే వీళ్ళ వాలకం చూసి జానకిరాం ప్రమాదం శంకించిండు. ఎందుకైనా మంచిది అని అతను కాస్త వెనక్కి తిరిగి ఓరియా వాళ్ళ గుడిసెల మధ్యకు వచ్చిండు. అక్క మరికొంత మంది ఓరియా కార్మికులు పోగయ్యిండ్లు.
సత్తయ్య జట్టు వాళ్ళు బాగా తాగి ఉన్నారు. చేతిలో కర్రలు పట్టుకొని సర్రున వచ్చి రావటం తోనే జానకిరాం మీద
దాడికి దిగిండ్లు.
వాస్తవానికి జానకిరాం తనపై దాడి చేస్తారని ఊహించలేదు. కాని వచ్చెవాళ్ళ వాలకం చూసి కొంత అనుమానం కల్గి వెనక్కి వచ్చిండు. ఊహించని దాడికి అతను మొదట కొంత కంగారు పడ్డా అవెంటనే తేరుకొని ‘‘చూస్తారెందిరా నా కొడుకుల్ని తన్నండి’’ అంటూ తన అనుచురులను పురమాయించిండు.
అరుపులు కేకలు...
ఓడ్డెరోళ్ళు బండలు కొట్టి కాయ కష్టం చేసి చేసి మొద్దు బారిన చేతులు. జానకిరాం ఒక్కడే ఎదురైతే పరిస్థితులు ఎలా ఉండేదో ఎమోకాని ఓడ్డరి కార్మికుల నుండి ప్రతిఘటన ఎదరయ్యే సరికి వాళ్ళ శక్తి ముందు వీళ్ళ శక్తి చాలకుంటైంది. అందులో తాగి ఉన్నారు. దాంతో ఎక్కువ సేపు నిలబడ కుండానే తోక ముడవాల్సి వచ్చింది.
అప్పటికి జరుగ వలిసిన నష్టం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలినవి. జానికి రాం ఎంత తప్పుకున్న లాబం లేకుండా పోయిందిఉ.
అటు సత్తయ్యకు ఇటు జానకిరాంకు తలలు పగిలినవి. కారిన నెత్తురుతో తడిసి పోయిండ్లు.
పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు.
శాంతి బద్రతలకు ఎటువంటి బంగం కల్గకుండా ఎన్నికలు శాంతియుతంగా చట్టబద్దంగా సజావుగా జరిగినవి. ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల్లో టి.ఆర్.యస్కు చెందిన అభ్యర్థి లక్ష్మణ్ మెజార్టీతో అపూర్వ విజయం సాధించాడు.
‘‘తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసానికి ప్రబల నిదర్శనం ఈ విజయం’’ అంటూ ఆ పార్టీ నాయకుడు ఉత్సాహంగా ప్రకటించిండు.
తన ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూల దండతో వచ్చి వెంకటేశ్ను సత్కరించిండు.
‘‘ఎన్నికల్లో గెలుపు ఓటమిలు చాల సహజం కాని స్నెహం మాత్రం చిరస్థాయిగానిలుస్తుంది’’ అంటూ ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని కౌగిలించుకొని తన సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిర్నవ్వులు చిందించారు.
అది చూసి జనం అనందంగా చప్పట్లు చరిచారు.
గవర్నమెంటు హస్పటల్లో ఉన్న కొడుకును చూడటానికి నాగయ్య, శాంతమ్మ పోయిండ్లు...
కొట్లాటలో దెబ్బలు తాకి హస్పటల్లో పడ్డ సత్తయ్యను చూడటానికి ఏ నాయకుడు రాలేదు. వాళ్ళంత ఎన్నికల్లో గెలిచిన సంబరాల్లో మునిగి పోయిండ్లు...
హాస్పటల్ బెడ్స్ లేక నేల మీద పడుకొన్న సత్తయ్య, మరో ప్రక్కన జానకిరాం కన్పించిండు.
తలకు పెద్ద కట్టుతో ఉన్న కొడుకును చూసి శాంతమ్మకు దు:ఖం అగలేదు. ‘‘వానింట్ల పీనుగులెల్ల... ఎన్నికలో ఎన్నికలని కొడుకు ప్రాణాలు తీసిరి... ఎందుకు వచ్చిన ఎన్నికలు, ఎవ్వని బాగు చెయ్యటానికి వచ్చిన ఎన్నికలు... పెద్ద పెద్దోలంత మంచి గున్నారు. వాళ్ళ మాయలో పడి తన్నక చస్తిరి’’ అంటూ శోకం తీసింది.
నాగయ్య కండ్లలో నీళ్ళూరినయి....
సత్తయ్య, జానకిరాం ఒకరి మొఖాలు ఒకరు చుసుకున్నారు.
(అయిపొయింది)
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
9
రాఘవపూర్ రోడ్డును అనుకొని చాల ఇటుకబట్టీలున్నాయి. అందులో అందరికంటే పెద్ద షేర్ అన్వర్ఎంత లేదన్నా మూడు నాలుగు వందల మంది కూలీలు ఆయన క్రింద పని చేస్తారు.
ఇటుక బట్టీలలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలకు కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చి తెచ్చుకుంటారు. అవిధంగా ఆయన దగ్గర అటు రాజనందగల్ నుంచి ఇటు చత్తీస్ఘడ్ నుండి వచ్చిన కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కుటుంబాలతో సహా ఇంటిల్లి పాది పనిచేస్తరు. మట్టి పిసికి, వెయ్యి ఇటుకలు చేస్తే ఇంత కూలి అని వాటిని బట్టీలో కాలుస్తే ఇంత అని లెక్క ఉంటుంది. దాంతో ఎంత పని చేసుకుంటే అంత కూలి గిట్టుబడి దాంతో అడమగ పిల్లలు అనకుండా పనిచేస్తరు. మగవాళ్ళు మట్టి పిసికి సాచేం ద్వారా ఇటుకలు పోస్తె ఆడవాళ్ళు పిల్లలు వాటిని ఒక పద్దతి ప్రకారం అరపెడ్తరు. బట్టి నాలుగైదు రోజులు మండి ఇటుకలు తయారైతవి.
ఇటు బట్టీల వ్యాపారం మొదలు పెట్టిన తరువాత అన్వర్ అర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. ఇండ్లు కట్టుకునే వాళ్ళె కాకుండా గవర్నమెంటుకు సంబందించిన నిర్మాణపు పనులకు కూడా అన్వర్ ఇటుక సప్లయి చేస్తడు. అవిదంగా ఆయన ఆ వ్యాపారంలో అందరి కంటే ముందున్నడు. మనిషి చూడటానికి బారి అకారం కాని మెత్తటి మనిషి కూలీల మంచి చెడ్డలు చూడటంలో ఇతర కంట్రాక్టర్ల కంటే మెరుగు.
ప్రతిరోజు పొద్దున్నే వచ్చి వ్యవహరం చూసుకుంట కనకాచారి ఆయన వద్ద గుమస్తా... చాల వరకు వ్యవహర మంతా కనకాచారే చూసుకుంటడు. అరువై ఎండ్ల పైబడిన పెద్ద మనిషి... దొతి, పొడుగు చెతుల అంగి చేతులు సగాని మడుచుకొని, జెబులో మడిచిన కాగితాల కట్ట పెట్టుకొని ఎప్పుడు ఎవరు ఏదీ అడిగిన టక్కున జెబులోని మడిచిన కాగితల్లో విప్పి లెక్కలు చెప్పుతాడు. మనిషి బక్కగా ఉన్న ఉషారుగా ఉంటడు.
కొత్తగా పెర్చిన ఇటుక బట్టిని కాల్చటానికి బొగ్గు లేదు అనే విషయం కనకాచారి షేఠ్ దృష్టికి తెచ్చిండు.
అన్వర్ ఇటుక బట్టీలు కాల్చటానికి అవసరమైన బొగ్గుకు సింగరేణి నుండి పర్మిట్ తీసుకున్నాడు. కాని అది ఏమూలకు సరిపోదు. దాంతో చాటు మాటుగా దొంగ తనంగా బొగ్గును సప్లయి చేసేవారిని అశ్రయించక తప్పెదికాదు. వాళ్ళెమో బొగ్గు ట్రాన్స్పోర్టు చేసే కంట్రాక్టర్లను సియస్టి కాడ పనిచేసే కంపిని అధికారులను పోలీసుల పట్టుకొని లారీలకు లారీలు బొగ్గు మాయం చేసి అక్రమ వ్యాపారం చేస్తే వాళ్ళు కాని ఇటివల కంపినోడు కొంత స్ట్రిక్ట్ చేసేసరికి వ్యాపారం మునుపటిలా జరుగటంలేదు. బ్రతుకు తెరువు లేక దొంగ తనంగా బొగ్గు తెచ్చి అమ్మే చిల్లర దొంగల వద్ద నుండి కూడా బొగ్గు సేకరించి అమ్ముతరు. కాని అది ఏములకు సరిపోతలేదు.
‘‘పాషాకు ఇవ్వాళ రాత్రికి పంపిస్తమన్నరు’’ అన్నాడు కనకాచారి వినయంగా... ఇటుకలుకాల్చటానికి బొగ్గుతో పాటు ఉనుక కూడా వాడుతారు. అందుకోసం చుట్ట ప్రక్కల రైస్ మిల్లులో దొరికే ఉనుకతో పాటు జమ్మికుంట వంటి దూర ప్రాంతాల నుండి కూడా లారీలల్లో ఉనుక తెప్పిస్తరు. బట్టీలలో కెవలం ఉనుకే వాడితే చప్పున మంటలేసి తొందరగా చల్లారుతిది. ఉనుకతో పాటు బొగ్గు చుర వాడితే బట్టి బట్టి అగి అగి కాలటమే కాకుండా ఇటుకలు బలంగా తయారైతవి.
‘‘ఎమైనా ఇయ్యలా బట్టి పెట్టాలి’’ నేనోసారి పాషాతోఓ మాట్లాడుతా..నువ్వు మాత్రం అలస్యం చెయ్యకు అనుకున్న సమయానికి ఇటుక సప్లయి చెయ్యకుంటే మాట పోతది’’ అన్నాడు అన్వర్ సాలోచనగా దృష్టి సారించి.
మంచిగా సీజన్ సడుస్తుందని అనుకొని ఒక సంఘటన జరిగి ఇటుక బట్టీలు పదిహెను రోజులు బందైనవి.
పూర్ణచందర్ అనే ఇటుక బట్టీ కంట్రాక్టర్ తన క్రింద పనిచేసే పదిహెనెండ్ల అమ్మయి మీద బలత్కారం చేసిండు. దానిపై ఎద్ద లొల్లి జరిగింది. కూలీలు పనులు బందు పెట్టిండ్లు. కేసు పోలీసుల దాక పోయింది. ఇటుక బట్టి యజమానులందరికి పెద్ద దిక్కయిన అన్వర్ కల్పించుకొని ఎవరికి ముట్ట చెప్పాల్సింది వారికి ముట్టచెప్పి చివరికి ఆ అమ్మయి కుటుంబానికి కొంత నష్టపరిహరం ఇప్పించి చివరికి కేసును ఎక్కడిది అక్కడ సర్దుబాటు చేసిండు.
అ లొల్లి అట్లా సద్దుమనిగిందో లేదో ఇటుక బట్టీలలో బుగ్గి అయిపోతున్న బాల్యం అంటూ ఒ పత్రిక విలేఖరి వ్రాసిన కథనం మరో దుమారం లేపింది. హక్కుల సంఘం వాళ్ళు వచ్చి విచారణ చేసిండ్లు. లొల్లి పెద్దది అయ్యే సరికి పోలీసులు లేబర్ డిపార్టుమెంటు వాళ్ళు వచ్చి ఇంక్వరీ చేసిండ్లు. బాలలో పని చేయిస్తున్నారని కొంత మంది మీద కేసులు పెట్టిండ్లు మరి కొంత మంది బాల కార్మికులను విముక్తం చేసి వారివారి ఎరియాలకు పంపించినం’ అంటూ అధికారులు హడావిడి చేసిండ్లు.
‘‘మేము ఎవరిని బలవంతం చేయ్యటంలేదు. ఏ పిల్లగాండ్లను తీసుక వచ్చి పనులు చెయించటం లేదు. ఇటుక బట్టీలల్లో పని చెయ్యటానికి కుటుంబలకు కుటుంబాలు వస్తయి. కుటుంబంలో ఆడమగ పిల్ల జెల్లా అనకుంటా అందరు పన్జేస్తరు. పనులు చేసినందుకు లెక్క ప్రకారం పైసలు చెల్లిస్తంఅంతే తప్ప ఎవరికి ఏ అన్యాయం చేయటం లేదు’’ అన్నాడు యజమానులు.
‘‘ఇయ్యం అధికారలు వచ్చి బాల కార్మికులను విముక్తం చేసి వాళ్ళలోని పనులు బందు పెట్టిచి వాళ్ళును వాళ్ళ వాళ్ల ఊళ్ళకు పంపిండ్లు. వాళ్ళతో పాటు కొన్ని కుటుంబబాలు వెల్లిపోయినవి. కొద్ది మంది మిగిలిండ్లు ఇక వాళ్ళతోని ఏం పనులు సాగుతయి’’ దీనికంటే ఈ వ్యాపారం మూసేసుకుంటేనే బాగుంది’’ అన్నాడు మరోకరు.
‘‘కూలీలు ఉండటానికి వసతి ఉండాలి. వారికి తిండి ఉండాలి, నీళ్ళు ఉండాలి. రోగమొస్తే మందులుండాలి. అంటూ అధికారులు చాల చెప్పుతాండ్లు. అదంతా సాధ్యమా సీజన్లో జరిగే వ్యాపారం... వర్షకాలం వస్తేబందేనాయే..అటువంటి కాడ రూల్స్ ప్రకారం అది ఉండాలి ఇది ఉండాలంటే అయ్యే పనేనా... వాళ్ళు చెప్పినట్టు చేస్తే నెత్తిన గుడ్డవేసుకొని పోవాలి’’అన్నాడు మరోకరు..
‘‘వీళ్ళు ఇంతగనం చెప్పుతాండ్లు కదా! మనప్రక్కనే సింగరేణి కంపిని ఉంది. ఎన్టిపిసి ఉంది. అందులో పర్మినెంటు కార్మికుల కంటే కంట్రాక్ట కూలీలే ఎక్కువ మంది పని చేస్తాండ్లు. వాళ్ళకు ఏమన్నా రూల్స్ వర్తిస్తాయా? ఒక గవర్నమెంటు కంపినిలోనే దిక్కు దివాణం లేకుంటే అధికారులు ఏం చేస్తాండ్లు’’ వారితో పోల్చితే మనమొంత’’ అంటూ మరోకరు రుసరుసలాడిండు. అందరిని సమాదాన పరిచిన అన్వర్ స్థానిక ఎమ్మెల్యేను పట్టుకొని అంత సర్దుబాటు చేసేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
ఇప్పుడిప్పుడే ఇటుక బట్టీలపని జోరందుకున్నది. కాని బొగ్గుకొరత ఎర్పడి మళ్ళి అవాంతరం వచ్చి పడింది.
తులసి ఇటుక బట్టీలో పని కుదిరింది కాని కూలి వాళ్ళు బ్రతుకు ఎక్కడికి పోయినా ఏడే మానికలు అన్నట్టుగా ఉంది. తులసి ట్రాక్టర్ మీద కూలి ఇటుక బట్టీల కాడి నుండి ఇటుకలను లోడు చేసి కొనిపోయి అవసరమైనా కాడ అన్లోడు చేసి రావాలి. రోజు మూడు వందల కూలి పొద్దున్నె టిఫిన్ పట్టుకొని వస్తే మళ్ళి ఏ సాయంత్రమో ఇంటికి వెళ్ళెది.
తులసి క్వారీలో పనిచేసినప్పుడు ఆమె తో పాటు పిల్లలు కూడా పనిచేసేవాళ్ళు. చిన్న చేతులతో బండల సైజులను ఎరేవారు క్రసర్ బెల్టు జామ్ కాకంఉడా చూసేవాళ్ళు. క్రషర్ నుంచి నిరంతరం వెలువడే బూడిద వర్ణపు దుమ్ములోనే గంటల కొద్దిసమయం పనిచెయాల్సి వచ్చేది. పిల్లలు నెత్నిన కట్టుకున్న గుడ్డలు, మొఖం వేసుకున్న బట్టలు మొత్తం కూడా తెల్లటి దుమ్ముతో నిండి పోయేది. చివరికి వాళ్ళకను రెప్పలు కూడా బండల దుమ్ముతో తెల్లబడేవి.
ఇక్కడ ఇటుక బట్టీలల్లో బాల కార్మికుల పరిస్థితి మరోరకంగా ఉంది. పెద్దవాళ్లు మట్టి పిసికి సాంచెల ద్వారా ఇటుకలు తయారు చేస్తే పిల్లలు అట్లా తయారైన వాటిని తీసుకపోయి ఒకచోట ఎండకు అరబెట్టడం బట్టీలల్లో ఇటుకలు పెర్చినప్పుడు వాటిని అందించటం వంటి పనులు చేసేవాళ్ళు..
ఎక్కడెక్కడో విసిరి వేసినట్టుండే ఇటుకబట్టీల కాడ పిల్లలకు చదువు కోవటానికి ఏ వసతులు ఉండవు. మరి చిన్న పిల్లలైతే అక్కడే అ మట్టిలోనే ఎక్కడైతే ఇటుక బట్టీలు నడుస్తాయో అక్కడ తత్కాలికంగా చిన్న చినన్న గుడిసెలు వెలిసేవి. అక్కడే తిండి తిప్పలు అన్నీను. నీళ్లకు నిప్పులకు గోస అయ్యేది.
వాటికి తోడు ఇటుకలు కాల్చిటం కోసం బట్టీల నుంచి నిరంతరం ఒక విదమైన వాసనతో ఊపిరి సలుపనిచ్చెది కాదు.
క్రషర్ నగర్లో కూలిల పరిస్థితి మరింత అద్వన్నంగా ఉందంటే, ఇటుక బట్టీ కార్మికులు ఉండే ప్రాంతల పరిస్థితి మరింత అద్వనంగా ఉండేది.
పొద్దం పనిచేసిన కూలీలు సాయంత్రమైతే చాలు దగ్గరలో ఉండే ఏ కల్లు బట్టీలకో చెరుకునేవాళ్ళు. దానికి తోడు చాటుమాటుగా గుడంబా అమ్మేవాళ్ళు కూడా తయారైండ్లు.
ఎండకాలంలో నిర్మాణపు పనులు జోరుగా సాగుతాయి. దాంతో రోజు ఐదారు ట్రిప్లు తిరుగాల్సి వచ్చేది. రోజంతా ఎండలోపని, దూర ప్రాంతంలో ఎక్కడో అవసరమైన చోట చేరవేయటం మళ్ళీ వచ్చి ఇటుకలు లోడు చేయటం ఇదే పని. మధ్యలో ఓ గంట మాత్రం తిండి కోసం అగేది.
తులసి కాకుండా ఇంకో ముగ్గురు కూలీలు ట్రాక్టరు మీద పనిచేస్తున్నారు. ఒక రోజు అన్నాలు తినే వేళ తోటి కూలి అయిన పుష్ప ‘‘ఏ పిల్ల వయస్సు మీద పడ్తాంది పెండ్లి ఎప్పుడు చేసుకుంటానవు’’ అంది సరదాగా...
తులసి ఏం బదులు ఇవ్వకండా నవ్వి ఊరుకున్నది.
‘‘పెండ్లి అంటే మాటలా పిల్లగాడు దొరకవద్దా’’ అంది మరోకూలి కొమురక్క....
‘‘పిల్లగాండ్ల కేంకొదవ...నువ్వు ఊ అను నేనే మంచి పిల్లగాన్ని తీసుకవాస్త’’అంది పుష్ప నవ్వుతూ...
ఆ ప్రక్కనే సద్ది తింటున్న ట్రాక్టర్ డ్రైవర్ వెంకటశం ‘‘ఆ పిల్ల చేసుకుంటానంటే నేను లేనా’’ అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ... వెంకటేశం సరదా మనిషి.. ఇప్పుడిప్పుడే చెవుల పొంటి సన్నగా జుట్టు నేరుస్తుంది.
‘‘‘ఆ నువ్వా’’ అంటూ పుష్ప దీర్ఘం తీసింది.
‘‘నాకేమి తక్కువ’’ అన్నాడు వెంకటేశం బింకంగా...
‘‘కూసుంటే లేవవత్తలేదుఉన్న దాన్ని ఎలుకోనటానికే నీకు చతనైతలేదు కాని నీకు ఇంకోతి కావాలా’’ అంది.
శంకరునిలా ఇద్దరిని ఏలుకుంటా’’ అంటూ బడబడ నవ్విండు వెంకటేశం...
‘‘నీకు ఆ అదొక్కటే తక్కువైంది’’ అది కొమురక్క...
‘‘ఎమైంది ముచ్చట్లు చాలించి బయలు దేరేది ఉందా... బసంత్నగర్ కాడికి ఇటుక తీస్కపోవాలి.... పోన్ల మీద పోన్లు వస్తానయి’’ అంటూ మెస్త్రీ కనకాచారి కేకేసిండు.
గగబ మూతులు తుడుచుకొని పనిల పడ్డరు.
తులసి ఇటుకలు మోస్తుందన్న మాటే కాని అలోచనలు ఎక్కడో తిరుగుతున్నాఇ.
ఇంట్లా తల్లి దండ్రులు తులసి పెండ్లికి తొదర పడుతున్నరు.
‘‘అయింత నా ప్రాణం పోయ్యేలోపు బిడ్డ పెండ్లి చెయ్యాలి’’ అన్న పట్టుదల మీదున్నడు తులసి తండ్రి పరదేశిరాం...
ఒక రోజు ఆదివారం నాడు గజానంద్ పరదేశిరాం ఇంటికి వచ్చి కూచొని చాల సేపు మంచి చెడ్డలు విచారించి చివరగా ‘‘మా గోపాల్కు పెండ్లి చెయ్యలనుకుంటాన’’ అంటూ ప్రస్థావన తెచ్చిండు.
రెండు కుటుంబాల వాళ్ళు ఒరిస్సా నుండి బ్రతక వచ్చిండ్లు. ఇద్దరిది రాజనందగాం జిల్లాయే కాకుంటే ప్రక్కపక్క ఊరు అందరు ఒకే సారి రావటం చాలకాలం కాలిసి పని చెయటం వలన దగ్గరి పరిచాయాలున్నావి.
‘‘మంచిదే కదా... పిల్లలు ఎదిగిన తరువాత వాళ్ళకంటూ ఒక కుటుంబం ఎర్పడితే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతరు’’ అన్నాడు పరదేశి... మనసులో ఏమూలో మాత్రం గోపాల్కు తులసిని అడగక పాయే అన్న అలోచనైతే ఉంది కాని బయట పడలేదు.
గజనంద్ మాట పొడగించిండు’’ ఎక్కడో దూరం పోయి సంబందాలు చేసుకోవటం కంటే తెలిసిన సంబందం చేసుకుంటే మంచిది కదా’’ అన్నాడు.
గజనంద్ ఏం చెప్పుతున్నడో అర్థం కాక ‘నిజమె అన్నా’ అంది ఈశ్వరిబాయి.
‘‘చల్ల కొచ్చి ముంద దాచటమెందుకు చెల్లే మనం మనం ఒక్కటి మా గోపాలఖు తులసిని అడుగుదామని వచ్చిన’’ అన్నాడు నిండుగా నవ్వుతూ...
అ మాట వినే సరికి భార్య భర్తలకు ఇద్దరికి సంతోషమైంది. ఇంటి ముందుకు వచ్చిన సంబందం ఎట్లా కదంటారు. అందులో తెలిసిన వాళ్ళు.. అది కాదని వేరే ఎక్కడో సంబందాలు చూసే ఓపికా కాని, అవకాశం కాని లేదు. దాంతో ఈశ్శరిబాయి’’ అంత కంటే మహబాగ్యం ఏముంటది’’ అంది సంతోషంగా...
పరదేశిరాం కూడా సంతోషమైంది.ఎదిగిన పిల్లను ఇంటి మీద ఎన్ని రోఓజులని పెట్టుకుంటం.. ఏ అయ్య చెతిలోనైనా పెట్టి బారం దించుకోవాలని చాల రోజులుగా అలోచిస్తున్నాడు. కాని కట్న కానుకల విషయంలో ఏం అడుగుతారో అన్న సందేహం మాత్రం వెంటాడింది. దాంతో ఆయన నాకెమో కాళ్ళు చేతులు అడకుంటా అయింది. ఎదో ఇట్లా బ్రతుకుతానం... పెండ్లంటే మాటలా’’ అన్నాడు.
పరదేశం మాటల్లోని అంతరార్థం గ్రహించిన గజానంద్ ‘‘అ విషయంలో నువ్వేమి బాధ పెట్టుకోకు మిముల్ని బాధ పెడ్తె మాకేం సంతోషం. ఏం పట్టుకొని వచ్చినం.. ఏం పట్టుకొని పోతాం.. ఉన్నంతలో ఎవరికి ఇబ్బంది కలుగకుండా పెండ్లీచేస్తం... చేరో కష్టం చేసుకొని వాళ్ళే బతుకుతరు’’ అని బరోస ఇచ్చి వెళ్ళి పోయిండు.
తులసి తల్లి దండ్రులకు అసంబందం నచ్చింది. కాని తులసికి గోపాల్ను చేసుకోవటం ఇష్టం కల్గటం లేదు. గోపాల్కు ఏ మాత్రం చదువు సంద్యలేదు. చదువులేక పోతే పోయింది. చేసే బండ పనైనా సరిగా చెయ్యాడు. మూడు రోజులు చేస్తే నాల్గురోజులు పని బందు పెడ్తడు. జులాయిగా తిరుగుతడు... వాని దోస్తులు కూడా అటు వంటి వాళ్ళె సినామాలు షికార్లు తప్ప వేరే జాస ఉండదు. దానికి తోడు తాగుడు అ మధ్యన ఒక్క రోజు తప్పతాగి రోడ్డు ప్రక్కన పడిపోతే చూసినవాళ్ళు ఎవరో చెప్పితే గజానంద్ పోయి ఇంటికి తీసుకొని వచ్చిండు. మనిషి చూడటానికి కూడా ఎమంత బాగుండడు. బక్కగా పొడుగ్గా పీక్క పోయిన మొఖం,దానికి తోడు పిట్ట గూడు లాంటి జుట్టు. ఏ విదంగా చూసిన తులసికి గోపాల్ పట్ల ఇష్టం కలుగటం లేదు.
గజానంద్కు మాత్రం పెండ్లి చేస్తే బరువు బాధ్యతలు తెలిసి వచ్చి దారిలోకి వస్తాడనే ఆశ. అందులో తులసి వంటి చదువుకున్న పిల్ల బుద్దిమంతురాలును కోడలుగా చేసుకుంటే బాగు పడ్తడనే అలోచన ఉంది. అందులో తెలిసిన సంబందం...
ఎదో విదంగా పిల్ల పెండ్లీ చెయ్యలనే తల్లి దండ్రుల అరాటం చూసిన తరువాత తులసి అవునని కాని కాదని కాని చెప్పలేక పోయింది. ఇటు మాత్రం పెండ్లి ప్రయత్నలు మొదలు పెట్టిండు.
తులసి ఆలోచనలో నుండి తురుకోక మందే ట్రాక్టర్ బసంత్ నగర్కు వచ్చేసింది. రెండు మూడు సందులు తిరిగి కొత్తగా కడుతున్న ఒక బంగ్ల ముందు ట్రాక్టర్ అపని వెంకటేశం... ఆ వెంటనే ‘‘తొందరగా దిగుండ్లీ పని అయిపోవాలి. మళ్ళీ ఓ ట్రిప్కు రావాలి’’ లేకుంటే మెస్త్రీ ఊకోడు’’ అంటూ కేకే సిండు.
ట్రాక్టర్ దిగిన కూలీలు ఇటుకలు అన్లోడు చేస్తుండగానే ట్రాక్టర్లో పని చేస్తున్న తులసిని చూసి ఒకింత అశ్చర్యపోయిండు. చాలా రోజుల తరువాత ఆమెను చూడటంతో మనసు ఉద్విగ్నత చెందింది.
పని తొందరలో పడిపోయిన కూలీలు ఒకరు తట్టలో ఇటుకలు పేర్చి ఇస్తుంటే మరికొందరు వాటిని తీసుకపోయి ఒక వరసలో పేరుస్తున్నారు.
తులసి శ్రీనును చూసి చిన్నగా పరిచయపుర్వకంగా నవ్వింది.
‘‘బాగున్నావా’’ అని అడిగిండు శీను మొఖం విప్పారంగా...
ఆమె చిన్నగా నవ్వుతూనే ఆ అంటూ తెచ్చిన ఇటుకలును ఒక వరుసలో పెర్చసాగింది.
‘‘నాన్నకు ఎట్లాఉంది’’ అన్నాడు మళ్ళీ..
‘‘పర్వాలేదు ఆయన పని ఆయన చేసుకుంటాండు’’
అంటూనే తట్ట పట్టుకొని ట్రాక్టర్ కాడికి నడిచింది.
రికామిలేని పనితో తులసితో మాట్లాడ టానికి వీలు చిక్కటం లేదు. ఆమెతో మాట్లాడాలని శీను మనసు ఉబలాట పడసాగింది.
రామిన అన్లోడు చేసి కూడా శ్రీను తులసితో మాట్లాడాలనే ఆశతో ఇంకా అక్కడే నిలబడి పోయిండు.
చూస్తుండగానే ఇటుకలు అన్లోడు అయింది’’ వెంకటేశం మళ్ళీ బయటు దేరటానికి ట్రాక్టర్ స్టార్ట్ చేసిండు.
శీను గబగబ తులసి వద్దకు పోయిండు.
‘‘రేపు ఆదివారం సెలవుకదా’’
తులసి తలాడించింది.
‘‘రామగుండాల కాడ జాతర జరుగుతాంది వస్తవా’’ అన్నాడు...
‘‘ఎందుకు’’ అంది తులసి కండ్లు పెద్దవి చేసి...
‘‘ఊరికే చూసి వస్తామని’’ శ్రీను గొంతు తడబడింది.
తులసి జవాబు ఏం చెప్పక ముందే వెంకటేశం ఎక్కుండ్లీ ఎక్కుండ్లీ’’ అని అరవసాగిండు. మారు మాట్లాడ కుండా ట్రాక్టర్ ఎక్కిన తులసి ‘‘రేపు ఎన్నింటికి’’ అంది.
‘‘ఉదయం’’ పదిగంటలకు’’ అంటూ సంతోషంగా అరిచిండు.
ఎవరి అలోచనల్లో వాళ్ళు ఉండిపోయిండ్లు.
శ్రీను ట్రాక్టర్ తోలు తున్నాడన్న మాటేకాని మనసు గాలిలో తెలిపోతుంది. తులసి అందమైన మొఖం పదేపదే గుర్తుకు రాసాగింది. చిన్నప్పుడు కలిసి చదువుకున్న రోజుల్లో శ్రీను కొద్దిగా బెరికి ఉండే వాడు. తులసి చలాకిగా బడబడ మాట్లాడేది. దానిక తోడు క్లాసులో మంచిగా చదివేది కాబట్టి తోటి విద్యార్థులే కాదు టీచర్లు కూడా అదరణ చేసే వాళ్ళు మంచి తెలివైంది. చదివు సాగేదుంటేఅందరిని మించి పోయ్యేది. కాని ఏం లాబం ఆమె అద్భుతమైన తెలివితేటలకు బీదరికం వల్ల అగిపోయింది. తరవాత ఎవరి దారి వారిది అయిపోయిన తరువాత ఎప్పుడైన ఒక్క సారి అలా మార్కెటలోనో, బజారులోనో ఎదురుపడి పలుకరించేది. మంచిచెడు మాట్లాడేది. ఆమోతో మాట్లాడుతుంటే శ్రీనుకు సమయం తెలిసేదికాదు. ఇంకా మాట్లాడలని అనిపించేది. చిన్ననాటి అ మధురమైన బావనలు అలాగే మనసులో పదిలమైనవి. యవ్వనంలోకి వచ్చిన తరువాత అ అలోచనలకు రెక్కలు తొడిగి కొత్త లోకాల్లో విహరిస్తుంది. ఇటివల తులసికి పెండ్లి సంబందం చూస్తున్నారని తెలిసిన తరువాత అతని మనసు మరింత అరాటపడింది. ఎదో ఒకట తెల్చుకో లేకుంటే తులసి దక్కదనే బావన ఏర్పడింది.
తులసి అలోచనలు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయి. అంతకు ముందు పెండ్లీ గురించి ఆమెకు అలోచనలు లేకుండే కాని ఎప4డైతే ‘‘గోపాల్’’తో పెండ్లి సంబందం దాదాపు కాయంకావటం ఆమె మనసు ఎటు తెల్చుకోలేక డోలాయిమౌన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ‘‘ఎందుకు పిలిచిండు.’’ అనే అలోచనలతో సతమతమైంది.అ ప్రయత్నంగానే అమె మనసులో ఎవో మధుర బావనలు చోటు చేసుకోసాగినవి.
ఆదివారం రోజురానే వచ్చింది. పొద్దున్నె తలంటూ స్నానం చేసి ఉన్న వాటిలో మెరుగైన బట్టలు కట్టుకున్నది. మనసులో ఎదో అలజడి మాటి మాటికి రోడ్డు వైపున చూస్తున్నది. ఆమె అరాటం కనిపెట్టిన తల్లి ఈశ్వరిబాయ ‘‘పొద్దున్నె ఎక్కడికే తయారైనవు’’ అంది.
‘‘ఏం లేదమ్మ ఇవ్వాళ సెలవుకదా అని తలారస్నానం చేసిన’’ అంటూ ఎదో సర్ధి చెప్పింది. ఈశ్వరిబాయి పెద్దగా పట్టించుకోలేదు.
పొద్దు ఎంతకు గడుస్తున్నట్టుగా లేదు. మాటిమాటికి వీదిలోకి చూస్తుండి పోయింది. వీదిలో దూరంగా శ్రీను మస్తున్నది కనిపెట్టి ‘‘అమ్మనేను ఇప్పుడే వస్తా’’ అంది.
‘‘ఎక్కడికే’’ అంటూ అమ్మఅడిగిన మాట విన్పించుకోకుండా ‘‘మళ్ళి ఇప్పుడే వస్తా’’ అంది.
రాముని గుండా కాడికి సెలవు రోజున జనం వస్తూంటారు. ఆ రోజున పుజారి వస్తడు. ఆ రోజున తప్ప మిగిత రోజుల్లో పెద్దగా జనం ఎవరు రారు కూడా వీలున్న చోట అక్కడక్కకడ కూచొని కుటుంబాలతో సహ ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలను అప్పటికే అరగిస్తూ మరికొంత మంది ఉన్నారు. కొంత మంద యువకులు దేవుని గుడికి కాస్త దూరంలో ఒ పెద్ద బండరాయి నీడలో కూచోని మందు పార్టీ ఎర్పాట్లు చేసుకుంటున్నారు.
వాళ్ళందరికి దూరంగా కాస్త ఒంటరిగా ఉన్న స్థలం చూసి ‘‘అక్కడ కూచుందామా’’ అంటూ శ్రీను అటువైపు చూయించిండు.
అక్కడ సీతపలాల చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. ఇద్దరు అటు వైపు నడిచిండ్లు. అక్కడ బండల మీద కూచున్నరు కాని ఎవరి మనసులోని మాట బయిటికి రాక గుండే గొంతుకలోనే తరాడుతుంది.
ఉండి ఉండి తులసి ‘‘ఎందుకు పిలిచినవు’’ అంది...
‘‘నీతో మాట్లాడుదామని’’ అంటూ గుట్టక్రిందవిశాలంగా పరుచుకున్న మైదనం కేసి చూసిండు. ఊరిలోని భవనాలు బొమ్మరిల్లులా కనిపిస్తున్నాయి. అపైన విశాలమైన మైదానం దాని చివర పాయగాపారే గోదావరి చిన్నగా ఏం మాట్లాడుదామని’’ అంటూ తులసి శ్రీను మొఖంలోకి సూటిగా చూసింది.
శ్రీను ధైర్యం తెచ్చుకొని ‘‘నీకు పెండ్లి సంబందాలు చూస్తున్నరటకదా’’ అన్నాడు.
‘‘అవును’’
‘‘మరి నీకు ఇష్టమేనా’’ మళ్ళి అడిగిండు.
తులసి ఏమి మాట్లాడలేక పోయింది. ఆమె కండ్లలో నీళ్ళు తిరిగినయి.
‘‘నీకు ఇష్టం లేకుంటే వద్దని చెప్పక పోయినవా’’
‘‘అమ్మనాన్నలు ఇష్టపడుతున్నారు’’ అంది బారంగా...
‘‘వాళ్ళ ఇష్టం తో ఏం పని నీకు ఇష్టమైతేనే చేసుకో’’ అన్నాడు కాస్త కటవుగా...
తులసి జవాబు చెప్పకుండా కన్నిరు కార్చింది.
శ్రీను కాసేపు ఏం మాట్లాడ క మౌనం వహించిండు.
ఆ వెంటనే ‘‘మనం పెండ్లి చేసుకుందామా’’ అంటూ అత్రంగా ఎదురు చూసిండు.
అనందం పట్టలేక తులసి మారు మాట్లాడా కుండా అతని వొడిలో ఓదిగిపోయింది.
( తరువాయి భాగం వచ్చే సంచికలో )
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
8
ఒక రోజు దిలీప్ క్వారికి పోయి నాన్నకు టిఫిన్ ఇచ్చి తిరిగి వస్తుంటే తోవలో మూసేసిన బాల కార్మికపాఠశాల వద్ద తన ఈడు వారైన పిల్లలు ఆటలు అడుతు కన్పించిండ్లు. అ ప్రయత్నంగానే దీలిప్ అటువైపు కదిలిండు.
సునీల్ పొద్దంతా తిరిగి చిత్తుకాగితాలు ఎరుకొని వచ్చివాటిని అమ్మి అంతో ఇంతో సంపాదించి కుటుంబానికి సహయంగా ఉంటాడు.
కూలీల పిల్లలు చాల మందికి చదువు సంద్యలులేవు. స్వతంత్య్రం వచ్చి ఇన్నెండ్లు గడిచిన పిల్లలకు చదువు అందని కుసుమమే అయింది.
ఊరు రామగుండంలో ప్రభుత్వ స్కూలు ఒకటి కాని, పిల్లలు అంత దూరం పొయ్యిరావటం కష్టం. దానికి తోడు తల్లి దండ్రులు ఇద్దరు పనులు చేస్తేకాని పొట్టగడవని పరిస్థితిలో కాస్త పెద్ద పిల్లలు ఇంటికాడ ఉండి, తనకంటే చిన్న పిల్లలను చూసుకోవటమో, వంటకు అవసరమైన కర్రలో, బొగ్గులో ఎరుకరావటమో నీళ్ళుతేవటం వంటి పనులు చేస్తరు. కాస్త రెక్క ముదిరిన పిల్లలు ఎదో పనిలోకి పోతారు. క్యారీలల్లో హోటల్లలో ఇటుక బట్టీలల్లో చిన్న చిన్న వర్క్షాపుల్లో పనులకు కుదురు కుంటారు. లేకుంటే బుజానికి సంచులు వేలాడ వేసుకొని చిత్తుకాగితాలు ఇనుపసామన్లు ఏరుకుంటానే పొట్ట గడుపుతారు... ఎవ్వని శరీరంలో చటాకు మాంసం ఉండదు... అకలితో బరించక పోయిన మొఖలతో కంతలు తేలి బక్కచిక్కి ఉంటారు.
సునీల్ తన చిత్తుకాగితాల సంచిని ప్రక్కన పడేసి కిరణ్తో గోలీలాటకు దిగిండు. సునీల్ ముందు కిరణ్ నిలువలేక పోతున్నాడు. తెచ్చుకున్న గోలీలన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అ సమయంలో దీలిప్ కన్పించే సరికి కిరణ్కు ప్రాణంలేచి వచ్చింది.
‘‘అరేయ్ దిలీప్ నావంతు నువ్వు అడరా’’ అంటూ దీలిప్ను బ్రతిమిలాడిండు.
దిలీప్ బెట్టుగా ‘‘నేను ఆడను’’ అన్నాడు.
‘‘అదే ఎందుకు’’
‘‘అది అంతే’’ అంటూ దిలీప్ మూతి బిగించిండు. కాని కిరణ్ చేతిలో మిలమిల లాడుతున్న నీలం రంగులో మెరిపోతున్న గోలీలను చూసి మనుసు ఉబలాట పడుతున్నా బింకానికి పోయిండు. అందుకు కారణం పోయి ఆదివారం సంతలో కిరణ్తో జరిగిన లొల్లి దిలీప్కు గుర్తుకు వచ్చింది.
ప్రతి ఆదివారం ఎన్టిపిసి రోడ్డుకు ఇరువైపులా సంత జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఊర్లనుండి కూరగాయలు అమ్మెటోళ్ళు వస్తరు. చీకటి పడేవేల వరకు అమ్ముకొని, పాడుబడి పోయి, పనికి రాని కూరగాయలు ఎమన్న ఉంటే తిరిగి తీసుక పోలేక పారబోసి పోతారు.
అట్లా పారబోసిన కూరగాయల కోసం కూలి జనం ఎగబడుతారు. అందులో కాస్త మంచివి ఏరుకొని వచ్చి శుభ్రం చేసుకొని వండుకుంటారు.
పోయిన ఆదివారం సంతలో పారబోసిన కూరగాయల చెత్తలో దిలీప్ వేలు పెట్టి వెతుకుతుంటే, పొపాటున వదిలేసిన క్యాబేజీ ముక్క ఒకటి కంట పడింది. దాన్ని ఇట్లా తీసుకోబోతుంటే ప్రక్కనే ఉన్నా కిరణ్లటుటకున దానిన అందుకొన్నాడు.
‘‘అదినాది నేను వెతుక్కుంటుంటే నువ్వోచ్చి తీస్కున్నవు’’ అంటూ దిలీప్ జగడానికి దిగిండు.
‘‘లేదు నేనే ముందు చూసిన అదినాదే’’ అంటూ కిరణ్ నిర్లక్ష్యంగా బదులిచ్చిండు.
అట్లా ఇద్దరి మధ్య కొట్లాట మొదలైంది. అది చూసిన మాలిక్ బిహరీ వచ్చి వారిద్దరిని విడదీసి ‘‘మళ్ళి తన్నుకుంటే మీ ఇద్దరి వీపులు సాపు చేస్తా’’ అంటూ బెదిరించి ఎటోళ్ళను అటు వెళ్ల గొట్టిండు.
దిలీప్కు అనాటి సంఘటన గుర్తుకొచ్చి బింకానికి పోయిండు.
‘‘వాడు ఆడుతే భయపడటానికి ఇక్కడెవ్వరు అడోళ్ళులేఉద’’ అంటూ సునీల్ సవాల్ వసిరిండు. దాంతో దిలీప్ రోషం పొడుచుకొచ్చింది.
‘సరే ఆడుచుద్దాం’’ ంటూ కిరణ్ చేతిలోని గోలీలు తీసుకొని ఆటు దిగిండు.
దిలీప్ ఆట ముందు సునీల్ నిలువలేక పోయిండు. అంత వరదాక గెలుచుకున్న గోలీలన్ని పొగొట్టుకకునే సరికి కోపం వచ్చి తొండికి దిగిండు.
‘‘నేను నీలం చెప్పలే పలపిట్ట గోలీ చెపినా’’ అన్నాడు సునీల్...
‘‘లేదు నీలం గోలి చెప్పినవు ఇవన్ని నావే’’ అంటూ దిలీప్ మొండిగా బదులిచ్చిండు.
అవసరమైతే తన్నులాటకైనా సిద్దమే అన్నట్టుగా ఉంది. సునీల్ దోరణి. వానితో కొట్లాడి గెలువటం కష్టం అని బావించిన కిరణ్...
‘‘నువ్వు తోండి ఆడుతనవు’’ అన్నాడు...
‘‘కాదునువ్వె తొండి’’ అన్నాడు సునీల్ మొండిగా...
‘అయితే మళ్ళీ ఆడుదాం’’ అంటూ దిలీప్ రాజీ మార్గం చూయించిండు.
‘సరే ఆడు’ అంటూ సునీల్ మళ్ళీ ఆటకు దిగిండు ఇంతలో చక్రదర్, దెవరాజు వచ్చిండ్లు. చక్రదర్ చేతిలోని ప్లాస్టిక్ సంచికేసి కిరణ్ ఆశగా చూసి అందులో ఏముందిరా’ అని అడిగిండు.
చక్రదర్కు పదమూడేండ్లు. తండ్రి చనిపోయిండు. తల్లి కూలి పనిచేస్తది. చక్రదర్ రామగుండం ప్రాంతంలోనే అత్యంత అధునిక మైన అమూల్యబార్ అండ్ రెస్టారెంటులో రాత్రులు పనిచేస్తడు. నిరంతరం నీళ్లలో నానటం వలన వాని రెండు చెతివెళ్ళు చెడిపోయి పుండ్లయినవి.
‘‘ఏముందో చెప్పుకో’’ అంటూ చక్రదర్ రెండు చేతులు వెనక్కి పోనిచ్చి సంచిని దాచి ఊరించిండు.
‘నాకు తెలుసులే’ అన్నట్టుగా దిలీప్ కండ్లు చికిలించి ‘‘తినేది ఎంటో తెచ్చినవు’’ అన్నాడు.
చక్రదర్ నిజమే అన్నట్టుగా కిలకిల నవ్వి సంచితెరిచిండు. అవి రాత్రి పనిలో నుండి వస్తూ తెచ్చిన మిగిలిపోయిన అహారపదార్థాలు. అందులో ఉండలా ఉన్న ఒక్కదాన్ని తీసి దిలీప్ చేతిలో పెట్టి ‘‘తిని ఏమిటో చెప్పు’’ అన్నాడు.
మిగితా వాళ్ళు అశగా చూసిండ్లు.
దిలీప్ లటుక్కున నోట్లో వేసుకొని నములుతూనే ‘ఎమో బాగుందీ’ అంటూ మళ్ళీ ఇంకోదాని కోసం చెయ్యి సాచిండు.
చక్రదర్ అటువంటిదే తలోకటి ఇచ్చిండు.
దేవరాజు బొమ్మలు ఎగరేసి ‘బాగుందే’’ అన్నాడు.
‘‘అవి చికెన్రోల్స్’’ అంటూ చక్రదర్ బొమ్మలెరేసిండు.
‘మరి అదేమిటి’ అంటూ సునీల్ సంచిలోకి తొంగి చూసిండు.
చక్రదర్ సంచిలో చెయ్యిపెట్టి ప్రైయ్ చేసిన చికెన్లెగ్స్ బయిటికి తీసిండు. అది సగంతిని వదిలేసినవి. ప్లెట్లు కడిగెటప్పుడు వాటిని దాచిపెట్టి తెచ్చిండు. తలా ఒకటి ఇచ్చి తానోకటి తీసుకున్నడు.
‘‘వాళ్ళకు తినటం కూడా చేతకాదు’’ అన్నాడు చక్రదర్..
‘‘ఎంతో రుచిగా ఉన్నయ్ ఎందుకుతినరు’’అంటూ దిలీప్ అశ్చర్యపోయి అడిగిండు.
‘‘అసలు వాళ్ళకు ఆకాలి ఉంటే కదా.. ఇంక తాగి నోల్ల సంగతి చెప్పకు..పైసలంటే వొళ్ళకులెక్క ఉండదు.
‘‘ఒక ప్లెట్ చికన్ ధర ఎంతో తెలుసా?’’ అంటూ బొమ్మలు ఎగరెసిండు చక్రదర్...
ఎవరు చెప్పలేక పోయిండ్లు.
‘‘నూటఅరువై’’ అంటూ చక్రదర్ తానే సమాదానం చెప్పిండు.
‘అబ్బో నూట అరువైయా’’ అంటు కిరణ్ నోరెల్ల బెట్టిండు.
‘‘ఒక్కరి కూలి’’ అన్నాడు దేవరాజ్..
‘‘గట్ల పైసల మొఖం చూసేటోళ్ళు ఎవరు అక్కడికి రారు... పెద్దపెద్ద కార్లు వేసుకొని బాయి దొరలు, కంట్రాక్టర్లు, రాజకీయనాయకులు, అలుకంగా పైసలు సంపాదించేటోళ్ళె వస్తరు’’ అన్నాడు చక్రదర్...
చక్రదర్ తెచ్చిన సంచి మొత్తం కాళీ చేసిండ్లు.
ఎర్రటి ఎండ దంచికొడ్తాంది. ఒళ్లంతా చీదర చీదరగా ఉంది.
ఉండిఉండి చక్రదర్ ‘‘నాతో చెఱువుకు ఈత కొట్టెందుకు వచ్చేది ఎవరు’’ అంటూ అందరి మొఖంలోకి చూసిండు.
చెఱువులో ఈత అనే సరికి అందరికి ఊషారు ఎత్తింది. నేను వస్తాను అని అందరు బూడిద చెఱువు కేసి బయలు దేరిండ్లు.
క్రషర్ నగర్కు ఎగువన బూడిద చెఱువు ఉంది. ఎన్టిపిసిలో ప్రతి సం।।రము దాదాపు పది మిలియన్ టన్నులబొగ్గు కాలుస్తరు. పెద్దపెద్ద చిమ్నిలు నిరంతరం బొగ్గుపులుసు వాయువులను అకాశంలోకి చిమ్ముతు ఎటు పది ఊళ్ళపెట్టు వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. నిరంతరం వెలువడి పొగ, దుమ్ముల వలన వర్షకాలంలో యూసిడ్ వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి.
ఎన్టిపసిలో కాలిన బొగ్గు బూడిదను నీళ్ళతో కలిపి బూడిద చెఱువులోకి మళ్ళిస్తరు. ఈ పక్రియ ఎండ్లకు ఎండ్లుగా సాగటం వలన ఒక్కడి వాతావరణం అంతా సన్నటి బూడిద పేరుక పోయింద. ఎండ కాలంలో ఎండకు ఎండి, గాలి దుమారం వచ్చినప్పుడు లేచిన బూడిద దుమ్ము చుట్టు ప్రక్క ప్రాంతాలను అక్రమిస్తుంది. బూడిద చెఱువు చూట్టూర ఎటు చూసిన కనుచూపు మేర చెట్టు చేమ, ఇండ్ల అంత బూడిద వర్ణంలోకి మారిపోయినవి.
పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపినందుకు కాను రామగుండం ఎన్టిపిసి అనేక సార్లు జా•తీయస్థాయిలో బహుమతులు గులుచుకున్నది. కాని ఎన్టిపిసి నిర్మాణానికి భూములు ఇచ్చి బ్రతుకు కోల్లోపయిన చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల మొఖం మీద మాత్రం బూడిద పోసింది. అ కలుషిత బ్రతికే జనం ఊహించని రోగాలతో చనిపోవటం సర్వసాదారణమైంది.
యాస్ ప్లాంటు దిగువన గుడిసెలు వేసుకొని నివసించే క్వారీ కూలీలకు, బయట నీళ్ళు దొరకక అ బూడిద చెఱువులోనే స్నానపానాదులు బట్టలు ఉతుక్కోవటం చేస్తుంటారు.
నాథురాం వృద్దుడు. ఎనుబై ఎండ్లకు పైబడి ఉంటాడు. క్రషర్ నగర్లో అంత వయసువరకు బ్రతికిన వారు అరుదు. ఆయన కొడుకు ఇతూరాం కొడలు భగవతి వొడ్డరి పని చేస్తరు. మనుమళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. నాథురాంది దుర్గుజిల్లా ఆయన అక్కడ చాల కాలం వ్యవసాయ చేసిండు. భార్య చనిపోయిన తరువాత ఒంటరివాడై కొడుకు పంచన చేరిండు.
పొద్దంతా ఎండ చిటపటలాడించింది. ఉక్కపోతలో ఊపిరి సలుపనిస్తలేదు. చమటతో ఒళ్ళంత చిదర చీదరగా ఉంది. స్థానం చెద్దామంటే ఇంట్లో నీళ్లులేవు. అక్కడ కసికడు తోడుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకుంటాండ్లు జనం.
స్నానం చేసి వద్దామని మాసిన బట్టలు పట్టుకొని చెతకర్ర పుణుక్కుంటూ బూడిద చెఱువుకు వచ్చిండు.
బూడిద చెఱువు ఒక ప్రక్క ఎండిపోయి బూడిద వర్ణపు మైదానంలా విశాల పరుచుకుంది. వెడుగాలలకు బూడిద సుడులు సుడులుగా లేస్తూ అకాశంలోకి ఎగ చిమ్ముతుంద.ఇ ఒక వైపున చెఱువు కట్టకు దిగువన నీళ్ళు పేరుకపోయి ఉన్నాయి. అక్కడున్న ఒక బండరాయి మీద నాథురాం బట్టలు ఉతుక్కుంటుంటే పిల్లలు స్నానికి వచ్చిండ్లు.
బట్టలు విడిచేసి బిలబిల మంటూ వచ్చి పిల్లలు నీళ్ళలోకి దునికే సరికి నీళ్ళన్ని బురద బురదైనవి. నాథురాం కోపం వచ్చి ‘‘అరేయ్ నీల్లను బురద చెయ్యకుండ్లిరా’’ అంటూ అరిచిండు.
కాని అమాట లేమి పిల్లలు విన్పించుకోవటం లేదు.
బయట ఎండ వేడికి మురికి నీరే అయినా ఎంతో చల్లగా ఉన్నాయి. దేవరాజ్ నీళ్ళలో చాపలాగా ఈదుకుంటూ పోయిండు. అది చూసి చక్రదర్ బడబడ మంటూ కాళ్ళు తాడించుకుంటూ ఈతకు దిగిండు. కిరణ్కు ఈతరాదు. సునీల్కు ఎదో కొద్దిగా వచ్చు ‘‘ఈ పొరగాండ్లు చెప్పితే వినేట్టులేదు’’ అంటూ నాథురాం కోపంతో విసుక్కుంటూ ఉతికిన బట్టలను అరేసుకోవటానికి గట్టు మీదికి పోయిండు.
చక్రదర్ తపతప కాల్లాడించుకుంటూ కాస్త ముందుకు పోయి అక్కడ అడుగున ఉన్న బండ మీద నిలుచున్నడు.
‘‘ఇటు రండిరా ఇక్కడ ఎక్కువలోతులేదు’’ అంటూ కేకేసిండు.
దేవరాజ్ ఈదుకుంటూ అటూ వైపు సాగిండు.
‘‘నేను వస్తున్నా’’ అంటూ సునీల్ కదిలిండు. అతన్ని అనుసరిస్తూ కిరణ్ కూడా బయలు దేరిండు.
ఒడ్డున ఉన్న నాథురాం అది చూసి ‘‘అరేయ్ పిల్లలు అటు పోకుండ్లిరా అక్కడంత బురద ఉన్నది’’ అంటూ కేకేసిండు.
కాని పిల్లలు ఆయన మాటలేమి పట్టించుకోలే...
‘‘అరేయ్ మీకేరా చెప్పేది.. అటు పోకుండ్లీ అక్కడంతా బురద ఉంది. బురదలో కూరుక పోతారు’’ అంటూ గట్టిగా అరిచిండు.
అ మాటలేమి పట్టించుకోకుండానే సునీల్ నీళ్ళలో ముందు అడుగు వేసిండు. కిరణ్ అతన్ని అనుసరించిండు. నాలుగు అడుగులు వేసిండో లేదో సునీల్ బురుదలో కూరక పోతు ప్రక్కనే ఉన్నా కిరణ్ చెయ్యిని అసరగా అందుకున్నాడు. మరునిముషంలో ఇద్దురు మునిగిపోయిండ్లు.
చక్రధర్ దిలీప్ ఒక్కసారే అది చూసిండ్లు.
‘‘మునిగి పోతాండ్లు... మునిగిపోతాండ్లు’’ అంటూ ఎడ్పు గొంతుతో చక్రధర్ పెద్దగా అరిచిండు.
దిలీప్ ఒక్క క్షణం కూడా అలస్యం చెయ్యకుండా వాళ్లు మనిగిన దిక్కు ఈదుకుంటూ పోయి కిరణ్ జుట్టు అందుకొని బయిటికి లాగిండు. వెంటనే దేవరాజ్ చక్రధర్ అందుకొని ఒడ్డుకు చెర్చిండ్లు.
అది చూసి నాథురాం పెద్దగా అరుచుకుంటూ చెఱువు కట్టమీదకి వచ్చి ‘‘అయ్యో పోరగాండ్లు మునిగి పోతాండ్లు’’ మునిగిపోతాండ్లు అంటూ సహయం కోసం చుట్టు చూసిండు.
సరిగ్గా అసమయంలోనే చెఱువు కట్టమీద ట్రాక్టర్ ఒకటి పరుగున రావటం గమనించి దానికి అడ్డంపోయిన నాథురాం అపమన్నట్టు చెతులు రెండు బారచాపి ‘‘పొరగాండ్లు చెఱువుల మునిగి పోయిండ్లు’’ అంటూ దాదాపు ఎడుపు గొంతుతో అరవసాగిండు.
లోడు కోసం క్వారికి పోతున్న శ్రీను నాథ్రాం అరుపులకు ట్రాక్టర్ అపి ‘‘ఎమైంది’’ అన్నాడు అథుర్దగా...
‘‘అదిగో అక్కడ చెఱువుల పిల్లలు మునిగిపోయిండ్లు’’అన్నాడు.
చక్రధర్, దన్రాజ్ భయంతో ఎడుస్తూ పరుగునవచ్చి ‘‘అన్నా అక్కడ’’ అంటూ చెఱువు వైపు చూయించిండ్లు.
శ్రీను క్షణం అలస్యం చేయకుండా ట్రాక్టర్ దిగి చెఱువు వైపు పరుగుత్తెండు. ఆయన వెంట అందరు పరుగు పెట్టిండ్లు.
చక్రధర్, వెలెత్తి చూయిస్తూ అన్నా అక్కడ’’ అన్నాడు.
శ్రీను బట్టలైన విప్పకుండా నీల్లలో దుమికిండు. ఆయన్ని అనుసరిస్తూ చక్రధర్,రన్రాజు కూడా నీళ్ళలోకి దిగిండ్లు...
నీళ్ళలో మునిగి పోతున్న సునీల్, కిరణ్లను కాపాడటానికి ప్రయత్నించిన దిలీప్ కిరణ్ను బయిటికి లాగి, సునీల్ను అందుకోవటానికి చెయ్యి చాచిండు. కాని అప్పటికే నీళ్ళు మింగిన సునీల్ దీలిప్ చెయ్యి అందుకొని గట్టిగా వాటేసుకున్నాడు. దాంతో దిలీప్ కాళ్ళు చేతులు అడకుంటా అయిపోయి ఇద్దరు నీటమునిగిండ్లు.
శ్రీను కాసేపు నీళ్ళలో పిల్లలకోసం అటు ఇటు వెతుకు లాడిండు. చివరికి ఒక చోట పిల్లలు దొరికిండ్లు. చక్రధర్, దేవరాజ్ సహయంతో శ్రీను వాళ్ళను బయటకి తీసుక వచ్చిండ్లు. కాని అప్పటికే పిల్లలు నీళ్ళు మింగి ఊపిరాడక చనిపోయిండ్లు.
దీలిప్ సునీల్ శవాలను చూసి చక్రధర్, దనరాజ్, కిరణ్ బెదిరిపోయి పెద్దగా ఎడ్వసాగిండ్లు.
ముక్కు పచ్చలారని పిల్లల శవాలను చూసి శ్రీనుకు దు:ఖం అగలేదు.
‘‘కాస్త ముందైతే పొరగాండ్లు బ్రతికేటోళ్లు’’ అన్నాడు అవేదనతో...
‘‘ఆడికి నేను చెప్పుతూనే ఉన్నా, అటు పోకుండ్లిరా అని’’ కాని నామాట వినలేదు. నేను చూస్తుండగానే పిల్లలు పిడాత ప్రాణం పోయింది’’ అన్నాడు నాథురాం దు:ఖ పడుతూ...
విషయం తెలిసి జనం పరుగున వచ్చిండ్లు దీలిప్ తండ్రి దేవ్కు కబురు పంపిండ్లు. సునీల్ వాళ్ళ తల్లి ండ్రులు వచ్చిండ్లు ఎడ్పులు అరుపులతో అక్కడ వాతావరణం గంభీరమైంది.
దేవ్కు విషయం తెలిసి నెత్తి నోరు కొట్టుకుంటూ పరుగున వచ్చిండు. పిల్లవాని శవం మీద పడి హృదయ విదారకంగా రోదించిండు. అతన్ని అపటం ఎవరి తరం కాలేదు.
‘‘భార్య చనిపోయిన తరువాత పొల్లగాన్ని చూసుకుంటూ బ్రతుకుతాండు. ఉన్కొక్క పిల్లగాడు పాయే... పాపం ఎట్లా బ్రతుకుతడు’’ అంటూ చూడవచ్చిన జనం కన్నీరు కల్చిండ్లు.
పోలీసులు వచ్చి శవాలను పోస్టు మార్టంకు పంపిండ్లు.
‘నిశద్ద ప్రాంతంలోకి పోయిన పిల్లలు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిండ్లు. కావున అందుకు తమతప్పు ఏమి లేదంటూ ఎన్టిపిసి మెనేజుమెంటు తేల్చి చెప్పింది.
ఎప్పటిటా కేసు ఎటు తేలలేదు. బూడిద చెఱువు లోకి, బూడిద కలిసిన నీళ్ళు ఎప్పటిలా వచ్చి చేరుతూనే ఉంది. దిగువన నివసించే క్రషర్ నగర్ వాసులు ఎప్పటిలాగే బూడిద చెఱువులో స్నానపానాదు నిర్వహించుకుంటూనే ఉన్నారు. అంతయదవిధిగా ఎమి జరుగనట్టుగానే జరిగిపోతున్నది.
అ సంఘటన ను కాళ్లరచూసిన శ్రీను కొన్ని రోజుల దాక మనిషి కాలేక పోయిండు.
కొడుకు చనిపోయిన తరువాత దేవ్కు జీవితం మీద ఆశపోయింది. కొన్ని రోజులకే అతను క్రషర్నగర్ వదిలేసి ఎటో పోయిండు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో )
సైరన్ నవల రెండవ పార్ట్ – పదమూడవ భాగం
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
‘‘బూటకపు పోలీసు కాల్పుల్లో అమరులైన మన లోడింగు కార్మికులను రెండు నిమిషాలు యాదిచేసుకుందాం’’ సత్యం - మాటను నాలుగు కిలోమీటర్లు ఒకరికొకరు చెప్పుకున్నారు.
రెండు నిమిషాల మౌనం పాటించారు.
‘‘గతవారం దినాలుగా రగులుతున్న సింగరేణి గురించి రేడియో, కూస్తనే ఉన్నది. పత్రికలు రాస్తూనే ఉన్నాయి.ఎప్పటి కప్పుడు రాడికల్స్ వాల్పోస్టర్లు వేస్తూనే ఉన్నారు... ఇప్పుడు సింగరేణి కార్మికులకు బొగ్గు తీయడమే కాదు. రాష్ట్ర, దేశ రాజకీయాలన్ని తెలుసు... చరిత్ర తెలుసు... చరిత్రను మలుపు తిప్పడం తెలుసు.
గతంలో అర్థపూట సెలవు కోసమో?
అనచబడిన తమ హక్కులకోసమో?
జీత భత్వాలకోసమో?
నీళ్లకోసమో? గాలికోసమో?
గుడిసెలకోసమో, గూండాగిరిని ఎదురించడానికో పోరాడారు. సమ్మెలు చేశారు. ఔనా? కాదా?’’ సత్యం కంఠం అలలు అలలుగా - కార్మికులు - ‘‘పోరాడుతాం’’ పోరాడుతాం’’ అరుస్తున్నారు. మొట్టమొదటి సారిగా - తమనాయకులను బేషరుతుగా విడిపించుకోవడం కోసం మూడు డివిజన్లలో రాజకీయ సమ్మెకు సింగరేణి కార్మికులు సైరన్ మోగించారు...విప్లవ కార్మిక వర్గానికి జేజేలు...’’ సత్యం పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
‘‘భూస్వామిక ధౌర్జన్యం’’
‘‘నశించాలి’’ అలలు అలలుగా నాలుగు కిలోమీటర్లు ఊరు ఊరంతా నినాదం చుట్టి వచ్చేలాగునా నినాదాలు...
‘‘దొరల జులుం’’
‘‘నశించాలి’’
‘‘సింగరేణి యాజమాన్యం జులుం’’
‘‘నశించాలి’’
‘‘కార్మికుల హక్కులు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘లోడింగు కార్మికులను’’
‘‘బదిలీ పిల్లర్లుగా తీసుకోవాలి’’
సత్యం గొంతు కీచు గొంతుగా మారింది.
శంకర్ వేదిక నెక్కాడు... మైకు చేతిలోకి తీసుకున్నాడు. అందరికి లాల్సలామ్ చెప్పిండు.
‘‘కార్మికుల, కర్షకుల ఐఖ్యత’’
‘‘వర్దిల్లాలి’’
‘‘పోరాడితే పోయేదేమిలేదు’’
‘‘బానిస సంకెళ్లు తప్ప’’
‘‘ప్రపంచ కార్మికులారా’’
‘‘ఏకం కండి ’’
‘‘కరీంనగర్ ఆదిలాబాదు రైతాంగ పోరాటాలు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘వర్దిల్లాలి వర్దిల్లాలి’’
‘‘గిరిజన రైతాంగ పోరాటాలు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘కామ్రేడ్ గంగాధర్ను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ షరీప్ను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ శంకరన్నను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
కార్మికులు పెద్ద పెట్టున ‘‘బావయో బంగారయ్యను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ రెహనక్కను’’
‘‘వెంటనే బేషరుతుగా వదిలి పెట్టాలి’’
‘‘కామ్రేడ్ సరితక్కను’’
‘‘వొదిలి పెట్టాలి’’
‘‘అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరిని’’
‘‘బేషరుతుగా విడుదల చేయాలి’’
నాలుగు కిలోమీటర్లు రోడ్డు మీద నిప్పులాగా మండుతున్న కార్మికులను ఏమి చేయాలో తెలియక పోలీసులు దారిలో ముందుకు పోవడానికి లేక ఎక్కడి కక్కడే ఆగిపోయారు...
అప్పుడు మొగిలి కాళ్లకు గజ్జెలు, ఎడం భూజం మీద గొంగడితో వేదికెక్కాడు. అతని పక్క శంకర్ ఎర్రజెండా పట్టుకొని నిలుచున్నాడు...మరో అయిదుగురు దోవతులు కట్టుకొని అతని పక్క చేరారు. డోలు, కంజీర మోగాయి పంబాల గురవయ్య తన జెమిడికతో వేదిక నెక్కాడు.
‘‘లాల్సలామ్...లాల్సలామ్’’ మొగిలి కంఠం సైరన్లాగా మోగింది. పాట సాగుతోంది...అలలు అలలుగా మారుమోగుతోంది. జమిడికే కార్మికుల నరాలు పీకి వాయించినట్లుగా మైకుల్లో నుండి లౌడు స్పీకార్ల గుండా కార్మికుల్లోకి ప్రవహిస్తోంది.
‘‘ఎర్రజెండెర్రజెండెన్నియాలో...’’
‘‘భళే...భళే...’’ గుడ్లెర్ర జేశాడు. మొగిలి పాటయిపోయింది.
కార్మికులు బావయో బంగారయ్య పాడుమన్నారు
‘‘కార్మికులారా! ఆ పాట మా అన్న శంకరన్న తీర్గపాడలేను. క్షమించాలి... మన నిరవధిక సమ్మెతోటి కామ్రేడ్ శంకరన్న విడుదల అయిన తరువాత ఆయనతో పాటు పాడుతాను. మొట్ట మొదటి సారిగా పాడుతన్న..కోపంతోటి, దు:ఖంతోటి పాడ్తన్న మన్నించాలి - కొత్తపాట మన పోరాటాలు ఎట్ల నడుస్తున్నయో? ఇది జమిడికె పాట - కామ్రేడ్ పంబాల గురువన్న జమిడికె చూసిండ్లుగదా! గిది జమిడికె పాట.
జమిడికె వాయించిండు. ఒక్కడే కార్మికుల నరాలు తెంపి జమిడికెకు కట్టి వాయించినట్టుగా గురువయ్య కనిగుడ్లు తిప్పిండు. మీసాలు వడిపెట్టిండు.ముందటికి దునికిండు మొగిలి పాటెత్తుకున్నాడు.
అరె దండు గదిలిందిరా! జంబాయిరే
ఎర్ర దండు గదిలిందిరా! జంబాయిరే
కార్మికులు అందుకున్నారు జంబాయిరే - జంబాయిరే... జంబాయిరే కార్మికులకంరాలన్ని జమిడికె మోతతో మోగుతున్నాయి...
మొగిలి చరణం అందుకున్నాడు.
తాతల నాటినుంచి - తన్నులు గుద్దులే
గురువ్వయ్య కోరస్ ఇచ్చిండు. తన్నులు గుద్దులే జమిడికె వాయించిండు.
తలెముంత గంజికి - తంగెళ్లు బీకిండ్లు
‘‘తంగెళ్లు బీకిండ్లు’’ స్టేజీమీది అందరు.
దొరల సెప్పుల కింద పేదోళ్ల బతుకులు
‘‘పేదొళ్ల బతుకులు - పేదోళ్లబతుకులు
అరె ఊరు గదిలిందిరా - జంబాయిరే
మద్దునూరు గదిలిందిరా జంబాయిరే..
కార్మికులు మొత్తం ఊగిపోతండ్లు - ఉరిమినట్టుగా జమిడికె మోగింది.
దొరల కామానికి రాజేశ్శరి బలి
వాళ్ల కావలికొరకు - పోలీసు సర్కారు
ఆడోళ్లు లేచిండ్లు - కోపానికచ్చిండ్లు
తూటాలు పేలినా -కోటయైనిలిసిండ్లు
లొల్లి లేసిందిరా జంబాయిరే
బేల్లం పల్లి పూసిందిరా జంబాయిరే...
జంబాయిరే - జంబాయిరే - జంబాయిరే
ఆ మందిలో నిలబడ్డారు వాళ్లకు తెలియకుండానే రాజేశ్వరి, లక్ష్మి కుడికాలు ఎగరేస్తూ - కుడి చెయ్యి ఊపుతూ పాడుతున్నారు.
దొరల మేపేందుకు లోడరోల్లుబలి
వారికావలి కొరకు - పోలీసు సర్కారు
లోడర్లు లేసిండ్లు - దొర టాకీసుకాలింది
బ్రాండి షాపులన్ని - బద్దలైపోయినయ్
బద్దలైపోయినయ్ - బద్దలైపోయినయ్
తూటాలు పేలినయ్ - ఒరిగిరి లేబరు
ఒరిగిన లేబరుకు - అన్నలు పానమై నిల్సిండ్లు
దొంగ నాయకులంతా - ఒక్కటైపోయిండ్లు
నాయకులందరిని - అరెస్టుచేసిండ్లు
అరె సమ్మె పెట్టిందిరా - జుంబాయిరే
నిరవధిక సమ్మె లేసిందిరా జంబాయిరే...
సింగరేణి అంతా జంబాయిరే
చిచ్చురేగిందిర - జంబాయిరే
కార్మికులంతా ఎవరికి వారే పాడుతున్నారు కొత్త కొత్త చరణాలు కలుపు తున్నారు. రోడ్డు పాటైయింది...అలలు అలలుగా – పాట కార్మికులల్లో కలిసి మోగింది.
‘‘నూతన ప్రజాస్వామిక విప్లవం’’ మొగిలి...
‘‘వర్దిల్లాలి...’’
పాట నినాదం అలలుగా అటు మహారాష్ట్ర నాగపూర్ మీదుగా ఢిల్లీ వెళ్లేరోడ్డు, ఇటు హైదరాబాదు, సిర్వొంచ మూడు దారులకూడలిలో - పాట - నినాదం మారు మోగుతోంది....
ఆ తరువాత ‘బీదలపాట్లు’ నాటకం సింగరేణి పరిస్థితుల మీద వేసిండ్లు. అది నృత్య రూపకం. మధ్యలో చాలా పాటలు.
ఉరుములు మెరుపులు గాలి దుమారం. మధ్యలో రెండుసార్లు లైట్లు పోయినయి. స్టేజి దగ్గర జనరేటరు నడిపిచ్చిండ్లు. అట్లా రాత్రి పదకొండు గంటలదాకా మీటింగు నడిచింది.
మొట్టమొదటి సారిగా - వేలాది మంది. సింగరేణి కార్మికులు వివిధ డివిజన్ల కార్మికులు - ఒక్క దగ్గర జమైండ్లు. ఒక్కొక్కరికి మీటింగులో చెప్పిన బాధలన్నీ తెలుసు. కాని అవి అంతే అనుకున్నారు. అవి మారేవి కావు అనుకున్నారు. ఎవరికి వారే విడివిడిగా ఉన్న కార్మికులు, పల్లెల నుండి, రకరకాల అణిచివేతల నుండి కాలేరికి వచ్చిన కార్మికులు - కాలేరికి వచ్చిన తరువాత ఇక్కడి - జిత్తులమారి జీవితంలో చిక్కుపడి పోయిండ్లు. దాని కొస మొదలు తెలువక గింజుకున్నారు అంటూ పల్లె నొదిలిన ఫికరు, బెంగ, ఇక్కడ అలవిగాని బతుకు. ఊపిరి సలపక ఉడికి పోయిండ్లు. తాగిండ్లు. పెండ్లాలను కొట్టిండ్లు. దీనికి మూలమెక్కడో - తమను ఆడిస్తున్న వాళ్లెవరో కొద్దికొద్దిగా తెలుస్తోంది.
(అయిపోయింది)
కూలి బతుకులు – ఏడవ భాగం
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
7
ఒక రోజు పొద్దున్నె నాగయ్య కంట్రాక్టర్ లక్ష్మన్ కలువటానికి పోయిండు. ఆయన ఉండేది గోదావరిఖనిలోని మార్కెండేయకాలనీ.
గోదావరిఖని బొగ్గు గని కార్మికులు ఉండే పారిశ్రామిక ప్రాంతం. కార్మికులు పని చేసే బొగ్గు గనులు చాల వరకు దూర ప్రాంతంలో విసిరి వేసినట్టుగా ఉండటం వలన అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే గోదావరిఖని పట్టణంలోనే ఎక్కువ మంది కార్మికులు నివాసం ఉండి డ్యూటీలకు పోయి వస్తుంటారు. కంపని క్వార్టర్ ఉన్నా కొద్ది మంది తప్ప మేజార్టీ కార్మికులకు దొరకవు. దాంతో ఎక్కడిక కాస్తంతా ఖాళీ స్థలం దొరికితే అక్కడల్లా కార్మికులు గుడిసెలు వేసుకున్నారు. అట్లా ఇందిరానగర్ తిలక్నగర్, బాపుజీనగర్ అంటూ దేశంలోని ప్రముఖలపేరుమీద దాదాపు పాతిక ముప్పయి వాడలున్నాయి. ఇటివల ఫైవ్ ఇంక్లయిన్ మోరికి అవల వైపున కేసిఆర్ పేరు మీద కూడాఒక వాడ వెలిసింది.
పట్టణంలోని చౌరస్తా మీదుగా పైకిపోతే బస్టాండు వస్తుంది. బస్టాండుకు పోయ్యేతోవలో ఎడమ వైపున రాజెష్ టాకీసు ఉంది. దాని ప్రక్కనుండి పోయ్యే రోడ్డు మార్కెండెయ కాలనీ మీదగా ఇంకా పైకి పోయేదుంటే మూత పడిన ఎఫ్సిఐకి పోతుంది. చౌరస్తాకు ఎడమవైపు రోడ్డు గోదావరిఖనిలో అతిపెద్ద బిజినెస్ సెంటర్ అయిన లక్ష్మినగర్కు పోతుంది. మార్కెండేయ కాలనీ మిగితా కాలనీలకంటే కాస్త బిన్నమైంది.
ఇతర కాలనీలన్ని గుదిగుచ్చినట్టుగా ఇరుకు ఇరుకుగా మురికి మురికిగా ఉంటే మార్కెండయ కాలని మాత్రం తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. అక్కడ ఎక్కువగా కాలేజి విధ్యాసంస్థలు ఉన్నాయి. దానికి తోడు ఇటివల కాలంలో సంపన్న వర్గాలుగా ఎదిగిన వాళ్ళు రాజకియంగా ఎదిగినవాళ్ళు ఎక్కువ మంది అప్రాంతంలో ఇండ్లు కట్టుకోవటంతో దాని స్వరుపం మారిపోయింది.
నాగయ్యకు లక్ష్మన్ మార్కెండెయా కాలనీలో ఉంటాడని తెలుసుకాని ఎక్కడ ఉంటడో తెలియదు. అక్కడికి పోయిన తరువాత ఎవరినైనా అడుగుతే చెప్పక పోతారా అన్న ధైర్యంతో బయలు దేరిండు. దానికి తోడు వెంకటయ్య ‘‘పొద్దున్నే ఎడుగంటటలోపు పోయ్యికలువు లేకుంటే దొరకడు పన్లపడుతడు’’ అని చెప్పిండు. అందుకే చీకటి తోని బయలు దేరి వచ్చిండు.
కాలనీలోని ఇండ్లన్ని చాల వరకు ఇటివల కాలంలో కట్టుకున్నవి. ఏ ఇల్లుకు ఆ ఇల్లు ప్రత్యెకంగా తీర్చి దిద్దినట్టుగా ఉన్నవి. అక్కడికి కూత వెటు దూరంలోనే పికేరామయ్య కాలనీ ఉంది.కాని చాల రోజులుగా నాగయ్య అటు వూపు రాలేదు. అంత అవసరం కల్గలేదు. ఇప్పుడు చూస్తే ఇంతలో ఎంత మారి పోయింది. అనుకున్నడు.
రోడ్డువారి న ఒక చిన్న డాబా హోటల్ ముందాగి ఆ హోటల్ అతన్ని లక్ష్మన్ గురించి అడిగిండు. హోటల్ అతను మరుగుతున్న చాయ్ కలుపుతూ...
ఇక్కడ చాల మంద లక్ష్మన్లున్నారు ఏ లక్ష్మణ్’’ అన్నాడు.
నాగయ్యకు ఒక్కక్షణం ఏం చెప్పాలో అర్థంకాక’’ అందే బిల్డింగ్లు కట్టి కంట్రాక్టు పనులు చేస్తడు అ లక్ష్మణ్’’ అన్నాడు.
‘‘ఎర్రగుంటడు’’ ఆయనా అన్నాడు హోటల్వాడు.
వెంకటయ్య కూలి సంఘం వదిలి పోయిన తరువాత నాగయ్య లక్ష్మణ్ను చూడలేదు. బక్కగా పొడుగ్గా ఎర్రగా ఉండే లక్ష్మణ్ గుర్తుకు వచ్చి’’ అవును అయనే’’ అన్నాడు.
‘‘అదిగో అక్కడ కరెంటు స్థంబం ఉంది చూడు, అక్కడ కుడివైపు సంది ఉంటది. అ సందిలో రెండో ఇల్లే’’ అంటూ హోటల్ అతను చెయ్యెత్తి అటు వైపు చూయించిండు.
నాగయ్య అటువైపు కదిలి సందు తిరిగి రెండు ఇల్లుకున్న గేటు ముందు నిలిచిండు. గేటు మూసేసి ఉంది. ‘ఇదే ఇల్లు అవునో కాదో ఎట్లా తెలియాలి’ అని గుంబాటన పడుతూనే అ సందిలో ఎదురైన ఓ వ్యక్తిని లక్ష్మణ్ ఇల్లు ఇదేనా’’ అని అడిగిండు.
అతను అవునన్నట్టుగా తలాడించి ముందుకు పోయిండు.
నాగయ్య చిన్నగా గేటుతోసుకొని లోపలికి పోయిండు. బయటనుండి చూస్తే పెద్దగా స్థలంలేనట్టు అన్పించినా లోపల విశాలంగా ఉంది. రెండు అంతస్థుల డాబా ఇల్లు కొత్తగా వేసిన రంగులతో మెరిసిపోతుంది.
నాగయ్య లోపట అడుగు పెట్టెసరికి అప్పటికే తయారైన లక్ష్మణ్ ముందు వసార బూట్లు తొడుక్కుంటు కన్పించిండు. తెల్లటి సలువ బట్టల్లో మెరిసి పోతున్నాడు. అప్పుడెప్పుడో చూసిన లక్ష్మణ్ ఇప్పటి లక్ష్మణ్కు పోలికే లేదు. అప్పుడు చురుకైన చూపులతో బక్కగా ఉండే లక్ష్మణ్ ఇప••డు కాస్త వొళ్ళు చేసి నిగనిగలాడుతున్నాడు.
నాగయ్య లోనికి వస్తున్నది కనిపెట్టి, రారా నాగయ్య చాల రోజులాయే నిన్ను చూసి అంటూ నిండుగా నవ్విండు.
లక్ష్మణ్ అప్యాయంగా పలకరిచే సరికి నాగయ్యకు అంత వరకు ఉన్న బెరికి పోయింది.
‘‘రాట్లా కూచో’’ అంటూ లక్ష్మణ్ కుర్చి చూయించిండు.
నాగయ్య వచ్చి కూచోగానే ‘‘మన్నొల్లంతా బాగున్నరా’’ అన్నాడు నవ్వుతూ...
నాగయ్యకు ఏం చెప్పాలో అర్థంకాక ‘ఆ’ అన్నాడు ముక్తాసరిగా....
అక్ష్మయ్య ఎనకటి రోజులు తలుచుకొని ‘‘ఒక విదంగా అ రోజులే బాగుండేవి. పైసలకు కటకట లాడినా! ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండేది. డీ అంటే డీ అనేది. ఏ ఒక్కరికి అపద వచ్చినా అందరం కదిలేది. కాని ఇప్పుడేముది. ఎవనిలోకం వానిది. ప్రక్కన ఉన్నొడు సచ్చిన పట్టించుకొవటం లేదు. ఎవడో ఎట్లా సచ్చిన మనం బ్రతికితే చాలు అనుకుంటాండ్లు’’ అన్నాడు బాధగా...
‘‘మన సంఘంల తరిగే ఓదెలు మెన్న చనిపోయిండు తెలుసా’’ అన్నాడు మళ్ళి..
‘‘ఏ ఓదేలు’’
‘‘అదే కూలీల మీద పాటలు వ్రాసేవాడు’’
నాగయ్యకు గుర్తుకు వచ్చింది. ఓదెలు పెద్దగా చదువుకోలేదు. కాని, ఆయన వ్రాసిన పాటలు ఎంత అద్భుతంగా ఉండేవి. కూలీల పీవితాలను వాళ్ళ అశలను అకాంక్షలను కళ్ళ ముందు నిలిపి మనసును కదిలించేవాడు. ఓదెలు సన్నని జీరగొంతులో అ పాటలుఒక్క సారి మనసులో సుళ్ళు తిరిగింది.
‘‘ఎట్లా సచ్చిపోయిండట’’
‘‘ఎట్లా సచ్చిండు అంటే ఏం చెప్పుతం పేదరికం కంటే పెద్ద రోగం ఏముది. పనులు వేవాయే... చేయ్యకుంటేనో బ్రతుకు ఎల్లదాయే ఎదో పని చేసుకుందువు రారా అన్న... నాల్గు రోజులు వచ్చిండు. మళ్ళీ ఎమైందో ఎమో పత్తలేడు’’ నేను పన్లోపడి వాన్ని పట్టించుకోలే. అన్నాడు విచారంగా...
మళ్ళితానే ‘‘మొన్న చనిపోయిండని తెలుసి వాడు ఉండే కాకతీయ నగర్కు పోయిన. పోయ్యే సరికి ఏముంది. ఇంటి ముందు శవాన్ని వేసిండ్లు. వాని భార్య ముగ్గురు పిల్లలు ఒక దిక్కు ఎడుస్తాండ్లు.. దహనం చేస్తామంటే ఇంట్లో చిల్లిగవ్వలేదు. బాదేసింది. మనోల్లను విచారించి కార్యక్రమం నిర్వహించమని చెప్పి పదివేలు ఇచ్చి వచ్చిన’’ అన్నాడు కండ్లు చమర్చుగా...
ఆ రోజుల్లో చంద్రయ్య, లక్ష్మణ్, ఓదేలు ఒక జట్టుగా తిరిగేది. యువకులు దేన్ని లెక్క చెయ్యని మొండితనంతో ఏ చిన్న అన్యాయం అనిపించినా ముందునిలిచే వాళ్లు. అదరి తలలో నాలుకలా ఉండే వాళ్ళు. ఏ పని పడ్డా ముందు పడే వాళ్లు.
విచారం నుండి తెరుకొన్న లక్ష్మణ్ ఏం చెద్దాం కాలం అట్లా గడిచి పోయింది. చంద్రన్న లాగా అన్ని తెగించలేక పోయిన, ఓదెన్న బ్రతకలేక పోయిన కూలిపనులు చేస్తూ మెల్లగా ఇండ్లు గుత్తకు తీసుకొని పనులు చేసిన, అట్లనే ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్న నాలుగు పైసలైతే సంసాదించిన కాని మునపటి తృప్తిలేదు’’ అన్నాడు.
ఇంతసంపాదించిన మనిషితను చంపుకోలేని లక్ష్మణ్ చూసి నాగయ్యకు అశ్చర్యం అన్పించింది.
ఉండి ఉండి లక్ష్మణ్ అన్నాడు కదా’’ మొన్న వెంకటన్న కన్పించనప్పుడు నీ విషయం చెప్పిండు. సరే అన్న నువ్వు వస్తవేమోనని నిన్న మొన్న చూసిన... ఇవ్వాళ వచ్చినవు’’ సరే ఏం పని చేస్తవు’’ అని అడిగిండు.
‘‘ఇండ్లకు ఎల్తలేదు...ఏ పనైనా చేస్తా’’
లక్ష్మణ్ సాలోచనగా దృష్టిసారించి’’ పెద్ద మనిషివైనవు ఇప్పుడేం పని చెస్తవు కాని ఒకపని చెయ్యి.. ప్రగతి నగర్లో అపార్టుమెంటు పని నడుస్తాంది... అక్కడ వాచ్మన్ పనిచేస్తవా’’
‘‘చేస్తా’’
‘‘నెలకు అరువెలు ఇస్తా.. అరేడు నెల్లపని ఉంటది. కాకుంటే ఈ మధ్య దొంగలు ఎక్కువైండ్లు... మనం ఇట్లా కన్ను ముస్తే చాలు అట్లా వస్తువులు మాయం అవుతున్నాయి. సామన్లు పోకుంటా జాగ్రత్తగాచూసుకోవాలి. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం నీళ్ళు కొట్టాలి’’ పొద్దున్నె మెస్త్రీ యాదగిరి వస్తడు. ఆయనే అన్ని పనులు చూసుకుంటడు అ సమయంలో నువు ఇంటికి పోయి తిని మళ్ళి సాయంత్రానికి టిపిన్ పట్టుకొని రావాలి’’ అంటూ ఇరువై నాలుగు గంటలు అక్కడే ఉండాలి. అందుకు నీకు ఇష్టమైతే రేపు పొద్దున సైట్ మీదికి రా. పదిగంటలకు నేను వస్తా’’ అన్నాడు.
నాగయ్యకు అదేమహబాగ్యం అన్పించింది. ‘‘సరే’’ అన్నాడు.
‘‘నాకు వేరే పని ఉంది. రేపు సైట్ కాడకలుస్తా’’ అంటూ లక్ష్మణ్ తన మోటారు సైకిల్ స్టార్టు చేసిండు.
ఒకప్పుడు రామగుండం మేజర్ గ్రామపంచాయితీగా ఉండేది తరువాత మున్సిపాట్టిగా మారింది. దానికి తోడు గోదావరిఖని, ఎన్టిపిసి టౌన్షిప్ అంత కలగలిసి పోయింది. పారిశ్రామిక ప్రాంతం విస్తరించి, జన సాంద్రత పెరిగిపోయి రామగుండంమున్సిపాల్టీ కాస్త గ్రెటర్ మున్సిపాల్టీగా మారిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూములకు విలువ పెరిగింది. మధ్య తరగతిజనం భూములుకొని, ఇల్లు కట్టుకోవటం అనేది గగనకుసుమం అయ్యింది. అపార్టు మెంటు కల్చర్ వచ్చింది.
ఎన్టిపిసి మీదుగా గోదావరిఖనికి పోయే నేషనల్ హైవేకు ఎడమ వైపున మెయిన్రోడ్డుకు అనుకొని ప్రగతి నగర్ కాలని వెలిసింది. ఒకప్పుడు అక్కడంతా ఖాళీస్థలం ఉండేది కాని ఇప్పుడు అక్కడ భూముల ధరలు అగ్గయి మండుతనయి. మధ్య తరగతికి అందు బాటులో లేకుండా పోయింది. ఇప్పుడా రోడ్డులో కిలో మీటర్ పోతే లక్ష్మణ్ నిర్మిస్తున్న ప్రగతి నగర్ అపార్టుమెంటు వస్తుంది. అపైన ఇంకాస్త ముందుకు పోతే గొధావరినది వస్తుంది. నదికి అపార్టుమెంటుకు మధ్య దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. భవిష్యత్ను పట్టణం అటువైపు కూడా విస్తరించే అవకాశం ఉంది.
వాచ్మన్ డ్యూటిలో నాగయ్యకు పెద్దగా పని ఉండదు. కాకుంటే బిల్డింగ్ నిర్మాణం కోసం ఉపయోగించే సిమెంటు, ఇనుప సామాన్లు, కర్రలు వంటివి ఎవరు ఎత్తుక పోకుండా నిగరాణ’ ఉండాలి. దొంగలేమో కన్నుమతి పరిస్తే చాలు ఇనుపసామన్లు మాయం చేస్తాండ్లు. దాంతో రాత్రుల్లు దొంగల బయానికి నిదుర కాయాల్సిన వచ్చేది.
లక్ష్మణ్ వాచ్మన్ ఉండటానికి ఒక గుడిసే వేసిండు. అందులో కరెంటు పెట్టిండు. మొదట్లా అగుడిసెలో ఒక వైపు సిమెంటు బస్తాలు స్టోర్ చేసేవాళ్ళు, కాని అటు తరువాత గ్రౌండ్ప్లోర్ స్లాబ్ పడిన తరువాత సిమెంట్ బస్తాలను అక్కడ నిలువ చేయటం మొదలైంది. దాంతో అంత వరదాక సామన్లతో ఇరుగ్గా ఉన్న గుడిసే కాస్త విశాలమైంది.
పొద్దున పనొల్లు వచ్చే వరకు అక్కడ ఉండి, పనిస్టార్టు అయిన తరువాత మెస్త్రీ యాదగిరికి చెప్పి ఇంటికి బయలు దేరివస్తడు. వచ్చి స్నానం గిట్లా చేసి ఇంత అన్నం తిని టిఫిన్ పట్టుకొనిపోతే మళ్ళి మరునాడే ఇంటికి వచ్చేది.
మొదట్లో శాంతమ్మ ‘‘ఏపనోఎమో పోయిన గుత్తా మళ్ళి రేపటి దాక కన్పించేది లేదాయే’’ అంటూ సణిగింది. ఎందుకంటే నాగయ్య పనిలకు పోయిన తరువాత రోజంతా అమె ఒక్కతే ఉండాలి. పోనియ్ ఆమె కూడా పోయి అక్కడే ఉందామంటే పిల్లగాడు (శ్రీను) ఉండే వానికి వండి పెట్టాల్నా.. ఈయన వచ్చెసరికి తిండికి ఎర్పాట్లు చేయాల్నాయే దాంతో ఆమె సతమతమైంది.
‘‘పనిపాట లేక ఇంటికాడ ఉండి ఏంచేస్తా... ఆ ఉండేది ఎదో అక్కడే ఉంటే రోజుకు రెండు వందలు ఇవ్వబట్టె’’ అన్న నాగయ్య మాటలు శాంతమ్మకు నిజమే అన్పించింది. పైసలు లేకుంటేనెమో ఎల్లుతలేదాయో.. శ్రీనుకు వచ్చె ఎనిమిది వేలు ఎటు సరిపోతలేవు. దాంతో ఆమె సర్దుకపోయింది.
కాలం గడిచే కొద్ది నిర్మాణపు పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు వందలాది మంది కూలీలు వచ్చి పనిచేస్తాండ్లు. యాదగిరి మెస్త్రీ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు. కంట్రాక్టరు లక్ష్మణ్ రోజు పొద్దుమాపు వచ్చి పనులు చూసుకొని పోతాడు. అట్లా వచ్చినప్పుడు ఒక్క సారన్న కనిపించకపోతే ఎట్లా అనుకొని నాగయ్య ఇప్పుడు ఎక్కువ సమయం సైట్కాడే ఉంటున్నాడు. లక్ష్మణ్ వచ్చినప్పుడు మొఖం చాటేసుకోకుండా లక్ష్మణ్ మంచిగ పలుకరిస్తరు. అట్లాపలరించే సరికి నాగయ్యకు ఎంతో ఉత్సాహం అన్పించేది. దాంతో ఆయన పని బాగా ఉంటే ఒక్కొక్కసారి ఇంటికి కూడా పోకపోయేది. అటువం•ప్పుడు అ తిండి వ్యవహరాలేవో కంట్రాక్టరే చూసేవాడు. ఎప్పుడైనా ఇంటికి పోయినా అక్కడ ఎమైతాందోనని తొందరగా తిర్గి వచ్చేవాడు.
పని జోరందుకొని స్లాబ్ మీద స్లాబ్ పడేసరికి వాటికి నీళ్ళు కొట్టెపని కూడా ఎక్కువై క్షణం రికామిలేకుండా పోతుంది. దానికి తోడు దొంగలు కూడా తెలివి మిరిపోయి ఎదన్న ఎమరు పాటు ఉంటే చాలు.. ఎదో ఒకటే మాయంచేస్తాండ్లు. అటువంటి ఒకటి రెండు సంఘాటనలు జరిగిన తరువాత ఒసారి లక్ష్మణ్ మందలించిండు కూడా...
దాంతో నాగయ్య ఎక్కువ సమయం సైట్ మీదే ఉండి పోవల్సి వస్తుంది.
నాగయ్య ఒక రోజు ఉదయం ఇంటికి వచ్చే సరికి వాళ్ళ ఇంటికి నాల్గిండ్ల అవల జనం గుమికూడి ఉన్నారు.
‘‘ఎమైంది’’ అని భార్యను అడిగిండు.
‘‘ఆదినారయణ రాత్రి చనిపోయిండు’’ అంది...
‘‘అయ్యో ఎట్లా’’
‘‘ఎట్లా అంటే ఏం చెప్పుతం.. వాడికి తాగుడు తప్ప వేరే లోకం లేకపాయే... ఎం తిన్నడోలేదో... ఏ రాత్రి సచ్చిండో ఎమో పొద్దున్నే ఎవరో చూసే సరికి మనిషికట్టె సరుసుక పోయిండు.’’
ఇంట్లోకి అడుగు పెట్టకుండానే నాగయ్య అటువైపు నడిచిండు.
మనసులో ఎన్నో అలోచనాలు...సికే రామయ్య కాలనీలో చావులు కొత్తకాదు. తిండి లేక మలమల మాడి సచ్చే వాళ్ళు పనులు లేక సచ్చేవాళ్ళు ఒకరా ఇద్దరా! బొగ్గు బంకర్ కాడ పనిచేసే చిన్నులాల్ అంత ఇరువై ఎండ్ల యువకుడు బొగ్గు వాని ఊపిరితిత్తులను తినేసింది. టి.బి. లాంటి రోగమెదో వచ్చి నవిసి నవిసి చనిపోయిండు. బ్రతుకు దామని ఎక్కడి నుంచో వచ్చిండు. కాని చచ్చిన తరువాత వాని శవం అయిన వాళ్ళకు చేరలేదు. ఇక్కడే అందరు కలిసి బొందపెట్టిండ్లు. అంత్మరాం మిల్లు మూత పడ్డ తరువాత బ్రతుకు తెరువు లేక చాల మంది అకలి చావులు సచ్చిండ్లు. యువకుడైన అనంద్ ఉరేసుకున్నాడు. శివరావు, పోలారపు రాజు ఇలా ఎంతో మంది తమ కండ్ల ముందే అర్థంతరంగా చనిపోయింది గుర్తుకు వచ్చి మనసుకు బాదేసింది.
ఆదినారాయణ శవం ఇంటి ముందున్న యాపచెట్టు క్రింద చాప పరిచి అందులో పండుకోబెట్టి పాత దుప్పటి ఒకటి కప్పిండ్లు. ఎప్పుడు చనిపోయిండో ఎమో కాని కండ్లు బూసులు తెలి మనిషి పచ్చబారి పోయిండు. దూరం దూరంగా నిలుచున్న అడోళ్ళు కొంగు మూతికి అడ్డం పెట్టుకొని దు:ఖంచిండ్లు...
రెండు రోజులాయే మనిషి ఎప్పుడోస్తాండో ఎప్పుడు పోతండో కన్పించలేదు’’ పొద్దున చూస్తేఇంకేముంది కట్టె సరుసక పోయిండు. అంటూ పక్కంటి అవిడ కండ్లలల్లో నీరు తీసుకున్నది.
రాంలాల్ను సమీపించిన నాగయ్య ‘‘ఎట్లా జరిగిందే’’ అని అడిగిండు.
రాంలాల్ విషాదంగా చూసిండు.
‘‘పొద్దున చూసినోళ్ళు మనిషి ఉలుకు లేదు పలుకు లేదు అంటే ఓ పొల్లగాన్ని ప్రసాద్ డాక్టరు దగ్గరికి పంపించిన అయిన వచ్చి చూసి ఏప్పుడో అయిపోయింది ప్రాణం అన్నాడు’’
కాలనీలో ఎవరిక ఏ ఆపద వచ్చిన రోగం వచ్చినా పెద్దదిక్కు ప్రసాద్ డాక్టర్. ఆయన ఆర్.యం.పి చెసిండు. కాలనీలోని జెండా గద్దె కాడ చిన్న రేకుల షెడ్డుతోనే ఆయన దావఖాన. పొద్దు మాపు అక్కడ రోగులతో కిటకిటలాడుతుంది. ఆయన ఎవరిని ఇంత ఇవ్వమని అడుగడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటడు. ఇయ్యకున్న ఎమనడు. తనకు వచ్చిన విద్యతో ఆయన ఇంకెక్కడైనా ప్రాక్టీస్ పెట్టుకుంటే నాల్గు పైసలు సంపాదించుకునే వాడు కాని ఆయన అట్లా చెయ్యలేదు. ఏదిక్కు లేని వాళ్ళకు సేవ చేయటమే లక్ష్యంగా పికే రామయ్య కాలనిలో ప్రాక్టీసు పెట్టిండు. ఆయన అక్కడి వారికి వైద్యము చేయటమే కాదు. వాళ్లకు ఏ అపదవచ్చిన మీదేసుకొనే వాడు.
ప్రసాద్ డాక్టర్ ప్రక్క ఇంటి ముందు ఒక కుర్చిలో కూచొని ఉన్నాడు. ఆయన చుట్టు జనం గుమికూడి ఉన్నారు.
‘‘తాగుతే సచ్చిపోతవురా అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. మన ముందే సరే అంటడు. కాన ఎప్పటి అటె అడుతడు’’ అంటూ ఎవరికో చెప్పుతున్నాడు.
‘‘ఎదైనా పెద్ద హాస్పటల్కు తీస్కపోతే బ్రతికే వాడేమో’’ అన్నారు ఒకరు...
‘‘అది చెప్పిన నీకు వీలుకాకుంటే నేనే తీస్కపోతనన్నా రేపు మాపు అంటడు కాని కదలడు’’ అన్నాడు డాక్టర్. అయన గుండ్రటి మొఖంలో విషాదం అలుముకొన్నిది.
‘‘ఇంతకు వానికేమైంది సార్’’ అని అడిగిండో యువకుడు...
‘‘బాగా తాగే సరికి లివర్ ఖరాబు అయింది. తాగుడు బందు పెట్టి మందులు వాడితే నయం అయ్యేది’’ కాని వాడు వినలేదు. తాగుడు బందు చెయ్యలేదు’’
తలో మాట మాట్లాడుతున్నారు.
విషయం తెలిసి సత్తయ్య వచ్చిండు. శవాన్ని చూసి దు:ఖం అపుకోలేక పోయిండు.
‘‘తాగుడింట్ల మన్నుబొయ్య... కల్లు సీసా అగుపించందంటె పిచ్చి లేసేది కుక్కల మందు ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తదో’’ అంటూ ఒక నడీడు ఆడామే తిట్టి పోసింది.
‘‘చూస్తాంటే పొద్దు పొతలేదా అయ్యే పనేదో చూడాలి’’అన్నాడు రాంలాల్ రెండు చెతులు వెనక్కి కట్టుకొని...
‘‘వాని పెండ్లాంకు కబురు చేసిండ్లా’’
‘‘పొద్దున వెంకటేశం తాళ్ళపల్లికి పంపించినం. వాడింకా రాకపాయే... వాడు వచ్చెదాక చూద్దాం’’ అన్నాడు మరో పెద్ద మనిషి...
అది నిజమే అన్పించింది. ఈలోపు శవాన్ని చూసి పోయేవాళ్ళు చూసి పోతాండ్లు. పనులకు పొద్దుపొతందని మరి కొంత మంది వెళ్ళి పోయిండ్లు. కొద్ది మంది మాత్రం మిగిలి పోయిండ్లు.
చావు ఎట్లా చేసుడు అన్న సమస్యవచ్చింది. ఇంట్లా ఏమన్నా ఉన్నాయోనని వెతికిండ్లు. కాని ఇల్లంతా వెతికిన ఎర్రపగాణి దొరకలేదు. కొన్ని బోళ్లు పాత పడి పోయిన బట్టలు చిరికి మంచం తప్ప ఏం కనిపించలేదు.
‘‘ఏం చెద్దాం’’ అన్నారోకరు...
‘‘మున్సిపాల్టీ వాళ్లకు చెప్పితే’’ అంటూ ఉచిత సలహ ఇచ్చిండు ఒకరు...
సత్తయ్య అందుకు ఓప్పుకోలేదు. ‘‘మంచో చేడో ఇంత వరదాక మనతోని బ్రతికిండు... అనాద శవంలా వాన్ని అట్లా వదిలేస్తామా మనమే ఎదో ఒకటి చెద్దాం’’ అన్నాడు.
ప్రసాద్ డాక్టర్ ‘‘అదే మంచిది’’ అన్నాడు.
అందరు ఒక నిర్ణయానికి వచ్చి ఆదిలక్ష్మి వస్తుందోనని ఎదురు చూస్తుండి పోయిండ్లు.
చావు కబురు చేర వేయాటానకి పోయిన వెంకటేశం మధ్యాహ్నం వెలకు ఒక్కడే తిరిగి వచ్చిండు.
‘‘ఎమైంది’’ అని అడిగారు జనం అత్రంగా...
వెంకటేశం మొఖంలో విషాదం అలుముకున్నది. ఆయన మెల్లగా చెప్పసాగిండు.
‘‘నేను పోయి చెప్పెసరికి ఆదిలక్ష్మి దు:ఖం అపుకోలేక మీద పడి ఏడ్చింది. ఆమె రావటానికి తయారు అవుతుంటే ఆమె అన్న దమ్ములు ఏముందని పోతవు... వాడు నిన్ను ఏం సుఖం పెట్టిండని పోయి ముండమోస్తవు.. వాడు మాదృష్టిలో ఎప్పుడో సచ్చిండు. సచ్చినోడు సచ్చినట్టే పోనియ్’’ అంటూ ఎదురు తిరిగిండ్లు’’
‘‘పాపం ఆదిలక్ష్మికి రావాలనే ఉండేకాని వాళ్ళు దాన్ని రానియ్యలే... ఇక లాబం లేదని చూసిచూసి వచ్చెసరికి ఈయాల్ల అయ్యింది’’ అంటూ చెప్పుకొచ్చిండు.
భర్త చనిపోయిండని తెలిసి రాలేదంటే అదేమి మనిషి అని కొందరు దాన్ని ఏసుఖ పెట్టిండని వస్తది అని మరికొందరు తలో తీరుగా అనుకున్నారు.
ఆదినారాయణ తల్లి దండ్రుల వైపునుండి ఒకరిద్దరు చుట్టాలు వచ్చిండ్లు. ఆయన తల్లి దండ్రులు లేరు. తమ్ముడు ఉన్నాడు కాని వాడు ఎక్కడికో బ్రతక పోయిండు. వాని అడ్రసు తెలియలేదు.
జనమే తలింత వేసుకొని రైల్వెకట్టకు ఉన్న స్మశాన వాటికకు తీసుక పోయ్యిండు.
శవయాత్ర ఊరు దాటే దాక వెంట పోయిన నాగయ్య... మళ్ళీ పనికి పోవాలనే తొందరలో వెనక్కి వచ్చి•డు. అన్నం ముందు కూచున్న నాగయ్యకు ముద్ద మింగుడు పడటంలేదు. తాపతాపకు ఆదినారాయణ మొఖం గుర్తుకు రాసాగింది. ఎప్పుడు పెద్దయ్య పెద్దయ్య అంటూ అప్యాయంగా పలకరించేవాడు. మంచి పనోడు ఉండే అంతా పాతికేండ్లకే వని కథ ముగిసింది. అనుకున్నడు బాదగా...
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
సైరన్ నవల రెండవ పార్ట్ – పన్నెండవ భాగం
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
మొగిలి ‘‘జంబాయిరే’’ అంట అడుగులేస్తున్నడు...
తన్మయత్వంతో పాడుతున్నాడు. తనూ పాడుతే బావుండు...లోపలి ఒత్తిడి కొంతైనా తగ్గిపోవును. సత్యంకు విచారం తొలిగిపోయింది.తను గుడిసెతడుక కొరిగి కూర్చున్నడు... తను మొగిలి చేతుల కాగితం తీసుకొని కవిత చదివినట్టు - పెద్దగా చదివిండు. ఎన్నెన్నో పోరాటాలు అందులో ఉన్నాయి.
‘‘బావయో బంగారయ్య పదాలు పాడి పాడి - బంగారయ్య పోలీసు ఠానల కూసున్నడు. సత్తెన్నా పాణానికి ఇంకో పాటల పిచ్చోడు తయారయ్యిండు.’’ లక్ష్మి...
‘‘వదినా! ఏది ఒక్క చరణం పాడు ఎంత కష్టమో? నాభిల నుంచి నరాలు తీగలు చేత్తే పాటత్తది’’ మొగిలి...
‘‘కామ్రేడ్ సత్తెన్నా - మా ఖాందానంత గిసొంటి పిచ్చి ఖాందానే నాగయ్య మా మేన బావ - ఏడదాకిందో అంతకు ముందో గని అయినెకు గీ రొగం తాకింది. అయిన తా చెడ్డ కోతి వనమెల్ల సెరిసిందని - ఇగో మా ఇండ్లల్ల కచ్చి గిట్ల మమ్ముల ఆగం జేసిండు. చెప్పుకుంటే మానం పోతది. చెప్పకపోతే పానం పోతది. ఇగోగీ పోరి సూడు ఎట్ల కాల్లెగరేస్తున్నదో దీనికి సుత వాళ్లనాయిన్న సాలుపడ్డది... దీనిపేరు స్నేహలత నోరు తిరుగని పేరు. గంగన్న పెట్టిండు. ఆయన మతికచ్చికాలవడే - అయ్యకు అవ్వకు బుట్టిన ఆరుగురు పరమ బాగోతులంట ఆళ్ల సెల్లె - ఓ అంతకు ముందు వాళ్లవ్వ లచ్చవ్వచ్చింది. గా ముసలవ్వను లోపటిసేదుండే పెండ్లి గావల్సిన పోరి నీకు గిదేందే - అని ఝాడిచ్చి బిడ్డను తీసుక పోతదనుకున్న -ఓ పావురం కారిపోంగ బిడ్డకు ముద్దిచ్చి పోయింది - అది మన గంగన్న కుటుంబం’’ లక్ష్మికి దు:ఖంతోనో - ఉద్విగ్నతతోనో కన్నీళ్లు కారుతున్నయి.
‘‘కామ్రేడ్! మరి మీ ఇద్దరు వాళ్లతోటుంటిరి గదా! మిమ్ముల్ని జీబుల ఎక్కించుకపోలె’’
‘‘మాపోదురు మమ్ముల్ని కవరుపెట్టిండ్లు గదా! మా అక్క చంద్రకళ వీళ్లకేం ఎర్రిలేసిందో - ఎవలు అర్థంకావటంలేదు. అది పెద్ద లీడరయ్యింది. దవాఖానంత ఒక్కటి చేసింది. మాతోపాటు పిల్లలున్నరని - వాళ్ల సుట్టాల మనుకున్నరు’’లక్ష్మి...
‘‘నాకైతే భయమయ్యిందక్కా - సిన్నపిలగాడు’’ రాజేశ్వరి...
‘‘అగో నీమొగుడు పాడుతండు. ఆకాలం వత్తది - తిరుగనేర్పినకాలు - పాట నేర్సిన నోరు ఆగుతదా? ఈ కామ్రేడ్ పిచ్చి సిన్నదిగాదు. నాకే గిట్లనే పోయి మార్కెట్ల నిలుసుండి గింతబట్టి బాజినడుత్తంటే - గీడ పీనుగల తీర్గున్నరు అని మొత్తుకోవాలని ఉన్నది’’ లక్ష్మి...
‘‘కామ్రేడ్ నాగయ్యమీకు’’ సత్యం
‘‘అదే మాకు దూలు దుమ్మ దురదరాసిండు’’ ఓహ్ రాత్రిపగలు మా సెవుల్ల కారం రాసినట్టున్నది. మా నాయిన - వీళ్లనాయిన - మా పెద్దమామను జేల్లకూసుండవెట్టి - తమజెంగల్లవడ్డడు’’
‘‘అయినెకు రఘన్ననట, ఆ అన్నకు ఎవరో పెద్దాయినెనట - సీతారామయ్యనట. ఆయనకు అరవై ఏండ్లు దాటినయట - ఆయినకు చారు బాబునట - మరి ఆయనకు మావోనట - ఆయనకులెనినట అయినకు. మరి ఆయనకు గడ్డాపాయన మార్క్సు - ఎంగిల్సట -నా మెదడు తినిటోడు బంగారయ్య. మరి అందరు మీ సాలోల్లే, గడ్డపోల్లే, ఆడోల్లెందుకులేరు. ఉన్నా ముంగటికి రానియ్యలేదా? లక్ష్మి ఎక్కడికో పోతంది.
‘‘వామ్మో కామ్రేడ్ నీకు అరెస్టుతప్పదు’’ సత్యం రవిని ముద్దుపెట్టుకుంటూ పిల్లాడు కేరింతలు కొట్టాడు.
లక్ష్మి ముసి ముసి నవ్వి ‘‘మరి గడ్డపాయనకు మల్ల బంగారయ్య, రఘన్న, గంగన్న, నాగన్న, మొగిలి, సత్తెం - నానోరు తిరుగది - రైతులు కార్మికులు పిచ్చిలేపిండ్లట -గది సంగతి మాకు గుండాలు గీసి గిదంత రఘన్న జెప్పిండు. కామ్రేడ్ ‘‘మార్కెట్ల అందరు సుడంగ సారలిగాడు నామీద చేయ్యేసిండు. నెల రోజులు మనిషిని కాలేదు. అంతకన్నా రోతగా ఉన్నది. నాదానుగా ఉన్నది. ఆ ఆరుగురి శవాలు నాయే నన్నట్టుగున్నది సంపినోళ్లు మన ముంగట ముచ్చెట్లు చెప్పిండ్లు - కారం రాసి నట్టుగున్నది. చూసుకుంట నిలవడ్డందుకు నాదినాగే ఇనంగా ఉన్నది’’ లక్ష్మి ఏడుస్తోంది. వెక్కివెక్కి ఏడుస్తోంది. - వేడిగున్నప్పుడే సుత్తే దెబ్బ... మెడకు వడ్డపాము కరువక మానదు... అందరు రిలాక్సయ్యిండ్లు... అందరి కండ్లలో గుబగుబ నీళ్లు మొదట లక్ష్మి తేరుకున్నది. కన్నీళ్లు కొంగుతో తూడ్చుకున్నది. బయటకుపోయి ముక్కుచీదరిచ్చింది.
‘‘రవిని సత్తెన్న కియ్యి - కామ్రేడ్స్ - అరగంటలోఅన్నం అయిపోతది. ముచ్చెట వెట్టేటట్టులేదు’’ బంగారయ్య నాకు నిన్ననే చెప్పిండు. ఎనకకు పోరాదు. ముంగటికి పోవాలె - మనండ్ల వేలమందున్నరు.’’ లక్ష్మి...
‘‘సరే - మనం పోస్టర్లు వేయాలి. రేపు నిరవధిక సమ్మె... అరెస్టు చేసిన నాయకులందరిని విడుదల చేసే దాకా - సమ్మె - అన్ని డివిజన్లకు సమ్మె సత్యం లేచినిలబడి...
‘‘మనకు కాయిదాలు, బ్రషు•షలు, లైకావాలె’’ అన్నాడు.
‘‘అన్నీ తెచ్చినం కామ్రేడ్ రాంగరాంగ మీరు కాయిదం మీద రాసియ్యిండ్లి మా రాత అడ్డ దిడ్డంగా ఉం•ది - నేను ఏమొ అనుకున్న నాగన్న మాకు పలు••లు దెచ్చి ఇచ్చినప్పుడు గిసొంటి యాళ్లల్ల .సోస్టర్లు రాస్తం...ఇప్పుడు ఏడయితంది. ఎడున్నర కల్లా మీ రద్దరు తిని పోండ్లి’’ లక్ష్మి...
పాట బాగున్నది - నువ్వు బాగపాడ్తన్నవ్ - జెమిడికె పంబాలగురవయ్య జబర్దాస్తీగ వాయించుతడు రేపు వీలైతే పాడు’’ ఎవలతోనన్న చెప్పిపంపుదాం నాకెరికే... అందరు ఎవరి పనులు వాళ్లు చేయసాగిండ్లు...
సత్యం, మొగిలి సైకిల్లు తీసుకొని చెరోసంచిలో పోస్టర్లు, సరంజామా పెట్టుకొని ఏడున్నరకే బయటు దేరిండ్లు.
మొదటి పోస్టరు శిబిరం కాడే సిండ్లు - శిబిరం దగ్గర లోడర్లు వంద మంది దాకా చేరిండ్లు. వాళ్లు కొన్ని పోస్టర్లు తయారు చేసిండ్లు... ‘‘యాపల కాడి పంబాల గురువయ్యను రేపు మీటింగు కాడికి రమ్మని - జమిడికెవాయించాలని’’ ఒక కార్మికున్ని గురువయ్య దగ్గరికి తోలారు. రాత్రి రెండింటి వరకు అన్ని గనుల మీద - ఆఫీసుల దగ్గర పోస్టర్లు పడ్డాయి... అన్నిబాయిల ఆఫీసులు, వీలైన కాడికి ఫిట్ కమిటీల మొంబర్లను కలిశారు. మొగిలి, సత్యం తిరిగి తిరిగి వచ్చి శిబిరం దగ్గరే ఆ రాత్రి పడుకున్నారు.
సరిగ్గా ఆరున్నర - కెకెటూగని జెండా గద్దెమీద సత్యం నిలుచున్నాడు, అతని ముఖం మీద సూర్యుని లేత ఎండ మెరుస్తోంది. నిద్రలేక అతని కండ్లు ఎండతో పోటీపడుతున్నాయి.
‘‘కామ్రేడ్స్ గతవారం దినాలనుంచి జరుగుతున్న దొంగనాటకాలన్ని మీ కందరికి తెలుసు... సుట్టుపక్క ఇరువై ఊళ్లు ఆక్రమించి మల్ల సింగరేణిలో అన్ని రకాల దందాలు చేసి - గుండాలను పెంచి దాదాగిరి చేసిన దొరలు ఈవారం లనేను - కార్మికులు చావు దెబ్బ కొట్టిండ్లు. ఇదే సందని - దొంగ కార్మికసంఘాలు, నక్కజిత్తుల యాజమాన్యం పోలీసులు కలిసి ఆరుగురు లోడింగు కార్మికులను దుర్మర్గంగా, అన్యాయంగా పట్ట పగలు కాల్చిచంపిండ్లు - నలుభై మంది కార్మికులు - యువకులు గాయాల పాలయ్యారు. ఇది దొంగల రాజ్యం. ఖూనీకోర్ల రాజ్యం. మన నాయకులు ఎప్పటికప్పుడు వీళ్లందరి ఎత్తులన్ని తిప్పికొట్టిండ్లు! మనకు నాయకత్వం ఉంటే సింగరేణిలో వాళ్ల ఆటలు సాగయని మన నాయకులను ఒక ప్లాను ప్రకారంగా అరెస్టు చేసి పోలీస్టేషన్ల పెట్టిండ్లు... అసలు ఏ హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపింది పోలీసులు... ప్రజలను ఈ సమయంలో దగ్గరికి తీసుకోవాలి - కాని పుండుమీద కారం రాసినట్టు అరెస్టులు.
మనకు అరెస్టులు కొత్తకాదు. పోరాటాలు మనలను బొగ్గులవంటి మనలను అగ్గి చేస్తయి. ఇప్పుడు సింగరేణి కార్మికులు అమాయకులు కారు... రాజ్యం రీతి రివాజు తెలుసుకున్నవాళ్లు.
మన అవసరాల కోసం అనేక సమ్మెలు చేసినం -గాలి సప్లైకోసం, నీళ్లకోసం, ఇండ్లకోసం, జీతాల పెరుగుదల కోసం మనకు సరైన నాయకత్వం - గంగాధర్, షరీప్, శంకరయ్య, రెహనక్క, సరితక్క లాంటి వాళ్లు ఉండటం వల్లనే మనకు నాయకులను బేషరుతుగా విడిపించుకోవడం సాధ్యమైంది. నిన్న మొన్నటిదాకా మన ఊపిరైన నాయకులను అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. మన నాయకులను బేషరుతుగా విడిపించుకోవడంకోసం ఏంచేద్దాం?’’
‘‘సమ్మె’’ అక్కడ చేరిన అయిదారు వందల మంది కార్మికులు అరిచారు. ఆ అరుపు మారుమోగింది.. సమ్మె...సమ్మె...
‘‘నిరవధిక సమ్మె’’
‘‘ఎమర్జెన్సీ తరువాత భారతదేశంలోనే సింగరేణి కార్మికులు చేస్తున్న మొట్ట మొదటి రాజకీయసమ్మెఇది కొత్త చరిత్రను ఆరంభించిన కార్మికులందరికి శనార్తి కామ్రేడ్స్ - అన్ని గనుల పస్టుషిప్టుల నుండి సమ్మె చేస్తున్నాయి. మనందరం ఊరేగింపుగా రాష్ట్ర హైవే మీదయాపల కాడిచౌరస్తా దాకా వెళ్లుదాం - అక్కడికే అన్ని గనులవాళ్లు వస్తారు. ఇది ఆరంభం రెండు గంటలు రాస్తారోకో చేస్తాం - అక్కడ మనడిమాండు ప్రజలకు చెప్పుదాం - మన నాయకులను బెషరుతుగా విడుదల చేసేదాకా సమ్మెనడుస్తోంది. మన నిర్ణయాన్ని ప్రకటిద్దాం. మళ్లీ మొదటి షిప్టు కార్మికులతోనే సమ్మె ముగియాలి.’’
‘‘కామ్రేడ్ గంగారాంను’’
‘‘విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ షరీపును’’
‘‘విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ శంకరయ్యను’’
‘‘విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ రెహనక్కను’’
‘‘విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ సరితక్కను’’
‘‘విడుదల చేయాలి’’
‘‘వారితో పాటు అరెస్టు చేసిన అందరిని’’
‘‘బేషరతుగా విడుదల చేయాలి’’
ఊరేగింపులో ఇవ్వవలిసిన నినాదాల గురించి రాంచందర్ అనే కార్మికుడు నినాదాలు చెప్పాడు.
మరో గని మీది మొగిలి ఇంచుమించు ఇదే విధంగా మాట్లాడిండు. ఇంతలోనే ఏడుగంటల సైరన్ కార్మికులే మోగించారు. సైరన్ వేలాది గని కార్మికుల కోపోద్రిక్త అరుపులా - పెనుకేకలా మూడు సార్లు ఆగిఆగి మోగింది.... ప్రమాదం జరిగినప్పుడు మోగే సైరన్ అది.
రాత్రి బజలీ కార్మికులు ఆదరబాదరగా ల్యాంపులు, సెమ్మాసులు ల్యాంపురూంల్లో పెట్టారు. అప్పటికే ఆ గని దగ్గర వెయ్యిమందికి పైనే కార్మికులు లైన్లు కట్టారు.
క్లర్కులు, వోర్మన్లు, ఇంజెనీర్లు, అండర్ మేనేజరు రూంల్లో నుండి బయటకివచ్చి చూస్తున్నారు.
ఊరేగింపు కదిలింది. రెపరెలాడే అతిపెద్ద ఎర్ర జండాను ముందువరుసలో ఉన్న కార్మికులు ఎత్తి పట్టుకున్నారు.
వెయ్యిమంది కార్మికులు కదం తొక్కుతున్నారు. చాలా మంది సైకిల్లు నడిపిస్తూ వెనుక వరుసల్లో నల్లటి బొగ్గుతో నడుస్తున్నారు... దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది... అగ్ని పర్వతం బద్దలై లాలా పొంగి ప్రవహించి నట్టు, కొండల మీదుగా వరదలొచ్చిన నది ప్రవహించినట్టు - బొగ్గు పెళ్లలు బాయిల నుండి ప్రవహించినట్టు బొగ్గులు మంటలై మండినట్టు - కార్మికుల ఊరేగింపు సాగుతోంది. వందలువేలయ్యారు. కరకర బూట్ల చప్పుడు ఒక లయగానేలను గుద్దు తున్నాయి. బురద బురదగా ఉన్న బూడిద కుప్పల గుడిసెల మద్యనుండి ఆడవాళ్లు స్కూలు పిల్లలు గుంపులు గుంపులుగా యాపలకాడికి చేరుతున్నారు.
బొగ్గు ప్రవాహం సింగరేణి కాలరీ చిన్న పట్నపు వీధులను ముంచెత్తుతూ పారుతోంది.
వేలాది మంది కార్మికులు రాష్ట్రహైవే మీద నాలుగుకిలో మీటర్లమేర కదంతొక్కుతున్నారు. వందలాది సైకిళ్లు - లారీలు జీబులు ఆగిపోయాయి. పాటలు నినాదాలు, ‘మాకష్టంతో సృష్టిస్తున్నా’’ తిండి గింజలూ కట్టుగుడ్డలూ పెట్టుబడులతో దోచుకదాచే ద్రోహులు గుండెలో - అగ్ని కణములై చెరుగుతున్న జెండా! దండిగ ఎగురుతున్న జెండా’’ ముందువరుస కార్మికులు పాడు తున్నారు.తొమ్మిది గంటలకు రాష్ట్రహైవే మూడుదారుల కూడలిలో ముందు వరుస ఆగిపోయింది...అక్కడ కంకబొంగులతో చిన్నస్టేజీ లాంటిది కట్టారు... నాలుగు మైకులు ముందుకట్టారు. సత్యం స్టేజీమీదికెక్కిండు. మైకు చేతిలోకి తీసుకున్నాడు.
( తరువాయి భాగం వచ్చే సంచికలో )
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
6
‘‘ఎం నాగయ్య బాగున్నవా’’ అన్న పిలుపువిని ముందు మంచంలో కూచున్న నాగయ్య అటు వైపు చూసిండు.
ఎంకటయ్య సారు చిర్నవ్వులు చిందిస్తూ ఇటే వస్తున్నాడు.
‘‘ఎన్నిరోజులాయే సారు మిముల్ని చూడక’’ అన్నాడు నాగయ్య అక్చర్యంగా...
‘‘గోదావరిఖనిల పనిబడి వచ్చిన... ఎట్లాగు ఇంత దూరం వచ్చిన కదా అని ఒక్క సారి మనోళ్లను చూసి పోదామని వచ్చిన’’ అంటూ వచ్చి మంచంలో నాగయ్య ప్రక్కన కూచున్నడు.
ఎనుబై దశకంలో వెంకటయ్య కాట్రక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు. ఒక వెలుగు వెలిగిండు. ఆయన ఒక్క మాటంటే చాలు వెలాది మంది కూలీలు కదిలేది.
ప్రాణం ఎట్టున్నది’’ అని అడిగిండు వెంకటయ్య...
‘‘ఏం ప్రాణమో ఎమో పోకుంటా రాకుంటా ఉంది’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా’’
అదే ఏమైంది.. ఎవని బ్రతుకు వాడు బ్రతకటమే కష్టమై•తాంది’’
‘‘సత్తయ్య మంచిగనే పని చేస్తాండుకదా.. వాడు ఇంట్లకేమి ఇస్తలేడా’’
‘‘ఎక్కడిది వాడు వాని పిల్లలు బ్రతుకుడే కష్టమైతాంది’’ ఇక మా మొఖం చూసేటట్టుఉందా’’
‘‘మరి చిన్నోడు’’
‘‘ట్రాక్టరు మీద పని చేస్తాండు’’
‘‘మరి నువ్వెమి పనిచేస్తలేవా’’
‘‘వయసు వయస్సు వాల్లకే పనులు దొరుకతలేవు నన్నెవ్వడు పనులకు పిలుస్తడు’’ అన్నాడు.
వీళ్ళ మాటలు విని శాంతమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది’’ వెంకటయ్య సారును చూసి ఎప్పుడొచ్చిండ్లు’’ అంది.
‘‘ఇప్పుడే’’
‘‘ఎక్కడుంటాండ్లు సారు కన్పిస్తలేరు’’ అంది మళ్ళి..
‘‘కరింనగర్ల’’
‘‘అక్కడికి ఎందుకు పోయిండ్లుసారు.. మీ అటువంటి వాళ్ళులేక పోయే సరికి ఇక్కడ ఎవ్వరు అడిగే టో•ళ్ళు లేకపోయిరి’’ అంది శాంత...
‘‘సారును ఏముండమంటవు... ఇక్కడ ఏమున్నది. అప్పుడంటే ఎక్కడ చూసిన జనం ఉండేది. అందరికి పనులు ఉండేది. సమస్యలు ఉండేవి. వాటిని పరిష్కరించాటానికి యూనియన్ అవసరమైంది. ఇప్పుడ జనంలేరు. యూనియన్లు అ జోరు లేదు’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా...
వెంకటయ్య ‘‘నిజమే’’ అన్నట్టుగా మౌనంగా తలాడించి ‘‘యూనియన్లు ఏడబోయినవి. మాగున్నయి. కాని నిజాయితీగా పని చేసేటోడులేడు’’ అన్నాడు బారంగా...
‘‘నిజమే సారు పర్మినెంటు లోకేషన్ల పని దొరకాలంటే ముప్పయి వెలు నడుస్తాంది’’
‘‘అ రోజుల్లో మనం ఎంత ంమందిని క్యాజువల్ వర్క్ర్కర్గా పెట్టించిలేదు... ఒకరి దగ్గర నయాపైస తీసుకున్నమా’’ అన్నాడు వెంకటయ్య పాత రోజులు తలుచుకొని...
‘‘నిజమే సారు ఆరోజులు వేరు...ఇప్పుడెమో నాయకులు పీతలపైస ఏరుకుంటాండ్లు’’ అన్నాడు నాగయ్య...
అ రోజుల్లో నాగయ్య వెంకటయ్యతోని పనిచేసిండు వెంకటయ్య ఎంత చెప్పితే అంత బంద్ అంటే బందుండేది. ఒక విదమైన ఉండేది. నాగయ్య యూనియన్లో రాత్రింబవళ్ళు తిరిగేది.
ఇద్దరు కాసేపు పాతరోజులు జ్ఞాపకం చేసుకున్నారు.
1976లో ఐఫ్.సి.ఐ ఉత్తపత్తి ప్రారంభమైన తరువాత నాల్గెండ్లకు రామగుండం కంట్రాక్టు అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ప్రారంభమైంది. దాదాపు వెయ్యి మంది పని చేసేవాళ్ళు. ప్లాంట్ మెయిన్ టెనెన్స్ బాయిలర్స్, సివిల్, బిల్డింగ్ వర్క్న ఒక్కటేమిటి అరోజు పని కంట్రక్టు కూలీలు చేసే వాళ్ళు, వాళ్ళు మీద సూపర్వైజ్ చెసెందుకు మాత్రంకంపిని మనష్యులు ఉండేది.
యూనియన్ ఎర్పడక ముందు కంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడిచేది. కనీస వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. అదిరించి బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు. కొంత మంది కంట్రాక్టర్లు కూలీలకు డబ్బులు ఎగ్గోటిన సందర్భలున్నాయి. ఎవరైనా ఎదురు మాట్లాడితే పనులనుండి తొలగించేవాళ్ళు... పంజాబ్కు చెందిన ‘‘సంగ’’ అనే ఎలక్ట్రిక్ కంట్రాక్టర్ మరి దుర్మార్గంగా ఉండేవాడు. అనేక సందర్భలలో కూలీల మీద చెయ్యి చేసుకున్నాడు.
అటువంటి సమయంలో వెంకటయ్య నాయకత్వంలో యూనియన్ పుట్టింది. కంట్రాక్టు కూలీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చెపట్టింది. దాంతో కంట్రాక్టర్లకు కన్నెర అయింది.
కంట్రాక్టు కార్మికులను గవర్నమెంటు జి.వో ప్రకారం కనీస వెతనాలు చెల్లించాలనే డిమాండ్ మీద సమ్మె చేసినప్పుడు పెద్ద పోరాటమే జరిగింది.
‘‘చెప్పుకింద రాయిలాగా అణిగి మణిగి ఉండే కూలి నాలి కొడుకులు మాకు ఎదురు తిరుగుతారా’’ అని కంట్ట్రార్ల కోపానికి వచ్చి సంఘంలో ముందు నిలచిన వెంకటయ్య మీద తమ గుండాలను పంపి హత్యప్రయత్నం చెసిండ్లు.
దాడికి వచ్చిన గుండాల మీదికి కూలీలు ఎదురు తిరిగిండ్లు. రోజంతా మొద్దు కష్టం చేసి దాటు దేలిన కూలీల ముందు గుండాలు నిలువలేక పోయిండ్లు. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిండ్లు.
వెంకటయ్య మీద హత్యయత్నం చేసిన కంట్రాక్టర్లు తమ పలుకుబడి ఉపయోగించి ‘‘తమ అనుచరుల మీద దాడి చేసిండ్లని దొంగ కేసు పెట్టిండ్లు... పోలీసులు వచ్చి వెంకటయ్యతో సహా కొద్దిమందిని పట్టుక పోయి ఠానా లో వేసి కొట్టి కేసులు పెట్టిండ్లు.
ఈ సంఘటన కూలీలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే దాక, తమ న్యాయమైన డిమాండ్లను ఓప్పుకునేదాక సమ్మె విరమించేది లేదని కూలీలు తెగెసి చెప్పిండ్లు.
సమ్మె వారం రోజులు సాగింది. ఎఫ్.సి.ఐ ప్రోడక్షన్ అగిపోయింది. కూలీలు పని చెయకుండా ఒక్క రోజు కూడా నడువని పరిస్థితి... దాంతో మెనేజుమెంటు దిగివచ్చి కంట్రాక్టర్ల మీద ఓత్తిడి తెచ్చింది.
‘‘కూలీలా గొంతమ్మ కొర్కెలు తీరుస్తూ ఇక మాకేమి మిగులు బాటు అయితది’’ అంటూ మొదట కంట్రాక్టర్లు మొండికేసినా మెనేజుమెంటు వారిని కన్విన్స్ చేసి ఒక ఓప్పందానికి వచ్చింది.
అవిదంగా సమ్మె విజయవంత మైంది. కూలీల జీతాలు పెరిగినవి. యాడాదికి రెండు డ్రెస్లు, సేఫ్టీషూస్, క్యాంటిన్, ప్రావిడెంట్ ఫండు కట్టింగ్, యాడాది పన్నెండు లీవులు ఇచ్చెలా ఓప్పందం జరిగింది.
అన్నిటి కంటె ముఖ్యమైంది. గతంలో కంట్రాక్టకూలీలకు నిర్దిష్టమైన పనిగంటలు అనేవి ఉండేవి కావు. కొన్ని సార్లు పన్నెండు గంటలు పని చేయించుకొనేది. ఓప్పందం తరువాత కూలీలను ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయించవద్దని ఒక వేళ అనివార్యమై పనులు చెయించాల్సి వస్తే అదనంగా పని చేసిన గంటలకు ఓవర్టైమ్ పెమెంట్ చేయించాలని ఓప్పందం జరిగింది. అలాగే అరస్టు చేసిన నాయకులను విడుదలచేసారు. కూలీల డిమాండ్స్ ఏవి కొత్తవి కావు. గవర్నమెంట్ జివోతో ఉన్న అంశాలే కాని అమలు జరిగేవికావు. ఎప్పుడైతే కూలిసంఘం సమ్మె తరువాతనే అమలు లోకివచ్చినవి.
సమ్మె విజయవంతం కావటంతో కూలిసంఘం బలపడింది. దీని ప్రబావం ప్రక్కనే ఉన్న ఎన్టిపిసి కార్మికుల మీదప్రబావం చూపింది క్రమంగా అక్కడ కూలి సంఘం బలపడింది. ఎన్టిపిసి లో కార్మికులు తమ సమస్యల మీద మూడు సార్లు సమ్మె చేసి విజయం సాధించారు.
కూలీలు ఎక్కువగా నివసించే పికే రామయ్య కాలనీలో అంత వరదాక కరెంటు లేదు, యూనియన్ అందోళన పలితంగా కరెంటు వచ్చింది. మంచినీళ్ళ కోసం రెండు పంపులు వచ్చినవి. అయినా చాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి.
పోయిన వర్షకాలం మురికి గుం•లా ఉండే పికే రామయ్య కాలనీలో కలరా వచ్చి షహి దుర్గ తండ్రి భగవతి నాగమణి భర్త రామయ్య చనిపోయిండ్లు. అ సందర్భంగా యూనియన్ అందోళచేస్తె ‘‘ఎంమ్మార్వో’’ వచ్చిండ్లు.
ఎంమ్మార్వో ముందు కాలనీ వాసులు చాల సమస్యలు ఎకరవు పెట్టిండ్లు. మాకు రెషన్ కార్డులు లేవు. ఉచిత బియ్యం వస్తలేవు. మేము ఈ దేశవాసులంకామా? మాకెందుకు ఇవ్వరు.. అని నిలదీసిండ్లు. కాని అన్ని చేస్తామని హమీ ఇచ్చిన ఎంమ్మార్వో అటు తరువాత తన మాట నిలుపుకోలేదు.
ఉండి ఉండి వెంకటయ్య ‘‘చంద్రయ్య కన్పిస్తాండా’’ అని అడిగిండు.
‘‘ఏ చంద్రయ్య’’
‘‘అదే బొందయ్య కొడుకు’’
‘‘మొన్న బొందయ్య కన్పించిండు కాని కొడుకు సంగతి ఏం తెల్వలేదన్నాడు. అయినా కొడుకు ఎప్పటికైనా రాకపోతడా అని ఎంత కష్టం వచ్చినాభూమి అమ్మలేదట’’ అన్నాడు నాగయ్య...
‘‘బొందయ్య ఇక్కడ ఉంటాండా’’
‘‘చాల రోజులాయే ఎల్లిపోయి ఆయన భార్యకూడా చనిపోయిందట... ఊరిమీద తిర్గి అడుక్కొని బతుకుతాండు’’ అన్నాడు నాగయ్య...
అమాటలకు ఎంకటయ్య మన సులో బాదేసింది. ఎక్కడి దక్కడ చిల్లం కల్లం అయ్యింది. గాలిలో దీపం లాంటి కూలీల బ్రతుకుల్ని కాపాడటానికి ఒక ప్రయత్నమైతే చెసిండు. కాని, తుపానులా వీచిన గాలికి ఆ దీపం అరిపోయింది. కూలీ బ్రతుకుల్లో మళ్ళి చీకట్లు కమ్ముకున్నాయి. కూలీల చమట చుక్కలను లాబాలుగా పిండుకోవటానికి అందరుకు అందరుతోడు దొంగలే. కూలీల బ్రతుకుల్ని బాగు చేస్తామని చట్టాలు చేసిన పాలకులు, అచట్టాలు ప్రభుత్వరంగ సంస్థలోనే అమలు జరుగకుంటే పట్టించుకొని లేబర్ అపీసర్లు...
మొదటి సారి కూలి సంఘం మహాసభలు ఎంతో ఉత్సాహంగాజరిగినవి. ఎన్టిపిసి కమ్యూనిటి హాల్లో మీటింగ్ జరిగింది. సహజంగా అయితే మెనేజుమెంటు కూలీలను ఆ చాయలకు కూడా రానివ్వదు. అటువంటిది అందులో మీటింగ్ పెట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చిందంటే, ఆ రోజుల్లో కూలిసంఘం ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
వెంకటయ్యకు చంద్రయ్య నల్లటి బక్క మొఖం గుర్తుకు వచ్చింది. దాంతో ఆయన అప్రయత్నంగానే ‘‘వాడు మొదటినుండి అంతే రాజీపడేవాడు కాదు. చెవసచ్చి ఒపిక నశించి మా అటువంటి వాళ్ళు వెనక్కి తగ్గినా... చంద్రయ్య ముందుకే పోయిండు’’ అన్నాడు బారంగా...
‘‘మరింక ఏం చేస్తడు. మనిషి ముందు అకలికి చచ్చుడో ఎదురుతిరిగి బ్రతుకుడో తెల్చుకోవాలన్నప్పుడు చంద్రయ్య లాంటి వాళ్ళు ఎదో తిరగటానికే సిద్దమైండ్లు’’ అన్నాడు నాగయ్య...
కూలి సంఘం బలహినపడటానికి అనేక కారణాలున్నాయి. పనులు లేక చాల మంది బ్రతక పోవ•ం ఒక కారణమైతే కూలి సంఘంలో అంతర్ కలహలు ఎర్పడటం మరో కారణమైంది.
నిత్యం కూలీల మధ్య తిరుగుతు పని చేసేవాల్ళు కొందరైతే రాష్ట్ర నాయకులుగా కెంద్రనాయకులుగా చెలామణి అవుతు వారి మీద పెత్తనం చేసేవాళ్ళు మరికొందరు. సమాజంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలు సంఘంలోకి చొచ్చుకొచ్చింది.
ఏ రోజుకు ఆరోజు పని చేసకుంటూ తిండికి తికానలేని కూలీల మధ్య పనిచేయటం అంటే మాములు విషయం కాదు. అందుకు ఏంతో ఓపిక పట్టుదల, సేవబావం కావాలి. కాని చాల మందినాయకులకు అలక్షణాలు లేవు. సభలు సమావేశాలప్పుడు తెల్ల బట్టలు వేసుకొని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, క్రింది స్థాయిలో పని చేసే వారి మీదమాత్రం పెత్తనం చేసేవాళ్ళు. అంత వరదాక అందర్గతంగా జరిగే ఘర్షణ క్యాజువల్ వర్కర్స్ సమ్మె సందర్భంగా బయటపడింది.
ఎన్టిపిసిలోని మెకానికల్ ఎలక్ట్రికల్ సెక్షన్లో లోడింగ్ అన్లోడింగ్ చేసే వంటి నిత్యం పనులు ఉండే చోట పనిచేసే కూలీలను క్యాజువల్ లెబర్గా పర్మినెంటు చేయ్యలనే డిమాండ్తో సమ్మె మొదలైంది.
అయా పనులు స్వబావ రీత్య రోజు ఉండేవి. అయితే ఆ పనులు చేసే కంట్రాక్టర్లు మారి నప్పుడు మారిన కంట్రాక్టరు కొంతమందిని తీసివేసి, తనకు ఇష్టమైన వారిని మరి కొంత మందిని పెట్టుకునే వాళ్ళు. దీన్ని కూలీలలు వ్యతిరేకించిండ్లు. ఎంట్రాక్టర్లు మారిన పర్మినెంటు పనుల చేసే వారిని తీసివేయవద్దు అన్నది డిమాండ్. అట్లా చేయటం వలన సంస్థకు వచ్చే నష్టం ఏమి లేదు. కాకుంటే పర్మినెంటు పనులు చేసే కూలీలకు రోజు పని ఉంటుంది. అది కూడా కంట్రాక్టు కూలియే...
ఎప్పుడైతే సమ్మె మొదలైందో పనులు సాగక మెనేజుమెంటు ఇరకాటంలో పడింది. కంట్రాక్టర్లెమో అందుకు ఓప్పుకోవటంలేదు. ఎందుకంటే కంట్రాక్టర్లు పర్మినెంటు పనులు కూలీలకు కేటాయించాలంటే కూలీల దగ్గర లంచాలు తీసుకొని పనుల్లో నియమించుకునేవాళ్ళు. చివరికి ఇది ఎట్లా పరిణామం చెందిందంటే కంట్రాక్టర్లు మారినప్పుడల్లా తమ పనిని కాపాడుకోవాటానికి సమ్మె ఉధృతి పెరిగే సరికి మెనేజుమెంటు కుట్రపూరితంగా వ్యవహరించింది. అగ్రనాయకులతో మంతనాలు జరిపి వారిని లోబర్చుకుంది.
నలుబైశాతం మందికి క్యాజవల్ వర్కర్లగా పర్మినెంటు పేసుల్లో పనిచేయాటానికి మెనేజుమెంటు ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే గణవిజయంగా నాయకులు చెప్పుకొచ్చిండ్లు.
‘‘పదకొండు వందల మంది పర్మినెంటు పనిస్థలాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంటు చేయాలని మనం సమ్మె చేస్తే కనీసం మనతోని విచారించకుండా నాయకులు విద్రోహ పురితమైన ఒప్పంద చేసుకున్నారు’’. అంటూ కూలీలు అవేశపడ్డారు.
‘‘ఇంకా నాలుగు రోజులు సమ్మె కొనసాగితే మెనేజుమెంటు అందరికి పర్మినెంటు ఫేసులు ఇచ్చేది. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని కూలీల మధ్యకు పోవాలి. నిత్యం కూలీల మధ్య తిరిగే వారి బాధలు వారికేట్లా అర్థమైతది. అంటూ వెంకటయ్య అవేదన చెందాడు.
‘‘లేదన్నా అందర్ని పర్మినెంటు చేసేదాక సమ్మె విరమించవద్దు’’అంటూ చంద్రయ్య అవేశ పడ్డాడు. కూలి సంఘంలో చీలిక వచ్చింది. వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగించాలని పిలుపు ఇచ్చింది.
ఒప్పందం చేసుకున్న నాయకులు తాము చేసుకున్న ఒప్పందాన్ని సమర్థించుకోవటానికి మీటింగ్ పెట్టిండ్లు.
‘‘పోరాటం అన్న కాడ సళ్ళుబిగు ఉండాలి. మొండికేస్తే మొదటికే మోసం. అందుకే ఈ సారి 40% మందిని పర్మినెంటు ఫేసులు ఇస్తారు. మిగితావారిని దశలవారిగా పర్మినెంటు చేస్తారు’’ అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసింది.
‘‘అట్లా ఏమన్నా ఒప్పందం ఉందా’’ అంటూ చంద్రయ్య సభలోనే నాయకులకు ఎదురు తిరిగిండు.
కూలీల కోపంతగ్గించటానికి నాయకులు అట్లా చెప్పుకొచ్చిండ్లు కాని వాస్తవానికి అటువంటి ఒప్పందం ఏదీలేదు.
‘‘ఇటువంటి దుందుకుడు చర్యలే యూనియన్కు నష్టం చేస్తాయి’’ అంటూ నాయకులు అవేశపడ్డారు.
సమావేశం కాస్త రసాబసాగా మారింది. ‘‘అందరిని పర్మినెంటు చేసేదాక ఎవరు పనులు చేయవద్దు’’ అంటూ వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగిచింది.
యూనియన్ విబేదాలు తారా స్థాయికి చేరింది.
‘‘యూనియన్ క్రమశిక్షణకు కట్టుబడ కుండా వ్యక్తిగత పని విదానంతో పనిచేస్తున్న వెంకటయ్య మరికొంత మందిని యూనియన్ బహిష్కరిస్తున్నట్టుగా అగ్రనాయకత్వం ప్రకటించింది.
‘‘పోరాడే వానికి వేదికలే కరువా, వాడు కాకుంటే మనమే ఒక పోటి యూనియన్ ఎర్పాటు చేసుకుందాం’’ అన్నాడు సమ్మెకారులు...
అట్లా వెంకటయ్య నాయకత్వంలో మరో కూలిసంఘం అవిర్భవించింది.
సమ్మెకొనసాగటం మెనేజుమెంటుకు ఇబ్బంది కల్గించి పోటి సంఘం ఎర్పడటం దాని నాయకత్వంలో సమ్మె కొనసాగటం అగ్రనాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాళ్ళు ఏమి చెయ్యలేక వెంకటయ్యకు రాడికల్స్ సంబందం ఉంది’’ అంటూ పోలీసులకు లోపాయికారిగ ఎగదోసిండ్లు. ఒక రోజు పోలీసులు వచ్చి యూనియన్ అపీసుమీద దాడి చేసి వెంకటయ్య, చంద్రయ్య మరి కొంతమందిని అరెస్టు చేసి తీసుక పోయిండ్లు. అవిదంగా సమ్మెకు నాయకత్వం లేకుండా చేసిండ్లు. మరోవైపు పర్మినెంటు అయిన వారికి కాని వారికి మధ్యన విబేదాలు సృష్టించిండ్లు. పలితంగా సమ్మె విపలమైంది.
ఈలోపున కుక్కమూతి పిందెల్లా చాల కార్మిక సంఘలు పుట్టుకొచ్చినవి. బిజెపి నాయకుడు, కంట్రాక్టరు అయిన రంగయ్య తన అనచరుడు లక్ష్మన్ను నాయకుడుగా చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబందంగా కూలి సంఘం ఏర్పాటు చేసిండు. కంది చంద్రయ్య నాయకత్వంలో కాగ్రెసు వాళ్ళు ఒక సంఘం స్థాపించిండ్లు. ఏఐటియుసి వాళ్ళు ఏఫ్.సి.ఐలో అపరేటర్గా పనిచేసే రామయ్య అనే వాని నాయకత్వంలో కూలి సంఘం పెట్టిండ్లు. ఎవని దుకాణం వానిదైంది. ఇట్లా కూలీలు చీలికలు పేలికలైండ్లు.
ఒకప్పుడు బలంగా పని చేసిన కూలి సంఘంబలహినమైంది. వెంకటయ్య తదితరులు బయిటికి పంపిన నాయకులు ఎన్టిపిసి ఎంప్లాయి ఈలోపున ఐఫ్సిఐ మూత పడింది. వాస్తవానికి ఎర్పాటు చేయాటమే లోపభుయిష్టంగా జరిగింది దానికి తోడు అడుగు అడుగున అవనీతి చోటు చేసుకున్నది. టెక్నాలజీ సప్లయి చేసిన బహుళ జాతి సంస్థలు ఇచ్చె లంచాలకు ••క్కుర్తి పడిన అధికారంలో ఉన్న పెద్దలు పనికి మాలిన, అవుట్డేట్ అయిన సెకండరీగ్రెడ్ టెక్నాలజీని అం•గట్టారు. ఎఫ్సిఐ చుట్టు సింగరేణి బొగ్గు గనులున్నా, ఏఫ్సిక్ష్మ గోడను అనుకొని 2100మెగావాట్ల విధ్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టిపిసి ఉన్నా, బొగ్గు కొరత వలన కరెంటు కొరత వలన సంస్థకు వందల కొట్లు నష్టాలు సంభవించింది. పలితంగా ఎఫ్సిఐని మూసివేసిండ్లు.
ప్యాక్టరీ మూత పడటంతో వందలాది మంది కూలీలకు పనులు లేకుండా పోయింది. దాంతో తట్టాబుట్టా పట్టుకొని చాల మంది కూలీలు మళ్ళీ వలస పోయిండ్లు.
ఈ అటుపొట్ల మధ్య ఒంటరి పోరాటం చెయ్యలేక వెంకటయ్య సంఘం వదులుకొని కరింనగర్కు బ్రతక పోయిండు.
ఎక్కడికి పోయినా కూలిల బ్రతుకు ఇంతేనని బావించిన చంద్రయ్య లాంటి అవేశపరుడు కూలి బ్రతుకులు మారలంటే కూలిరాజ్యం రావాలని అందుకు పోరాటమే మార్గమని అడవి బాట పట్టిండు.
వెంకటయ్యకు గతమంత గుర్తుకు వచ్చి మనసు కకావికలమైంది. ఆయన మెల్లగా పోవటానికి లేచిండు. అది చూసి నాగయ్య ‘‘సారు పోతాండ్లా’’ అన్నాడు.
‘‘రాజయ్యను కలిసి పోతా’’
‘‘ఉన్నడో లేడో’’
‘‘అదే’’
‘‘ఎంలేదు. మనిషి పుర్తిగా చాతకాకుండా అయ్యిండు’’
ఎప్పుడన్నా గట్లనే కన్పిస్తడు కాని రెండు మూడు రోజులాయే కన్పిస్తలేడు’’
‘‘సరే మనొళ్ళు ఎవరన్నా కలుస్తరో చూస్తా’’ అంటూ వెంకటయ్య లేచిండు.
‘‘అయ్యా చిన్న పని’’ అన్నాడు నాగయ్య...
‘‘ఎంటీ’’ అంటూ క్షణమాగి పరిక్షగా చూసిండు వెంకటయ్య...
‘‘పనులు లేక కష్టమైతాంది. మీరే ఎవరికైన చెప్పి పని ఇప్పించాలి’’ అంటూ నాగయ్య నసిగిండు.
‘‘ఎనకట అంటే నడిచింది. ఇప్పుడు మనమాట ఎవరు వింటరు. సరే ఒపని చేస్తాం’’
నాగయ్య అసక్తిగా చూసిండు.
‘‘లక్ష్మన్ ఇప్పుడు స్వంతంగా బిల్డింగ్ కట్టి పనులు చేస్తాండు కదా వానితో చెప్పుతా... ఎదో ఒకపని వాడే చూయిస్తడు. నువ్వు పొయి ఆ యాన్ని కలువు’’ అన్నాడు.
సరే ‘అంటూ నాగయ్య రెండు చేతులు జోడించిండు.
వెంకటయ్య బారంగా ముందుకు కదిలిండు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
సైరన్ నవల రెండవ పార్ట్ – పదకొండవ భాగం
( (సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
36
అక్కడి నుండి మొగిలి, సత్యం హాస్పటల్ చేరేసరికి సాయంకాలం అయిదయ్యింది. హాస్పిటల్ ముందు అయిదారు వందల మంది ఉన్నారు. కార్మికులు, విలేకర్లు, రాజకీయనాయకులు, యూనియన్ నాయకులు, మహిళలు, విద్యార్థులు, పోలీసులు, కంపెనీ అధికార్లు ఎవరికి తోచిన విధంగా వాళ్లే అరుస్తున్నారు...మధ్యలో సి.ఐడిలు సివిల్ బట్టల్లో తిరుగుతున్నారు. హాస్పిటల్ బయట రోడ్డుమీద జీబులు, ట్రక్కులు, బస్సులు నిలబెట్టి ఉన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది.
సత్యం హాస్పటల్ పక్కనే గల హోటల్లో కూర్చున్నాడు. ‘‘కామ్రేడ్ నేను పొయి చూసొత్త - మా వోళ్లంత ఈడనే ఉన్నరు. మా సడ్డకుడు పోశెట్టి వాళ్ల యూనియన్ డెలిగేటు - మొన్న శిబిరం కాడ గుండాలు కొట్టిండ్లు గద దెబ్బలు తాకినయ్. మీరు ఈడనే ఉండుండ్లి.’’
‘‘నేను వస్త పోదాం’’ సత్యం...
‘‘అందరం పోతే పనినడువది అక్కడ నిన్ను నన్నులోపటేత్తే’’ మొగిలి నచ్చచెప్పి కూర్చుండబెట్టి మందిలో కలిసి పోయిండు.
కాసేపటికి కొడుకు నెత్తుకొని - ఒక కడుపుతోనున్న పిల్లను తీస్కొని చంద్రకళ హోటల్ దగ్గరికి వచ్చింది.
కిరణ్ను సత్యంకిచ్చింది. వాళ్లు హాస్పిటల్ మేన్గేటు చేరేసరికి అక్కడ పోలీసువలయం ఆపింది...కడుపుతో నున్న పిల్లహాస్పటల్ పాసు సూచింది. సత్యం ఆమె పక్కకు నిలుసున్నడు. సత్యంను ఆపిండ్లు...
‘‘మా ఆయన’’ అన్నది ఆపిల్ల.
‘‘మీ ఆయనైతే -మినిష్టరా? గడబెడ గున్నది - లోపటికి పోనిత్తలేం’’ పోలీసు...
‘‘చానా దూరం మావూరు నుంచి వచ్చిండు. మాది ప్రసూతి వార్డు అక్కడ లొల్లిలేదు’’ ఆ పిల్ల అన్నది.
‘‘పో - తొందరగ మళ్లరా - ఆన్నేకూసోకు’’పోలీసులు అటిటుసూసి ఒదిలి పెట్టిండ్లు -పోలీసు వలయం తరువాత వందలాది మంది మహిళలు కూచుండి దర్నా చేస్తున్నారు వాళ్లల్లో రెహనా, సరిత, లక్ష్మి, రాజేశ్వరి అక్కడక్కడున్నారు.
‘‘పోలీసుజులుం’’
‘‘నశించాలె’’
గొంతుబొంగురుపోయినా రెహనా నినాదాలిస్తోంది...పోలీసుల నెత్తులమీది నుండి సత్యం వెనక్కి తిరిగి చూసిండు. లోపల అనేక వార్డులున్నాయి... పోశెట్టి ఉన్న వార్డులో ఒదిలి పెట్టి ఆ పిల్ల వెళ్లిపోయింది. ‘‘థాంక్స్అక్క’’సత్యం. ఆ పిల్ల నెనరుగా చూసి వెళ్లిపోయింది.
కిరణ్ దారి చూపిండు...పోశెట్టి బెడ్మీద కూర్చుండి ఉన్నాడు. అతిని పక్కన శంకర్ కూర్చుండి ఉన్నాడు. అతని ముఖమంతా పీక్కపోయి ఉన్నది. బట్టలు దుమ్ముకొట్టుకపోయి ఉన్నాయి....
‘‘మీకోసం చూస్తున్న - ఎక్కడున్నరో తెలువదు. అరెస్టు కాలేదని తెలిసింది...’’ శంకర్ సత్యంను ఆలింగనం చేసుకున్నాడు. అతని ముఖంమీద పొద్దటి నుంచి జరిగిన కాల్పుల తాలూకూ ఉద్రిక్తత పోలేదు. ఇంతలోనే చంద్రకళ వచ్చింది... ఆమెతో పాటు మొగిలి, శంకర్ మొగిలిని ఆలింగనం చేసుకున్నాడు.
‘‘మొగిలీ! మీకోసం కొండకెదిరి చూసినట్టు ఎదిరి చూత్తనం. ఇగో ఈ పిలగాడు మూడు గంటల నుంచి గిప్పుడు కూసున్నడు... గీ పిలగాడు లేపోతే ఆగమాగంగ ఉండే దవాఖానను లైనుకు తెచ్చిండు.’’
బయటకు పిలిచి చిన్ని చిట్టీ సత్యం చేతికిచ్చింది.
అది సరిత పంపిన చిట్టీ ‘‘అరగంటలో పోస్టు మార్టం అయిపోతుంది. ఏంచెయ్యాలె, కామ్రేడ్స్?’’
‘‘పానం పడ్డదా? పిలగా - పో - పొయ్యి ముఖం కడ్కుచ్చుకపో -పది నిమిషాలల్ల రండ్లి’’ చంద్రకళ...
సత్యం, శంకర్ లేచి బయటకు పోయిండ్లు -దూరంగా ఆపరేషన్ థియేటర్ పక్క రెండు బెంచీలున్నాయి. ఒకటి ఖాళీగా ఉంది.
‘‘ఎక్కువ టైంలేదు. ఉన్నది ఇద్దరమే - మనం నిర్ణయంతీసుకోవచ్చా’’ శంకర్...
‘‘తప్పదు’’
‘‘ఏంచేద్దాం?’’
‘‘సూడవోతే ఇదిట్లా బద్దలయ్యిందిగని - దీనెనుక చానాకుట్రలున్నయి’’ సత్యం...
‘‘ఉన్నయి - మన కవరు గివరు తొలిగిపోయింది. అందరు గల్సి మనలను మూసేసి, లేకుంట చెయ్యాలనుకుంటండ్లు’’ శంకర్...
‘‘కానియ్యి -మనయినాలుగు డిమాండ్లు - కాల్పులు మీదన్యాయవిచారణ కేసులుజెట్టి జరుపాలి. చనిపోయిన వాళ్లకు యాభైవేలు, వారిపిల్లలకు ఒక్కరికి ఉద్యోగం, గాయపడ్డ వాళ్లకు కమిటివేసి నష్టపరిహారం నిర్ణయించి ఇవ్వాలె. లోడింగు కాంట్రాక్టు పద్దతిఎత్తేసి -వాళ్లందరిని బదిలీ పిల్లర్లు చెయ్యాలి. అరెస్టు చేసిన వారందరని బేషరుతుగా విడుదల చేయాలి.’’ సత్యం...
ఈ విషయాలన్ని కంపెనీ అధికారి ప్రజల ముందు బహిరంగంగా ఇప్పుడే ప్రకటించాలి.’’ సత్యం...
‘‘మహిళలు, చనిపోయిన వారి బంధువుల తరుపున మనవాళ్లు ఈ డిమాండ్లు పెడుతరు’’ శంకర్
‘‘ఆక్సన్ ప్లాను శవాలను కదలనియ్యక పోవటం’’
‘‘లాఠీ చార్జ్చేస్తే?’’
‘‘చెయ్యరు. ఇప్పటికే డిపెన్సుల పడ్డరు. మీరు మహిళా కామ్రేడ్స్ ఈ స్థలంలో లేకపోతే ఇప్పటికే ఈ తతంగం ముగిసేది. మీ అందరికి అభినందనలు - మీ కామ్రేడ్లీస్పిరిట్ గొప్పది’’ సత్యం ఉద్వేగానికి లోనయ్యాడు...
‘‘గిదేం ఉన్నదన్న గిన్ని వందల మంది -కాల్పులు జరిగినంక కూడా ఇక్కడ చేరిండ్లంటే మనం ఎంత కామ్రేడ్’’ శంకర్.
‘‘లాఠీ చార్జి చేస్తే మనం రంగంలోకి దిగుదాం.’’ శంకర్ మళ్లీ...
‘‘ఎట్లా?’’
‘‘ముందుకు పోయి అరుస్తాం’’
‘‘వద్దు - నాయకత్వం పోతుంది. వాళ్లనుకున్నది నెరవేరుతుంది’’
‘‘మరేం చేద్దాం?’’
‘‘మనం బయట మిగులుతేనే ఏదైనా చేయగలం - మన శక్తులన్నింటిన్నింటిని కూడగట్టి నిరవధిక సమ్మెకు పిలిపిద్దాం’’
‘‘ఫేలయితే..?’’
‘‘మనం బాధ్యత తీసుకుందాం. ప్రజలే నాయకులు...’’
చంద్రకళ, సరిత వెతుక్కుంటూ వచ్చారు...
సరితకు నాలుగు డిమాండ్లు చెప్పారు... సరిత వెళ్లిపోయింది. చంద్రకళ వాళ్లిద్దరిని తీసుకొని ఇంకో వార్డుకు నడిచింది. కాల్పుల్లో గాయపడిన వారిని జనరల్ వార్డులో వేశారు. అంతా గందర గోళంగా ఉన్నది... అక్కడ రెండు బొగ్గుబాయిల ఫిట్ కమిటి సభ్యులు కల్సిండ్లు... వాళ్లద్దరితో మాట్లాడి అలాయిబలాయి తీసుకున్నరు... ‘‘మన కామ్రేడ్స్ విడుదలకోసం ఏం చేద్దా’’ సత్యం అడిగిండు.
‘‘వాళ్లు ఉత్తగ ఒదులరు. మనమెంత హుశారుగున్నా మనపని తెలుత్తదిగద - మనం కవరు సంఘాలల్లో పనిచేసినా వాళ్లు వాసన పడుతరుగద - మనం ఫిట్ కమిటీల పెట్టిన రామలింగం సంగతి బయటకు పొక్కింది. మన నిర్మాణం గురించి తెలువది. ఎవులున్నరన్నది తెలువది?’’
‘‘మరెట్లా?’’ శంకర్
‘‘ఎట్లేమున్నది? మన నాయకులేపోంగా - చూసుడెక్కడిది?’’ గీటైంల మనం ఖైరతు గుండకపోతే మనపని ఎనుకకు బోతది. సల్లవడ్తది’’ మరో ఫిట్ కమిటి డేవిడ్.
‘‘మరేం చేద్దాం?’’ సత్యం..
‘‘నిరవదిక సమ్మె’’ రామలింగం డేవిడ్ ఒక్క సారే అన్నారు.
‘‘ఎప్పటి నుండి మొదలు పెట్టచ్చు’’ సత్యం...
‘‘ఇప్పటికిప్పుడు కుదరదుగని - రేపు ఫస్టుషిప్టునుండి’’
మనందరం ఒకే అంటే - తిరుగుదాం - రేపు పస్టుషిప్టునుండి’’ రామచంద్రం - డేవిడ్...
‘‘సరే కామ్రేడ్ మన ప్రయత్నం మనం చేద్దాం తప్పకుండా నిరవధిక సమ్మె ఎట్లా?’’ సత్యం...
‘‘మేం బయటకు పోతం - ప్లాను చేస్తం. మీరు చెయ్యండి’’ రామలింగం డేవిడ్...
‘‘ఆపని మీదనే ఉందాం’’ లాల్సలామ్. వీలైతే రాత్రికి కలుద్దాం సత్యం, శంకర్ ఆవార్డునుండి బయటకు వచ్చారు.
‘‘కామ్రేడ్ యస్.బి. సి.ఐడీలు వాళ్లు చాలా మందున్నరు... వాళ్లకు తెలిసి పోయినట్టున్నది. మనం బయటికి తొందరగా పోకతప్పదు...’’ శంకర్ వార్డు చివరలో తచ్చాడుతున్న సివిల్ బట్టలపోలీసును చూయించాడు.
‘‘ఏం జరుగుతుందో? చూడాలికదా?’’సత్యం...
‘‘హాస్పిటల్ బయటినుండి చూద్దాం మనకు తెలుస్తుంది.’’ చంద్రకళ మొగిలిని వెంట బెట్టుకవచ్చింది...
‘‘కామ్రేడ్ బయటకు పోవడమెట్లా?’’ సత్యం...
‘‘వచ్చిందారినే’’ మొగిలి...
‘‘కాదు నావెంట రాండ్లి - అక్కడ అందరిని సోదా చేస్తండ్లు - ఏదో గడబిడ నడుస్తంది.’’ చంద్రకళహాస్పిటల్ వెనుక దిక్కు వాళ్ల ముగ్గురిని తీసుక పోయింది... హాస్పిటల్ వెనుక భాగంలో చిన్న గేటున్నది...ఆగేటు ఆవల డాక్టర్ల కోసం కట్టిన క్వార్టర్లున్నాయి. డాక్టర్ల కోసం పెట్టిన గది.
ఒక్కరొక్కరు ముగ్గురు బయటపడి - మళ్లీ హోటల్ కాడికొచ్చారు. తలాకొంత దూరంలో జీబుల పక్క నిలుచున్నారు.
మొగిలి మందిలో కలిసిపోయిండు.
మహిళలు నినాదాలు ఇస్తున్నారు.
‘‘పోలీసుల మీద కేసు పెట్టాలె’’
‘‘న్యాయ విచారణ జరిపించాలె’’
‘‘అన్ని రాజకీయ పార్టీలు’’
‘‘మద్దతు తెలుపాలి’’
‘‘చినిపోయిన వారికి ఒక్కొక్కరికి యూభైవేలు కాంపన్సేషన్ ఇవ్వాలె’’
‘‘వారి పిల్లలకు ఇంటికొకరకి ఉద్యోగం కల్పించాలె’’
‘‘ఇవ్వాలె’’
‘‘గాయపడ్డవారికి కమిటివేసి నష్టపరిహారం’’
‘‘ఇవ్వాలె’’
‘‘లోడింగ్ కంట్రాక్టు’’
‘‘ఎత్తేయాలి’’
‘‘లోడర్లందరిని బదిలీఫిల్లర్లుగా సింగరేణి తీసుకోవాలి’’
‘‘అరెస్టు చేసిన వారందరినీ’’
‘‘బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కార్మికుల ఐఖ్యత’’
‘‘వర్ధిల్లాలి’’
‘‘అమర వీరులకు’’
‘‘జోహర్లు’’
సరిత, లక్ష్మి నినాదాలు యిస్తున్నారు. రెహనా గొంతు పూర్తిగా పోయింది. నినాదాలు మందిలోకి వెళ్లాయి. అన్ని మూలల నుండి విద్యార్థులు, కార్మికులు, మహిళలు అరుస్తున్నారు. మరణించిన కార్మికుల బందువులు, పిల్లలు పెద్ద పెట్టున రోదిస్తున్నారు... అరుపులతో, రోదనలతో హాస్పిటల్ ఆవరణ విశాదంగా ఉంది. చాలా మంది ఏడుస్తున్నారు. తిడుతున్నారు. ఆగమాగంగ ఆడికీడికి తిరుగుతున్నారు. మందిలో కలకలం, విశాదం, కోపం కలెగల్సిన ఉద్విగ్నత విలేకర్ల గుంపు ముందుకొచ్చి డి.యస్.పిరెడ్డి సబ్ కలెక్టర్ విద్యాసాగర్ రావును చుట్టుముట్టారు. వాళ్లిద్దరి మధ్యలో సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ ధర్మారెడ్డి, పర్సనల్ మేనేజర్ మోహన్ రావు పరెషాన్గ నిలుసుండి ఉన్నారు. కొంచెందూరంలో మరో ఇద్దరు పర్సనల్ మేనేజర్లు - నిలుచున్నారు. ఏవేవో కాగితాలు పట్టుకొని ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు మంద మధ్యలో ఉన్నారు. వాళ్లపక్క పోలీసులు లాఠీలతో దడిగట్టినట్టు నిలుసున్నారు. వాళ్ల కావల మహిళల గుంపు నినాదాలిస్తోంది.
ఇంతలోనే కాంపౌండు గోడలోపల పోస్టుమార్టం గది నుండి వచ్చే ఎడమవేపున గల రోడ్డునుండి పోస్టుమార్టం చేసిన శవాలను తీసుకొని రెండు అంబులెన్సులు వచ్చాయి. చనిపోయిన వాళ్ల బందువుల గుంపు ఘొల్లు మంది - ఏడ్పులు హాస్పిటల్ అంతావ్యాపించాయి. అక్కడ నిలబడ్డ వాళ్లందరి ముఖాలల్లో విశాదం...కోపం, ఆందోళన, మహిళా గుంపు అంబులెన్సుకు అడ్డంగా నిలుచున్నది. దాదాపు రెండు వందలమంది.
‘‘కదలనియ్యం’’
‘‘కదలనియ్యం’’
‘‘శవాలను కదలనియ్యం’’
పోలీసు వలయం తోసుకొచ్చింది.
సర్కిల్ మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాడు.
‘‘ప్రలారా! కార్మికులారా! మహిళలారా ఇప్పటికే ఆలిశ్య మయ్యింది. చలికాలం. రాత్రయితది’’
‘‘కానియ్యి ఎన్నిరోజులైన ఇక్కడే ఉంటం’’ రెహనా అరిచింది.
‘‘అప్పటికే కాల్పులు జరిగినయ్ - తీవ్రవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారు. లాఠీ చార్జ్ జరుగుతుంది - ప్రజలారా చట్టాన్ని ధిక్కరించడంనేరం’’ సర్కిల్ అరుస్తున్నాడు. హాస్పిటల్ మేన్గేటు దగ్గరి పోలీసు పికెటింగు గదిలో జనరల్ మేనేజర్ శాస్త్రి, జనరల్ పర్సనల్ ధర్మారెడ్డి, సబ్కలెక్టర్ విద్యాసార్రావు డి.యస్.పి రెడ్డి కమ్యూనిస్టు నాయకుడు భాస్కరరావు మంతనాలు చేశారు... పదినిమిషాలు గడిచింది. సబ్కలెక్టర్, డి.యస్.పి పర్సనల్ ధర్మారెడ్డి బయటకు వచ్చారు. ధర్మారెడ్డికి చెమటలు కారిపోతున్నాయి.
సావగొట్టి సెవులు మూసి తీవ్రవాదులంటరా!
‘‘ఏమయ్య నాయకులారా! మీకు నోళ్లు లేవా? సబ్ కలెక్టరు విద్యాసాగర్రావు వట్టిగ తమషా సూత్తండ్లా’’
మిగతామాటలు విన్పించలేదు. చాలా మంది తలో రకంగా అరుస్తున్నారు.
‘‘ప్రలారా! శాంతంగా ఉండండి’’ సబ్ కలెక్టర్ మైక్రోఫోన్లో హాస్పిటల్ ఆవరణలోని ప్రజలంతా ఘొల్లున లేచిండ్లు.
‘‘మేనేజుమెంటు మాట్లాడాలి...’’ అరుపులు కేకలు మందిలో నుండి మైక్రోఫోన్లో జి.యమ్ పర్సనల్ ధర్మారెడ్డి ముందుకు వచ్చిండు. వాళ్లు ముందుగా ఇలాంటి స్థితిని అంచనా కట్టినట్లే ఉన్నారు.
‘‘కార్మికులారా! ప్రజలారా! ఇలాంటి దురదృష్టఘటనకు సింగరేణి యాజమాన్యం బాధపడుతున్నది.’’
‘‘జెప్పన చెప్పవయ్యా, సంపుడేంది - బాధపడుడేంది?’’
‘‘సావగొట్టి - బాధపడుతేమున్నది కార్మికులకు సింగరేణియాజమాన్యం క్షమాపణ చెప్పాలె’’ సరిత అరిచింది...
సి.ఐడి పోలీసులు మహిళా నాయకులను వారి కదలికలను చూస్తున్నారు. బాధపడుతున్నాం - యాజమాన్యం దురదృష్టఘటనకు చింతిస్తున్నాం చనిపోయినవారి కుంటుంబలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వారి పిల్లలకు అలాగే గాయపడిన అర్హులైన వారికి ఇంటికొక ఉద్యోగం, గాయపడిన వారికి చట్ట ప్రకారంగా కాంపన్సేషన్ సింగరే ణియాజమాన్యం ఇస్తుంది. ట్రక్కు లోడింగు కంట్రాక్టు లేబర్ సిస్టమ్ గురించి ఇదివరకే రెండు దఫాలు అన్ని కార్మిక సంఘాలతో చర్చించడం జరిగింది. ఈ వారం రోజుల్లో తప్పకుండా ఎత్తివేసి - లేబరుకు ఉపాదికల్పిస్తాం - మధ్య దళారులుండరు.’’
‘‘ఇంకా రెండు డిమాండ్సు’’ పోలీసుల మీద కేసుపెట్టాలె - అరెస్టయిన వారిని బేషరుతుగా విడుదలచేయాలి.
సబ్ కలెక్టర్ విద్యాసాగర్ రావు మైక్రోఫోను తీసుకొని...
‘‘మిగతా రెండు విషయాలు సింగరేణి యాజమాన్యానికి సంబంధించినవికావు... చట్టప్రకారంగా జడ్జితో ఈ ఘటన మీద విచారణ ఉంటుంది. రెండోది... చట్టం తనపనితాను చేస్తుంది. తీవ్రవాదం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’
‘‘పోలీసుల మీదకేసు పెట్టాలి’’
‘‘దోషులను శిక్షించాలి’’
‘‘అరెస్టు చేసిన వాళ్లను బేషరుతుగా విడుదల చేయాలి’’
అప్పటికి అరయ్యింది. లైట్లు వెలిగినయ్ - అయిదు నిమిషాల తరువాత - పోలీసులు, సింగరేణి సెక్యురిటీ గార్డ్సు ముందుకొచ్చారు. రెహనా, సరితతో పాటు పదిమంది మహిళలనూ వేరుచేసి అరెస్టు చేసిండ్లు - మహిళల గుంపును దిగ్భందం చేసిండ్లు - భలవంతంగా దారికడ్డంగా ఉన్నవాళ్లను ఈడ్చేశారు.
ఏంజరుగుతుందో ఎవరికి తెలియకముందే - రెండు అంబులెన్సులు వెళ్లిపోయాయి. బందువులను బస్సుల్లో ఎక్కించి తీసుకవెళ్లారు...
జనం భయపడ్డారు. మళ్లీ ఏదో జరుగుతుందనుకున్నారు. మరో పది నిమిషాలల్లో హాస్పిటల్ ఆవరణ ఖాళీ అయ్యింది... సాయంకాలం ఆరుగంటల పదిహేనునిమిషాల ప్రాంతీయవార్తల్లో ఈ వివరాలన్ని ప్రభుత్వ భాషలో చెప్పారు. సింగరేణిలోని అన్ని డివిజన్ల కార్మికులు గుంపులు గుంపులుగా విన్నారు...వారి పద్దతిలో వారు అర్థంచేసుకున్నారు.
సత్యం, శంకర్ చీకట్లో సందుల గుండా సైకిల్ తొక్కుతున్నారు.
యాపలకాడ ఆగిండు. వీధిలైట్లు విచారంగా వెలుగుతున్నాయి. యాపలకాడ ఎంతో గడబెడగా ఉండేదీ - నిర్మాణుష్యంగా ఉంది -హోటల్లు, దుకాణాలు మూసి ఉన్నాయి.
‘‘కామ్రేడ్! మీరు మనం నిర్ణయించుకున్న విషయాల మీద మార్కెటు - బస్తీల మీద పోస్టర్లు వేయండి - ఎంతమంది రాడికల్ విద్యార్థులుంటే వాళ్లందరిని కూచుండ బెట్టి మాట్లాడండి - బహుశా రేపు ఎనిమిది తొమ్మిది గంటల మధ్య మన నిరవధిక సమ్మె సక్సెస్ అయితే యాపలకాడి చౌరస్తాలో మీటింగు పెడుదాం అరగంటలో మీటింగు ముగిద్దాం’’ సత్యం...
‘‘ఆ పనినేను చూస్త జాగ్రత్త కామ్రేడ్’’ శంకర్ వెళ్లిపోయాడు.
సత్యంకు మళ్లీ విచారం కమ్ముకున్నది. యాపచెట్టు కింద గద్దెమీద కైనీడకు కుర్చున్నాడు. గతిక్రమం లేకుండా పొద్దటి నుండి జరిగినదంతా పోటేత్తుతోంది.
‘‘జెబుల పైసలులేవు...సైకిల్ రేపుయివ్వవచ్చు. కాని పోస్టర్లు వేయాలి. కాగితాలు...తిరుగాలి. కూర్చుంటే మెదడు చిట్లి పోతుందేమో?’’ సత్యం సైకిలెక్కాడు.
అట్లా ఆలోచిస్తూ కొత్త గుడిసెలు చేరుకున్నాడు.
‘‘షరీప్, రెహనా ఇద్దరు అరెస్టయ్యారు... వాళ్ల గుడిసె పరిస్థితి ఏమిటి?’’ ఆలోచిస్తూ...
మొగిలి గుడిసెలకొచ్చిండు...
అక్కడ లక్ష్మి కూతరుకు, రాజేశ్వరి కొడుక్కు పాలు తాగిస్తున్నారు...
( (తరువాయి భాగం వచ్చే సంచికలో )
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
5
ఎన్టిపిసి రజితోత్సావాల సందర్భంగా అఫీసర్స్క్లబ్ ఎరియాలో నూతనంగా రిక్రియేషన్క్లబ్ నిర్మాణం జరుగుతుంది. దాని కంట్రాక్టలు మనోహర్రావు...
‘‘ప్రారంభోత్సవానికి అరోజు పొద్దున్నె వచ్చిన కంట్రాక్టర్ సత్తయ్యను పిలిచి’’ నిండా పదిహేను రోజులులేవు... ఇట్లా నత్తనడక పనులు సాగితే ఎప్పుడు పూర్తయ్యేను’’ ఎదన్నా అలస్యమైతే మాటపోతది’’ అన్నాడు.
‘‘లేదు సారు అయిపోతది’’ అన్నాడుసత్తయ్య వినయంగా...
‘‘పెంయింటర్ అది నారాయణ వచ్చిండా’’
‘‘నిన్న వచ్చిండు... ఇవ్వాళ అయితే ఇంకా రాలేదు వస్తడు కావచ్చు’’ అంటు బదులిచ్చిండు.
‘‘మంచి పనోడే కాని తాగుబోతు వెదవ ఎప్పుడు పనిలోకి వస్తడో ఎప్పుడు ఎగబెడ్తడో వానికే తెల్వదు’’ అన్నాడు కంట్రాక్టరు...
సత్తయ్య మౌనంగా తలాడిచిండు.
‘‘ఒక వేళ అదినారాయణ వస్తే దుకాణంకు తీస్కపోయి రంగులు ఇప్పిస్తా’’ నా ఉద్దెశం ఏమిటంటే గిలాబులు అయిన దిక్కు రంగులు కూడా వెయిస్తే పని తొందరగా అయిపోతది’’ అంటూ ఎమంటావు అన్నట్టుగా సత్తయ్యకేసి చూసిండు.
‘‘అట్లాచేయవచ్చుకాని నాలుగు రోజులు అగితే ఇంకా బలంగా ఉంటది’’
‘‘బలం సంగతి ఎవ్వడికి కావాలి... అనుకున్న టైంకు పని పూర్తయితే చాలు’’ అన్నాడు.
సత్తెయ్య తలాడించిండు.
‘‘పనోల్లను వేగరం పెట్టు లేకుంటే పనికాదు’’ అని సత్తయ్య హెచ్చరించి తనకు పని ఉందని కారలో వెల్లిపోయిండు.
ఒళ్ళు దాచుకోకుండా పని చేసే సత్తయ్య అంటే కంట్రాక్టరుకు నమ్మకం. అనమ్మకంకు తగట్టుగానే సత్తయ్య పనులు చేస్తడు. మొదట తట్టమోసే పని చేసేది. కాని క్రమంగా స్లాబులు పోయాటం, గోడలు కట్టడం, గిలాబ్లు చేయటం వంటి అన్ని పనుల్లో అరితేరిండు. కూలీలతో పాటు తను పనిచేస్తు అన్ని పనులు మీదేసుకొని చెస్తడు. కాబట్టి సత్తయ్య మాట అంటే కంట్రాక్టర్లకు కూడా గురి.
కంట్రాక్టర్ దగ్గర పని చేసే కూలీలకు ఒక వెసులు బాటు ఉంటుంది. కూలికోసం రోజు వెతుక్కొవలిసిన అవసరం ఉండదు. కంట్రాక్టరుకు పనులు లేనప్పుడు మాత్రం పని దొరకదా. కాని సం।।రము అరునెలలు ఎదో ఒక పని ఉండనే ఉంటది కాబట్టి, అ మాత్రం పనికోసమైనా కూలీలు తపత్రయ పడుతారు.
తూర్పున సూర్యుడు కాస్త ఎక్కివచ్చే సరకి కూలీలు పనిలోకి వచ్చఇండ్లు. ఎండ ముదిరక ముందు పని మొదలు పెడతారు. చల్లపూటనే పని కాస్త దూగుతుంది. నిప్పులు చెరిగే ఎండల పని ముందుకు సాగదు. అదికాకుండా ప్రతిరోజు నిర్ధిష్టంగా ఇంత పని చెయ్యాలనే లెక్క ఉంటది కాబట్టి పని తొందరగా ముగించుకోవాలని చూస్తరు. పని సరిగా కాకుంటే కంట్రాక్టరు కూలీలను ఎక్కడ తీసివేస్తారో అన్న భయం ఉంటది.
కండేలక్ష్మి అ రోజు పనికైతే వచ్చింది కాని ఆమె మనసంత ఇంకాడే ఉంది. ఇంటికాడ నల్గెండ్ల బిడ్డకు జ్వరం వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు బిడ్డకంటె పెద్దవాళ్ళు అయిన ఇద్దరు కొడుకులున్నారు పెద్దకొడుక్కు పదెండ్లు, వాని తరువాత వానికి పదెండ్లు. లక్ష్మి భర్త మల్లయ్య లారీడ్రయివర్గా పనిచేసేవాడు, చిన్నది బిడ్డ కడుపులో ఉన్నప్పుడే లారీ అక్సిడెంట్లు మల్లయ్య చనిపోయిండు. దాంతో లక్ష్మికి కష్టాలు మొదలైనవి. భర్తబ్రతికి ఉన్నంత కాలం ఇంటి పనులు చూసుకునేది, భర్త పోయినర తరువాత కూలి పనులు చేసుకుంటు బ్రతుకుతాంది.
లక్ష్మివాలకం చూసిన సత్తయ్య ‘‘ఎందక్కాఎట్లనో ఉన్నావు’’ అని అడిగిండు.
‘‘అన్నా ఇంటికాడ పొల్లకు జ్వరం వచ్చింది. ఒళ్ళు అగ్గయి మండుతంది’’ అంది బాధగా....
‘‘అటువం•ప్పుడు పనికెందుకు వచ్చినవు. ప్రసాద్ డాక్టరుకు చూయించక పోయినవా’’ అన్నాడు ఓదార్పుగా...
‘‘చూయించిన అయన ఎవో మందులు ఇచ్చిండు. రాత్రి జర జ్వరం తగ్గినట్టు తగ్గింది కాని పొద్దున మళ్ళి వచ్చింది’’ అందిలక్ష్మి గుడ్లలో నీళ్ళూరినయి.
చేసుకుంటే కాని ఎల్లని బ్రతుకులు ఎం బ్రతుకులు పాడు బ్రతుకులు అని తనలో ఆను అనుకొని’’ సత్తయ్య ‘‘కంట్రాక్టర్ అడిగితే నేను చెప్తా కాని సాయంత్రం కాస్త పొద్దుగాల ఇంటికి పోదవు’’ అన్నాడు ఊరడింపుగా..
పని మొదలయింది. ఇసుక మోసే వాళ్ళు ఇసుక మోస్తున్నారు. సిమెఉంటు కలిపేవారు కలుపుతున్నారు. కలిపిన సిమెంటును తట్టలో ఎత్తుకొని అడకూలీలు మెస్త్రీలు అందస్తూంటె వాళ్లు తాపితో గోడకు ఎగజిమ్ముతు గిలాచీ పనులు చేస్తున్నారు.
కీ ఇస్తే యాంత్రం తిరిగినట్టుగా కూలీలు పనులు చేస్తున్నారు. ఎక్కడ క్షణం అలస్యమైనా గిలాడు పనులు చేసే మెస్త్రీలు ‘‘మాల్ మాల్’’ అని అరుస్తున్నారు. ఎండ కాలం ఎండ దంచి కొడ్తాండి... మే మాసపు వడగాలులు మొదలైనవి. వడగాలికి రక్షణ కోసం తలకు గుడ్డలు చుట్టుకొని గుక్కెడు గుక్కెడు నీళ్ళు తాగుతు పనులు చేస్తున్నారు.
మెస్త్రీ పని చేసే రాములు ‘‘సత్తెన్న ఇవ్వాళ పైసలు ఇస్తడా సేట్’’
‘‘ఎందుకొచ్చింది అనుమానం... ఇయ్యాల అప్తాయేనాయే’’
‘‘ఎమో ఎదన్నా ఎటమటమైతదో ఎమోనని’’
‘‘మనసేట్ అట్లా ఎప్పుడన్నా చేసిండా... ఎదీ ఎమైనా టంచన్గా పైసలు ఇసత్డఉ నువ్వెమి రందీ పడకు’’ అన్నాడు సత్తయ్య.
ప్రతివారం శనివారం రోజున కంట్రాక్టర్ కలూఈలకు జీతాలు ఇస్తరు రోజు వారికూలీలకైతే ఏ రోఎజు కూలీ అరోజే ఇస్తరు. కంట్రాక్టర్ క్రింద పనిచేసే కూలీలకు మాత్రం వారం చివరన జీతం ఇస్తరు. అరోజు పండుగ వాతవారణం ఉంటది. ఎందు••ంటే మిగితా రెఓజుల్లో చేతిల పైస అడదదు.
మధ్యహ్నం వేల వరకు రెండు గదుల్లో గిలాబు పనులు అయిపోయినవి. సాయంత్రం వరకు మరో రెండు గదులు పూర్తి చేస్తే అరోజు పని పూర్తయినట్టులెక్క...
అఫీసర్ క్లబ్కు ఎదురుగా ఉన్న గుబురు చెట్ల క్రింద కూచొని కూలీలు సద్దులు ఇప్పుకొని బోజనాలు చేసిండ్లు. అట్లా మూతులు తడుచుకుంటూనే మళఙ్ళ పనిలో చేరిండ్లు.
‘‘లక్ష్మక్కా నవ్వుపో... నేను చుసుకుంటా’’ అన్నాడు. అది చూసి అక్ష్మితో పాటు పనిచేసే పోషమ్మ... ‘‘లక్ష్మికి ఎమైంది’’ అంది.
‘‘ఏం కాలేద.. ఇంటికాడ బిడ్డకు జ్వరం వచ్చింది. దాన్ని వదిలేసి వచ్చింది’’ అన్నాడు సత్తయ్య...
‘‘అయ్యో బిడ్డా పో...’’ అంది పోషమ్మ...
అందరి మంచి చెడ్డలు విచారించే సత్తయ్య అంటితోటి కూలీలకు అభిమానం ఆయన మాటకు ఎదురు చెప్పరు. ఏం చేసిన సత్తన్న మంచే చేస్తడన్న అభిప్రాయం.
అరోజు పని పూర్తియ్యే సరికి సాయంత్రంమైంది. పొద్దంత నిప్పులు కూరిసిన ఎండ సాయంత్రమైనా కూడా వేడిగాలితో ఊపరిసలుపనిస్తలేదు.
పనులు ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని కూలీలంతా రిక్రియెషన్ క్లబ్ అవరణలోని టెన్నిస్ కోర్టు షెడ్డు నీడన కూచొని కంట్రాక్టర్కోసం ఎదురు చూస్తుండి పోయిండ్లు.
కూలి డబ్బులు ఇవ్వటం కోసం వస్తాడనుకున్న కంట్రాక్టర్ మనోహర్ రావు అరోజు గంట అలస్యంగా వచ్చిండు. ‘‘ఆయన తో పాటు పెయింటర్ అదినారయణ ఉన్నాడు.
కారుదిగిన మనోహర్రావు అక్కడ కూచున్న కూలీలనుఉద్దేశించి’’ అరేయ్ మీరు కొంత మంది ఇటు రాండ్లి డిక్కిలో ఉన్న రంగు డబ్బాలను లోపల పెట్టాలి’’ అంటూ కేకేసిండు.
కొందరు కూలీలు కదిలిండ్లు...
అన్ని సర్దుబాటు చేసిండ్లు లెక్కలు సరిచుసుకొని మనోహర్రావు అందరికి కూలీడబ్బులు ఇచ్చేసరికి మరో గంట అలస్యమైంది.
సత్తయ్య ఇంటి దారి పడుతుంటే, ఆదినారయణ వెనుక నుండి ‘‘సత్తన్నా అగే నేను కూడా వస్తాన’’ అంటూ కేకేసిండు. ఆదినారయణ మంచి పెంయింటర్ కాకుంటే తాగుబోతు తాగితాగి మొఖం నల్లబడ్డది.
సత్తయ్య ఒక క్షణం నిలబడి పోయిండు.
ఆదినారయణ గబగబ నాల్గు అడుగులు వే•సైఇ సత్తయ్య దగ్గరికి వచ్చిండు.
‘‘పొద్దంతా తతిరుగుడే అయ్యింది’’ అంటూ మొదలు పెట్టిండు.
ఆయన చెప్పుతున్నది ఏమిటో సత్తయ్యకు అర్థంకాలేదు.
‘‘నువ్వు షాపుకాడికి పా నేను వస్తాన అని పొద్దున పదకొండు గంటలకు పోను చేసిండు. నేరు అన్ని పనులు మానుకొని చమన్ లాల్ షేఠ్ రంగుల దకాణం కాడ చూస్తుంటే ఇగ రాడు అగరాడు, తీరిపారి నాల్గింటికి వచ్చిండు’’ అందేంది సారు అంటే అఫీసుల పనిచూసుకొని పోదామని బయటు దేరిండట కాన ఇఅక్కడే అలస్యమైందని చెప్పుకొచ్చిండు. ఏం చేస్తం పెద్దోల్లు’’ అంటూ నిటూర్చిండు.
‘‘మరి రంగులు తీసుకున్నారా’’
మాగతీసుకున్నాం కంట్రాక్టరేమో చేరమాడుతడు, షేట్ ఏమో నీకు ఎక్కువ చెప్తనా అంటడు. ఇద్దరికి ఇద్దరే ఉచ్చల్లో మొట్టలు పట్టేరకం... బ్యారం కుదిరి సామన్లు తీసుకొని వచ్చే సరికి పొద్దు వంగనే వంగే’’
‘‘మరేమన్నా పడ్డలు పడ్డయా’’ అన్నాడు సత్తయ్య నవ్వుతూ...
‘‘సామన్యంగా బిల్డింగ్ సమాన్లు అమ్మె దుకాణం వాళ్ళు మెస్త్రీలను కట్టుకొని గిరాకి తీసుకవచ్చినందుకు అంతో ఇంతో కమిషన్ ముట్ట చెప్పుతారు. చివరికి ఈ కమీషన్ పద్దతి ఎంతవరకు పోయిందంటే కార్పోరేటు హాస్పటల్స్ వచ్చిన తరువాత పేషంట్లను తీసుకరావటానికి ఊర్లల్లో ఉండే అర్.యం.పి డాక్టర్ల వరకు ప్రాకిపోయింది. కేసులు తీసుకవస్తె కమీషన్లు ఇచ్చె పద్దతి మొదలైంది. తమ జెబులోకి పదిపైసలు వస్తాయంటే దేశాన్నె అమ్మె రాజకీయ నాయకులున్నా చోట అదో పెద్దవిషయం కాదు. అవినీతి అంతటా ప్రాకింది.
‘‘పడ్తలా పాడా ఎదో చిన్న చిన్నొళ్ళ దగ్గరైతే కమిషన్ వస్తదకాని పెద్దపెద్ద కంట్రాక్టర్ల దగ్గర ఆ అటలు సాగయి. సావుకార్లతోని వాళ్ళె మాట్లాడుకుంటారు’’ అన్నాడు ఆదినారయణ నిరసక్తంగా...
‘‘అయితే ఇవ్వాల ఏం గిట్టుబాటు కాలేదన్నామాట’’ అన్నాడు సత్తయ్య...
‘‘గిట్టుబాటా పాడా పొదద్దంత తిప్పుకుంటే ఇవ్వాల
‘‘ఐదువందలు ఇచ్చిండు కాని అదికూడా ఇచ్చే కూలీల వసులు చేసుకుంటడట...ఇంత పీసుగుద్దోడు కాబట్టె ఈయన దగ్గర పనిచెయ్యాలంటే మనసురాదు’’ అన్నాడు ఆదినారయణ...
ఇద్దరు ఇంటి దారి పట్టిండ్ల పికే రామయ్య కాలనీ మొఖ ద్వారం వద్ద పాలవాగు ఒడ్డున కాస్త ఎత్తయిన స్థలంలో గంగమ్మ కల్లు కొట్టు కాడికి వచ్చిండ్లు. కాలనీలో పోయ్యే వాళ్ళు ఎవరైనా గంగమమ్మ కల్లుకొట్టు ముందు నుండే పోవాలి. ఇంకో దారిక లేదు. అక్కడికి వచ్చెసరికి పొద్దంతా మొద్దు కష్టం చేసి అలిసి పోయి ఇంటికి వచ్చే కూలీలంతా మంత్రమేసినట్టుగా అప్రయత్నంగానే కాళ్ళు అటువైపు గుంజుక పోతాయి. అందులో ఆ రోజు జీతాలు వచ్చె శనివారం కావటంతో గంగమ్మ కల్లుకొట్టు జనంతో కిటకిటలాడుతాంది.
అటు చూడగానే ఆదినారయణ ప్రాణం గుంజింది. ‘సత్తన్న ఒక సీస తాగి పోదాంపావే’’ అన్నాడు.
సత్తయ్య మనసులో కూడా తాగలనిపించి గురిజాటన పడుతుండగానే, ఆదినారయణ అమాట అనేసరికి మారు మాట్లాడకుండా ఇద్దరు అటువైపు నడిచారు.
కల్లుకొట్టు చిన్న గుడిసె... ఒక వైపున చిన్నగా బొంగకర్రలతో పార్చీసన్ చేసిన చోట...కాస్త ఎత్తయిన గద్దె మీద గంగమ్మ చిన్న స్కూలు మీద కూచొని ఉంది. అమె వెనుకాల తెల్లగా నురుగులు కక్కుతు కల్లు కేసులు ఒక దాని మీద ఒకటి పెర్చినట్టుగా ఉన్నాయి.
గంగమ్మ నల్లటి చారి అకారం... నొసట ఎర్రటి బొట్టు... అసలేతాగుబోతులతో వ్వవహరం అయినా అమె అదేమి పట్టించుకోకుండా చాల సహజంగా తన వ్యాపారం కోనసాగిస్తుంది. నొరు పెద్దది గయ్యాలి గంప... అనోటికే అందరు బయపడుతారు.
‘‘పావులా తక్కువ ఉందా... ఇదేమన్నా కూరగాయల బేరమా చల్నడవ్’’ అంటూ ఓ తాగుబోతువాని మీద గయ్యిమంటుంది. ‘‘అదెందక్కా అట్లా అంటవు. నీ పావులాకే నేనేమన్నాదెంక పోతనా...రోజు వచ్చెదేనాయే...రేపు ఇస్తాలే’’ అంటూ ఇందకటి తాగుబోతు ప్రాదేయపడుతాండు...
‘మాగతాగినవ్పో’ అంటూ కసురుకుంటానే వాని చేతిలో చిల్లర డబ్బులు తీసుకొని ఒక్క సారి వటికేసి చూసి’’ రేపు మరిచిపోవుకదా’’ అంది.
‘‘అవ్వతోడు మరిచిపోను’’ అన్నాడు ఇందకటి తాగుబోతు...
ఒ కల్లు సీసా వాని చేతిలో పెట్టింది. తనచుట్టు ముగిన వారి నుండి డబ్బులు తీసుకొని కల్లు సీసాలు ఇస్తుంది.
‘‘అన్నా నేను తెస్తాను ఉండు’’ అంటూ ఆదినారాయణపోయి రెండు కల్లు సీసాలు పట్టుకొని వచ్చిండు.
కల్లు పాక లో వారికి కూచునే చోటు కన్పించలేదు. తాగుబోతులతో అంతగా కిక్కిరిసి పోయింది. తల మత్తు ఎక్కగా బాగా తాగిన వాడు ఒకడు ఎదో పాట పాడుతున్నాడు. అ పాట ముద్దగా అరణగొణ ద్వనిలో కలిసి పోయి సరిగా విన్పంచటంలేదు.
‘‘ఇక్కడ కూచునేటట్టులేదు... బయట ఎక్కడన్నా కూచుందాం పదా’’ అంటూ ఆదినారాయణ కల్లు కాంపౌండడ్ అవరణలోకి దారి తీసిండు కల్లు సీసాలు ప్రక్కన పెట్టుకున్న ఎక్కడికి అక్కడ గుంపులు గుంపులుగా కూచొని ముచట్లు పెట్టుకుంటుతాగు తున్నారు.
ఒక మూలన ములమే గంపలోగుడాలు శనిగలు పెట్టుకొని అమ్ముతుంది. అమె చుట్టు మూగిన తాగుబోతులు ఏలానో ఓలానో అంటూ తొందర పెడ్తున్నరు. కాని ముసల్ది మాత్రం ఏ మాత్రం తొందర లేకుండా నెమ్మదిగాపైసలు లెక్కబెట్టుకొని వారికి కావల్సింది అంతే నెమ్మదిగా ఇస్తుంది.
పొద్దంతా మొద్దు కష్టం చేస్తూ అణిగి మణిగినట్టుండే వాళ్ళు, ఒక సీసాకడుపులో పడే సరికి ఎక్కడ లేని హుసారు వస్తది. ఎవ్వన్ని లెక్కచెయ్యని తెగింపు వస్తది. చిన్న చిన్న విషయాలకే రోషాలకు పోతారు. తీరా చూస్తే అందులో ఏముండదు... కడుపులో ఇంత పడేసరికి ఎక్కడో పేరుక పోయిన దు:ఖం కోపం అవేశం ఎగజిమ్ముకొచ్చి తన్నులాటకు దిగుతారు. కాని అమత్తు దిగే సరికి పిల్లికూనయిపోతారు.
మొద్దు పని చేసే వారిలో తాగకుండా ఉండే వాళ్ళు చాలతక్కువ. చాలీచాలనీ జీతాలు హోళ్ళు హోనం చేసే మొద్దుకష్టంతో వొళ్లంతాతీపులు పెడుతాంటే ఆ పూట అయినా అన్ని మరిచి పోయి సు•ంగా నిదురపోవాలంటే వాళ్ళ అందుబాటులో ఉండే ఒకే ఒక్క దివ్యఔషదం తాగుడు. అట్లా మొదలైన తాగుడు క్రమంగా మనిషిని బానిసను చేసి అటు ఒళ్ళు, ఇల్లును గుళ్ళ చేస్తుంది. అంతిమంగాఅందపాతాళానికి తొక్కెసింది. తాగుడు బానిస అయిన వారి కుటుంబాల కష్టాలు అన్ని ఇన్ని కావు. తాగుడుకు బానిస అయిన వాళ్ళు చేసిన కష్టం తాగుడుకే పోగా ఇంట్లో ఎల్లక తిండికి కటకటలాడుతు అరిగోస పడే కుటుంబాలకు లెక్కలేదు. ప్రభుత్వం మాత్రం మత్తు పానీయాలను విచ్చలవిడిగా అమ్ముతు శవాలమీద పైసలు ఏరుకుంటుంది.
తాగుబోతులతో వ్యవహరం మామూలు విషయంకాదు. కాని అడదై ఉండే గంగమ్మ దాన్ని చాల అవలీలగా నిర్వహిస్తుంది. ఎక్కడో ఓంగోలు నుండి బ్రతకవచ్చింది. ఆమె భర్త ఎండుకొండలు మెషన్ పనిచేచేది. కాని తాగుబోతు ఉండే చేసిన పైసలు సరిగా ఇంట్లో ఇచ్చెవాడు కాదు.
మొదట గంగమ్మ ఎన్టిపిసి సెకండ్గెటు కాడ హోటల్ పెట్టి సంసారం ఎల్లదీసుకొచ్చేది. అసమయంలోనే కేరళకు చెందిన నాయర్ అనే మెకనిక్ ఉండేవాడు ఆయన కుటుంబం మాత్రం కేర•ళలో ఉండేది. ఇక్కడ మాత్రం అతను ఒక్కడే ఉండేవాడు. అలా ఒంటరిగా ఉండే నాయర్ గంగమ్మ హోటల్లో బొజనం చేసేవాడు.
ఎట్లా కుదిరిందో గంగమ్మకు నాయర్కు సంబందం కుదిరింది. నాయర్ డ్యూటీ ముగించుకున్న తరువాత ఎక్కువ సమయం గంగమ్మ హోటల్ కాడే ఉండేది. కొత్తవారు ఎవరన్నా చూస్తే గంగమ్మ భర్త నాయారే అనుకునేవారు. భర్త తాగుబోతు కావాటం, గంగమ్మ ఒక్కతే హోటల్సగబెట్టడం కష్టమై నాయర్ను చేరదీసింది. కొన్నాల్లు చాటు మాటుగా సాగిన వ్యవహరం, ఏ అడ్డు అదుపు లేకుండా పోయింది. సరిగ్గా అ సమయంలోనే ఏడు కొండలు ఓ రాత్రి హఠత్తుగా చనిపోయిండు.
పెయ్యంత నల్లగారంగు మారిపోయి సొంగకారిపోయి పడి ఉన్నఏడుకొండలు శవాన్ని చూసిన వాళ్ళు’’ వాడు ఉత్తగ చావలేదు. ఈ గొడ్డు ముండే వానికి ఎదో మందు పెట్టి చంపింది’’ అంటూ జనం గుసగుసలాడారు.
గంగమ్మ స్థానికంగా తిరిగే సోషమల్లు అనే చోటా నాయకున్ని పట్టుకొని నాల్గు పైసలు ఖర్చుపెట్టి కేసుకుకుండా చూసింది. ఇప్పుడు నాయర్ పర్మినెంటుగా గంగమ్మతోనే ఉంటున్నాడు.
గంగమ్మ హోటల్ మొదట బాగానే నడిచేది. కాని ఎన్టిపిసి మీదుగా పోయే చాతీయ రహదారి విస్తరణలో బాగంగా గంగమ్మ హోటల్ పోయింది. అటు తరువాత గంగమ్మ కల్లు దుకాణం పెట్టింద. ప్రతిరోజు సొసైటి కల్లు డిపో నుండి కల్లు సీసాలు వస్తాయి. పేరు కల్లు సీసాలు కాని అదంతా మందుకలిపి కుత్రిమంగా తయారు చేసిన కల్లు. ప్రభుత్వానికి ఎక్సయిజ్ డిపార్టుమెంటుకు ఈ వ్యవహరం తెలియకకాదు. ఎవని వాటా వానికి ముడుతంటే కల్తి కల్లు వ్యాపారం యాదెచ్చగా సాగిపోతుంది. ఎప్పుడైనా కల్తి••ల్లు తాగి చనిపోయినప్పుడు మాత్రం కొంత హడావిడి చేస్తరు. పత్రికలు వాటి గురించి వ్రాస్తయి. నిరసనతెలిపే వాళ్ళు తెలుపుతారు. చివరికి సొసైటీ పెద్దలు ఎవనిది వానికి ముట్టచెప్పి అంతా సర్దుబాటు చేస్తరు. మళ్ళి ఎప్పటి అటే అవుతుంది.
పొద్దుగుకే కొద్ది గంగమ్మ కల్లు కొట్టుకాడ కూలీల రద్దీ ఎక్కువైంది. ఎక్కడ జనం ఉన్నా లేకున్నా కల్లు దుకాణం కాడ ఇసుక పోస్తే రాలనంత మంది జనం.. అంతా కూలినాలి జనం తప్ప కాస్త తెల్ల బట్టలోడుఎవడు అచాయలకు కూడా రాడు.
శనగలు నములుకుంటా చేరో సీసా పూర్తి చేసిండ్లు.
‘‘సత్తన్నా ఇదేం పరిపొద్దే... అగు పోయి మళ్ళోటి తెస్తా అంటూ ఆదినారయణ లేచిండు.
‘‘నువ్వాగు తమ్మి నేను తెస్తా’’ అంటూ ఆదినారాయణను వారించి సత్తయ్య లేచి పోయిండు. కాసేపట్లో రెండు సీసాలు సంకలో పట్టుకొని మరో చేత ముసల్దాని దగ్గర గుడాలు పట్టుకొచ్చిండు.
అయింత సీసాలు పూర్తి చేసేసరికి సత్తయ్యకు మత్తు ఎక్కింది.
మందు కల్లు ఒక్కసీసా తాగితేనే మత్తేక్కుతుంది. ఇక రెండో సీసా తాగితే ఎంతటి వాడికైనా కాళ్ళు పట్టుతప్పుతయి. ఇక ఎవడైనా మూడో సీసా కల్లుతాగితే సోయి తప్పటం ఖాయం. అయినా అతిగా తాగే వాళ్ళు తాగుతున్నారు. అంత పొంతులేని ముచ్చట్లు ఎండిపోయిన చాతులు విరుచుకొని ఎక్కడి పేరుక పోయిన కోపాలు తపాలు చెలరేగుతాయి. అంతా గోళగోళగా ఉంది.
ఉండి ఉండి ఆదినారయణ ఎడ్వటం మొదలు పెట్టిండు సత్తయ్యకు ఎందుకెడుస్తున్నాడో అర్థంకాక ‘‘ఎమైందితమ్మి’’ అని అడిగిండు.
‘‘అన్నా నేను దానికి ఏం తక్కువ చేసిన’’ అన్నాడు ఏడుస్తూనే...
సత్తయ్యకు విషయం కాస్త అర్థమైంది. ఆదినారాయణ భార్య ఆదిలక్ష్మి అతన్ని వదిలేసి అవ్వగారింటికి పోయింది. పాపం అది మాత్రం ఏంచేస్తుంది. చేసిన పైసలు తాగుడుకే ఖర్చు చేస్తాంటే ఎన్నాల్లని బరిస్తది.
‘‘దాన్నే మన్నా కూలిపని చేయ్యమన్నానా! కాలు మీద కాలేసుకొని బ్రతకమన్నా... కాని అది ఏం చేసింది... నన్ను వదిలేసి అవ్వగారింటికి పోయింది. అక్కడే మున్నచి చిప్పలు కొట్లాడుతనయి. అన్నాడు ఊగుతు తల వ్రెలాడేసుకొని వెనక్కి ఓరిగిండు. అంగి గుండీలు ఊడి పోయి ఎండిపోయిన చాతి మీద చెత్తో చరుచుకుంటూ ‘‘లాబంలేదన్నా ఇకనేను బ్రతికేమి లాబంలేదు...నాకెవ్వరున్నారు నువవ్వుతప్ప’’ అంటూ మళ్ళీ ఎడ్వసాగిండు.
నారాయణకు ఇప్పుడు ఎదీ చెప్పిన దండుగే అనుకున్నడు సత్తయ్య ‘‘నారాయణ ఇప్పుడు అదంతా ఎందుకు పద పోదాం’’ అన్నాడు చెయ్యిపట్టుకొని లేపటానికి ప్రయాత్నించిండు.
విసురుగా చెయ్యిలాక్కొని నారాయణ ‘‘మత్తు బారిన కండ్లతో సత్తయ్యకేసి చూస్తూ ‘‘ఇంటికీ ఇల్లు లేదు గిల్లులేదు... ఇంటికాడ ఎవ్వరున్నరని పోవాలి’’ అన్నాడు.
‘‘అయితే ఇక్కడే పంటవా’’ అన్నాడు సత్తయ్య కాస్త కోపంగా..
‘‘పంటా ఇక్కడే పంటా’’ అంటు రెండు చెతులు చాచి కూచున్న చోటనే బొర్లపన్నాడు.
సత్తయ్య ఒపిక తెచ్చుకొని మళ్ళి లేపటానికి ప్రయత్నించిండు.
ఆదినారాయణ సొలుగుతూనే మెల్లగా లేచిండు.
‘‘పదపోదాం’’ అంటూ సత్తయ్య చెయ్యిపట్టుకొని ముందుకు నడపించిండు.
‘‘ఎక్కడికి’’ అంటూ నారాయణ కాళ్ళు నిర్రదన్నిండు.
‘‘ఇంటికి పోదాం’’ అన్నాడు సత్తయ్య...
‘‘ఇంటికానేను రాను నాకు సరిపోలే’’
‘‘ఇప్పటికే ఎక్కువైంది పద’’
నారాయణ లాగు జేబులో నుండి పైసలు బయిటికి తీసి ‘‘సత్తన్న పైసలు లేవు అనుకోకు మస్తుగున్నాయ్’’ అంటూ చెయ్యిచాచి పైసలు చూయించిండు.
‘‘ఉంటే ఉన్నయ్ తీయ్... అవి జేబులో పెట్టుకో’’ అంటూ సత్తయ్య నారాయణ చెయ్యిపట్టుకోని పైసలు జేబులో పెట్టిండు.
‘‘అన్నా నీకంటే నాకు ఎవలు ఎక్కువా... పద బరండి తాగుతాం’’ అన్నాడు ఊగుతు...
‘‘ఇప్పటికే నాకు ఎక్కువైంది... నీ పరిస్థితి కూడా సరిగా లేదు.. ఇంక బరండి తాగుతావా’’
‘‘నాకే మైందన్నా నేను మంచిగానే ఉన్నా నాకేం కాలే’’ నాకు సరిపోలే అంటూ రెండు కాళ్ళు నిర్రతన్ని నిలబడ్డడు. కుడి చెతిని గాల్లో అడిస్తూ...
‘‘అన్నా కాదనకు...ఒక పవ్వ చేరిసగం తాగుతాం’’ అన్నాడు ప్రాదేయపడుతు.
‘‘నాకు ఏ పవ్వవద్దు... నేను పోతా’ అంటూ సత్తయ్య విసుగ్గా ముందుకు కదిలిండు. నారాయణ గబగబ నల్గు అడుగులు వేసి రెండు చేతులు బార్ల చూపి ‘‘అన్నా నువ్వుపోతే నామీద ఓట్టు’’ అన్నాడు ఊగుతు...
సత్తయ్యకు ఏం చెయ్యలో అర్థంకాక నిలబడిపోయిండు.
‘‘అన్నా నువ్వు తాగుకుంటెమానాయే... జరనువ్వు అక్కడ దాక నాతోరా’’ అన్నాడు ఎటు కదలకుండా నిలుచొన్నడు.
‘‘సరేపా’’ అంటూ సత్తయ్య కదిలిండు.
రైల్వె కట్టకు వైపున మూడు నాలుగు లంబడొళ్ళ గుడిసెలున్నాయి. కల్లు బట్టి నుండి అడ్డదారిన కాలినడకన పోతే దగ్గరే.. అప్పటికే చీకటి కమ్ముకున్నది. లంబాడొళ్ళ గుడిసెల్లో గుడ్డి దీపం వెలుగుతున్నది. అక్కడ గుడంబా, చీప్లిక్కర్ అమ్ముతరు. అట్లా అమ్మటం నేరమే అయినప్పటికి ఎండ్లకు ఎండ్లుగా వాళ్ళ వ్యాపారం నడుస్తూనే ఉంది. ఎక్సైజ్ వాళ్ళు అప్పుడప్పుడు రైడింగ్ చేస్తారు. కేసులు పెడుతారు కాని రెండోరోజు నుండి ఏప్పటి అటే అవుతుంది.
ఎక్సైజ్ డిపార్టుమెంటు వాళ్ళులంచాలకు మరిగి చూసి చూడనట్టుగా పోతుంటారు.
అక్కడికి పోయే సరికి అక్కడ కూడా జనం ఉన్నారు.
ఒక్కటే నిట్టాడు ఉన్న చిన్న గుడిసెలో చిన్న దీపం ముందుకుచున్న లంబాడతను అరువై రూపాయాలు తీసుకొని నారాయణ చెతిలో పవ్వ ఒకటి చెతిలో పెట్టిండు.
దాని పని కానిచ్చి ఇంటికి తిరుగు మొఖం పట్టె సరికి సత్తయ్య కూడా కలు నిలువటంలేదు. బరాబరా ప్రపంచం అంత కూడా ఎటో తిరుగుతున్నట్టుగా మత్తుకమ్మింది.
తూగుతు వస్తున్న భర్త వాలకం చూసి సత్తయ్య భార్య రాధకు పరిస్థితి అర్థమై కోపాం వచ్చింది.
‘‘ఇంకేందీ పైసలు అగుపిస్తే చాలు పిచ్చిలేస్తది ఆ తాగుబోతోని దోస్తి పట్టినవుకదా... వాని పెండ్లాం లెక్కనేను కూడా మా అవ్వగారింటికి పోతా’’ అప్పుడు నీ ఇష్టరాజ్యంగా తాగుతువు’’ అంటూ గయ్యిమంది.
సత్తయ్య భార్య మాటలేమి పట్టించుకోకుండా వచ్చి ఇంటి ముందున్న మంచంలో వొరిగిండు.
(తరువాతి భాగం వచ్చే సంచికలో )
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
34
టెంటు సామాన్లు తీసుకెళ్లి - షామియానాతాళ్లు బిగించేసరికి తెల్లారే సమయం మూడయ్యింది. గంగాధర్, షరీప్, శంకరయ్య, సత్యం టెంటులోనే నిద్రపోయారు.
ఏడుగంటల వరకే లోడింగు కార్మికులంతా టెంటుకు చేరుకున్నారు. ఎప్పటిలాగే షామియానా నిలబడి ఉన్నది. కార్మికులు, విస్తుపోయారు.
మొగిలి, వెంకులు వాళ్లనలుగురిని యాపలకాడికి తీసుకపోయి - టిపిన్, చేయించారు. అందరు టెంటు చేరే సరికి ఉదయం ఎనిమిదియ్యింది.
నిన్న అక్కడేమి జరుగనట్లు - లోడింగు కార్మికుల నిరవధిక సమ్మె అందులోని భాగంగా ఎప్పటిలాగే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.... వాల్పోస్టర్లు చూసి దాదాపు రెండు వందల మంది ఏఐటియుసి కార్యకర్తలు టెంటు దగ్గరికి చేరుకున్నారు.
తొమ్మిది గంటలకు భాస్కర్రావు కారుమీద వచ్చికారు కొంచెం దూరంలో పెట్టి నలుగురు ఆపక్క ఈ పక్క నడువగా శిబిరం చేరుకున్నాడు.
‘‘కాలి కూలి కాముని పెంటయినంక దొరచ్చిండురా!’’ నారాయణ...
‘‘చెవులు ‘గోసిన కుక్కలోలె ఏందిర్ర? ఒకల మాట ఒకలకు కలువది... బండ కింద సేతులు వెట్టి బండ మీద ఎక్కి కూసున్నట్టున్నది ఏనివరుస’’ దుర్గయ్య...
ఎందుకైనా మంచిదని గంగాధర్, షరీప్, సత్యం, శంకరయ్య శంకర్ - వెంకులుతో సహా వేపలకాడికి పోయిండ్లు.
భాస్కర్రావు ముఖంలో కోపం... దుమదుమలాడుతూ - కాసేపు నిలబడ్డాడు... ఎవరో బెంచీ తెచ్చివేశారు. పదినిమిషాలు కూర్చుండి - కోపం తగ్గించుకున్నాడు...డెలిగేట్సుతో పాటు చుట్టు పక్కల యాభైగజాలు తిరిగి చూశాడు. తెగిపోయిన చెప్పులు, నెత్తురంటిన బొగ్గుపెళ్లలు - చిరిగిపోయిన బట్టలు - కర్రలు,రాడ్లు - దొరికాయి. అన్ని తీయించి శిబిరం కాడ పెట్టించాడు.
‘‘అయ్యా కామ్రేడ్! నిన్నలారీడ్రైవర్లు రాకపోతే మమ్ములందరిని సంపి - బొగ్గుకుప్పలకు పెట్రోలు పోసి మమ్ముల కాలవెట్టేటోల్లు. ఇరువై ఏండ్ల సంది గీ బొగ్గుల బొగ్గైనం దొరా!’’ కాటం చెంద్రయ్య నడిమందిలోనిలబడి భాస్కర్రావు’’ కామ్రేడ్స్! మీ పోరాట స్పూర్తికి లాల్సలాం - వాళ్లు పిచ్చికుక్కల తీర్గున్నరు. వాళ్లు భూస్వాముల గుండాలు - వాళ్లకు కారణకారక సంబంధాలు, కార్మికులు, యాజమాన్యం చట్టాలు ఏమి తెలియదు.’’
‘‘అయ్యా మా పెయ్యంత అగ్గి తార్గ మండుతంది. గంగరాయి లొట్టపీసు గవ్వన్ని చెప్పకుండ్లి - వాళ్లు మనలను కొడితే మన యూనియన్ఏం చేసింది?’’ పోచం...
‘‘నిన్నంతా పోలీసు స్టేషన్ల చుట్టుతిరిగిన - మనప్రతి నిధులు ము్య•మంత్రి దగ్గరికి పోయిండ్లు... గాయపడిన వాళ్లకు మన కామ్రేడ్స్ దగ్గరుండి ట్రీటుమెంటు చేయిస్తున్నారు. హైదరాబాదు నుండి డాక్టర్లను పిలిచాం’’
‘‘వాళ్లు సావగొట్టి సెవులు మూసినంక - మీరు కట్లు కడుతండ్లు - గంతేనా?’’ చంద్రయ్య...
‘‘ఆకలి దొర! మమ్ములాదుకునేటోడు లేడు. గ రాడికలోల్లు ఇంటికిన్ని బియ్యం పంచిండ్లు’’
‘‘మన కార్యకర్తలు మనిషి కోపది రూపాయులు ఇస్తారు’’
‘‘బస్ గది సంగతి - మరి మేనేజుమెంటు జంగవిల్లి తీర్గ నాసుబెట్టి కూసున్నది - మరి అడుగలేదా?’’
‘‘చర్చలు నడుస్తున్నయి, మీరు మీరు చూసుకొండ్లి యూనియన్ల కొట్లాటలకు మమ్ముల లాగకండి అన్నది మేనేజుమెంటు’’
‘‘ఇన్నారుల్లా మన పెద్దయ్య ముచ్చెట్లు - ఎవలేం చెయ్యరు? మనం పోరాటం చేయాలి’’
‘‘కామ్రేడ్స్ ఆవేశ పడకండి - వాళ్లు రెచ్చిపోయినప్పుడు మనం రెచ్చిపోతే - ఇదేసందని - యాజమాన్యం ప్రభుత్వం మనలందరిని మూసేత్తది.. ఈసమస్య కొలిక్కి వచ్చింది తీర నియ్యండి - మనం సింగరేణి అంతటా నిరవధిక సమ్మెకు పూనుకుందాం. శాంతించండి తప్పక విజయం సాధిస్తాం’’
‘‘మనం సచ్చినంక దినవారాలు సేత్తడట’’ తలో మాట - గోలగోలగా ఉంది. పదిగంటలయ్యిది. జనవరి మాఘీఎండలో కార్మికులు - ఆ బొగ్గుకుప్పలమధ్య శిబిరం దగ్గర ఏం చేయాలో తోచక - రాత్రి వాళ్లమీద జరిగిన దాడికి మండిపోతున్నారు.
భాస్కర్ రావు అర్థాంతరంగా వెళ్లి పోయాడు... మరో పది నిమిషాలకు తలకు కట్టుకట్టుకొని ఇబ్రహీం చెయ్యికి పట్టేసుకొని - కొమురయ్య శిబిరం దగ్గరికి వచ్చారు. కార్మికులు వాళ్లను తడిమి తడిమి చూశారు. ఇంతలోనే గంగాధర్, శంకరయ్య, షరీప్, సత్యం, శంకర్, వెంకులు శిబిరం దగ్గరికి వచ్చారు. అక్కడున్న యూనియన్ వాళ్లంతా చుట్టు మూగారు.
‘‘ఊకే సిల్లర మాటలు, ఏతుల మాటలద్దు - మాశరీరం మండుతంది - ఊరేగింపు తీద్దాం - మేం ఇంక మీ గుండాతనం భరించమని చెప్పుదాం’’ నారాయణ ముందుకు నడిచిండు. డెలిగెట్లంత అరిచిండ్లు- గుండాగిరి నశించాలె’’ గూండాలు డౌన్డౌన్’’ ఇబ్రహీం ఏదో మాట్లాడుదామను కున్నాడు. ఇబ్రహీంను, కొమురయ్యను సైకిల్లమీద ఎక్కించుకున్నారు. కార్మికులు పదిగంటలకు ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి బయలుదేరింది. శిబిరం దగ్గర పదిమంది కార్మికులు ఉండిపోయారు. ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి మేన్రోడ్డెక్కే సరికి పదిన్నర అయ్యింది. ఎవరికి వారే అరుస్తున్నారు...ఎగురుతున్నారు. గంగాధర్, షరీప్, శంకరయ్య వాళ్ల ముందు నడుస్తున్నారు. ఊరేగింపును ఒక పద్దతిలో నడిపించడానికి సత్యం, శంకర్ ఎక్కడినుండో కంకకర్రలు తెచ్చారు... ఊరేగింపు నాపి ముగ్గురు ముగ్గురి చొప్పున సర్ది ఊరేగింపును సర్దేసరికి ఉదయం పదకొండు అయ్యింది. ఊరేగింపు దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది. ఊరేగింపు పెద్ద మోరిమీదికచ్చింది. షరీప్ మోరీ మీదికెక్కి...
‘‘కార్మికులారా! నేను నినాదాలు చెప్పుతాను మీరు మళ్ల చెప్పండ్లి’’
‘‘పోరాడుతాం -పోరాడుతాం’’
‘‘ఆఖరుదాకా పోరాడుతాం’’
‘‘నిన్న జరిగిన దాడి మీద’’
‘‘విచారణ జరిపించాలి’’
‘‘ఐయన్టుయైసి గుండాలను’’
‘‘అరెస్టు చేయాలి’’
‘‘గుండాల నాయకుడు కృష్నారావును’’
‘‘అరెస్టు చేయాలి’’
‘‘యాజమాన్యం మొండి వైఖరి’’
‘‘విడనాడాలి’’
‘‘కంట్రాక్టర్ లేబర్ను’’
‘‘బదిలీ ఫిల్లర్లు చేయాలి’’
‘‘లారీ లోడింగు కంట్రాక్టు పద్దతి’’
‘‘ఎత్తివేయాలి’’
శంకర్ ఒక్కొక్క నినాదాన్ని కార్మికులతో మరోమారు అన్పించాడు.
‘‘దొరల జులుం’’
‘‘నశించాలి’’ కొత్త నినాదాలు పుట్టుకొచ్చాయి.
‘‘ఏఐటియుసి’’
‘‘జిందాబాద్’’
‘‘రాడికల్స్’’
‘‘జిందాబాద్’’
మార్గమధ్యలో చేరేవాళ్లు వచ్చి చేరుతున్నారు... వీధులల్లో నడుస్తున్నప్పుడు అప్పటి కప్పుడు...
‘‘దుకాండ్లన్ని మూసేయాలి’’
బందు బందు - అని కార్మికులు దుకాణాలను కొన్ని మూయించారు. క్వార్టర్లలో నుండి - గుడిసెలనుండి ఆడవాళ్లు వీధుల్లోకి వచ్చి చూస్తున్నారు. కొంత మంది అరిచే వాళ్లకు మంచి నీళ్లు తెచ్చిస్తున్నారు. ఊరేగింపుతో పాటు సోడా బండ్లు వీధుల్లో పెట్టుకున్నరు. కార్మికులు నినాదాలిచ్చే వాళ్లు తాగుతున్నారు. తుపాకులు పేలినట్టు సోడాలచప్పుడు ఊరేగింపు మార్కెటుకు చేరుకునే సరికి పదకొండున్నర అయ్యింది - భయస్తులైన కొందరు షట్టర్లు మూసి ముందునిలబడ్డారు. చాలా వరకు దుకాండ్లు బందయినాయి...
అక్కడే మీటింగు పెడుదామని గంగాధర్ ప్రయత్నం చేశాడు. అక్కడ నుండి మళ్లీ కార్మికులను శిభిరం దగ్గరికి తీసుకపోవాలనుకున్నారు. యూనియన్ డెలిగేట్లు ఏఐటియుసి ఆఫీసు చెట్లకింద కాసేపు కూర్చున్నారు...ఇబ్రహీం కొమురయ్య, వాళ్ల మధ్యలో నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఆతరువాత మెల్లెగా ఆఫీసు చెట్లకింది నుండి డెలిగేట్స్ కొంత మంది మార్కెట్ సెంటర్లో నిలబడి బిగ్గరగా నినాదాలవ్వడం షురు చేసిండ్లు...
‘‘గూండాల దౌర్జన్యం’’
‘‘నశించాలి - నశించాలి’’
‘‘పని పడుదాం -పనిపడుదాం’’
‘‘గుండాల పని పడుదాం’’
చెట్లకింద మిగతా వాళ్లు అక్కడికి చేరుకున్నారు. మందిలో జోష్ పెరిగింది. మార్కెటంతా గజగజలాడేటట్లు నినాదాలు చేశారు...
‘‘గుండాలు సినిమాటాకీసులో ఉన్నరంట’’ మందిలో నుండి ఎవరో అరిచారు.
గుంపు కదిలింది - సినిమా టాకీస్ కేసి నడిచింది. గుంపు ముందు ఇబ్రహీం, కొమురయ్యలను సైకిల్ల మీద తీసుకపోతున్నారు. సినిమా హాలు గేటు మూసిఉంది. కొంత మంది యువకులు గేటు ఎక్కివెనకకు దిగితాళ్లు విరగొట్టిండ్లు గేటును కార్మికులు తన్నిండ్లు. ఎన్నేండ్ల దు:ఖంమో, అవమానమే - కోపమో - సినిమా టాకీసే అడ్డాగా దొరలు, వారి గుండాలు ఎంతో మందిని చూస్తుండగా మీద పడికొట్టారు. సినిమాకు వచ్చిన ఆడవాళ్లను ఎత్తుక పోయి చెరిచారు. మంది కోపంబద్దలయ్యింది. అయిదు వందల మంది సినిమాటాకీసు లోపల చొచ్చారు. కుర్చీలు విరగ్గొట్టారు. పరదా చింపేశారు. ఏది దొరికితే అది - గోడలను తన్నారు గుద్దారు. కాండ్రకిచ్చి ఊంచారు. ఉచ్చలు పోశారు. రాళ్లు విసిరారు. సినిమా టాకీస్ మేనేజర్ శ్రీనివాస్ అంతకు ముందే పరారై కృష్ణారావుకు పోన్ చేశాడు. కృష్ణారావు పోలీసులకు ఫోను చేసాడు.
గుంపు అదుపు తప్పింది...
గంగాధర్, షరీప్, ఇబ్రహీం అరుస్తూనే ఉన్నారు. గుంపులో ఎవరు ఎవరిమాటలు వినడంలేదు - కోపంతో యువకులు అడ్డదారుల గుండా - పాలవాగు దిక్కుసాగింది - పాలవాగు వాగొడ్డుకు నరేందర్, లాంటి గుండాల ఇండ్లుంటాయి. వందమంది యువకుల గుంపు ముందుపోయింది. నర్సింగం ఇండ్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఇంట్లో వాళ్లు మొత్తుకుంటున్నారు. వాళ్లను బయటకు తీసుకొచ్చి కొంతమంది పట్టుకున్నారు. ఆరెండు ఇండ్లకు అగ్గి పెట్టారు. రెండు ఇండ్లు కాలుతున్నాయి. మంటలు ఆకాశంలోకి లేచాయి. నల్లటిపొగ వ్యాపించింది. రొద, ఏడుపులు - నినాదాలు - అంతా గదరగోళంగా ఉంది. వెనుక గంగాధర్ గుంపువచ్చింది. అయిదువందల మంది మూడు వందల మందే అయ్యిండ్లు. ఎవరు ఎటు ఉరుకుతున్నారో తెలియని పరిస్థితి.
మూడు వందల మంది మేన్రోడ్డెక్కారు.
‘‘ఇక చాలు కామ్రేడ్స్’’ గంగాధర్ అరుస్తూనే ఉన్నాడు. షరీప్, శంకరయ్య, శంకర్, మొగిలి, సత్యం చెదిరిపోయిన వాళ్లందరిని ఏకం చేయడానికి అరుస్తున్నారు... చెతులెత్తి ఏవో మాటలు బిగ్గరగా అరుస్తున్నారు. యువకుల గుంపు మేన్రోడ్డుమీదుగా యాపలకాడికి చేరింది... అక్కడ మేన్రోడ్డుమీది కృష్ణారావు బ్రాండి షాపు కన్పించింది... కౌంటర్ మీద కూర్చున్నతన్ని బయటికిగ్గిండ్లు వందల సీసాలు పగులుతున్నాయి. కొందరు సీసాలెత్తి గటగట బ్రాండి, విస్కీ, బీరు తాగుతున్నారు...గుంపుకు మత్తెక్కింది.
గూండాలకు వంతు సీసాయిచ్చిన సంగతి ఎవడో పెద్దగా లొడలొడగా చెప్పుతున్నాడు. నక్క పోశాలు కండ్లు పెద్దవి చేసి తనను గూండాలు కొట్టిన సంగతి చెప్పాడు. పది నిమిషాలల్లో బ్రాండి షాపు ఖాళీ అయ్యింది. చాలా మంది ఊగుతున్నారు. అరుస్తున్నారు. ఊరుపేరు లేకుండా తిడుతున్నారు. గుంపు ఇంకా ముందుకు ఉరికింది - అక్కడ బ్రాండి, కల్లు, సారా, పెద్దడిపో - డిపోమేనేజర్ సత్యనారాయణను పిడిగ్గుద్దులు గుద్దారు. అది దాదాపు ఎకరం జాగాలో విశాలంగా ఉన్నది. అక్కడ కర్రడమ్ములలో సారా వందలాది లీటర్లున్నది. వాటిని పగులుగొట్టారు. సారా వాసన నిండిపోయింది. కార్టున్లకు కార్టూన్లకు బయట ఎత్తేసి పగుల గొడుతున్నారు. తాగుతున్నారు. సీసాలు పళ్ల, పళ్ల పగులుతున్నాయి. ఇంతలోనే డియపిరెడ్డి నాయకత్వంలో పోలీసులు యాబై మంది దాకా వచ్చారు...
లాఠీ చార్జి మొదలయ్యింది. గుంపురెచ్చి పోయింది...
‘‘రెడ్డి’’ పైర్...పైర్’’ అరిచాడు.
తుపాకులు మొరిగినయ్ తుపాకి గుండ్లు తాకి కొంత మంది మొత్తుకుంటూనే నేలమీద పడిపోయారు. అరుపులు - యువకులు కొందరు చెట్ల మీదికెక్కారు - మరికొందరు సందుల గుండా పరుగెత్తారు. పది నిమిషాలల్లో కాల్పులు ఆగిపోయాయి... ఆ ఏరియా అంత రక్తాలతో ఆర్తనాదాలతో - గబ్బువాసనతో, గందకం వాసనాతో నిండిపోయింది. గంగాధర్ కౌంటర్ వెనుకాల నిలబడి ఇంకా అరుస్తున్నాడు.. ‘‘నేలమీద పడుకోండ్లి కామ్రేడ్స్’’ ఎవరి పరిస్థితి ఏమిటో ఎవరికి అర్థంకాని అయోమయ పరిస్థితి - గంగాధర్ చుట్టు కొందరు చేరుతున్నారు. దొరికిన వారిని దాదాపు పదిహేను మందిని జీబుల్లో ఎక్కించుకున్నారు. గంగాధర్, షరీప్, శంకరయ్య వాళ్లలో ఉన్నారు...
మరో అరగంటలో సింగరేణి అంబులెన్సులొచ్చాయి. చనిపోయిన వారిని, గాయపడ్డవారిని హాస్పిటల్కు తరళించారు.
మధ్యాహ్నం రెండు గంటలవరకు నెత్తురు మరకలతో ఆ ప్రాంతం మూగవోయింది. మొగిలి వేపచెట్టెక్కి ఈ తంతగమంతా కండ్లాతోని చూసిండు. అతనికి ఏమయ్యిందో తెలియలేదు.కాల్పుల దిగ్భభ్రమ నుండి తేరుకొని మొగిలి వేపచెట్టు మీది నుండి కిందికి దిగాడు. అది కలోనిజమో - అతనికి అర్థంకాలేదు. ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. పెద్ద పెట్టున ఒర్లిండు ఏడ్చిండు. పిచ్చివాని లాగా అంతటా వెతికిండు... సారాడ్రమ్ముల మధ్య భయంతో డిపోమేనేజర్ సత్యనారాయణ మొగిలి వెనకకు చూడకుండా ఎవరో తరుముతున్నట్టుగా - తన వెంట పోలీసులు పడుతున్నట్టుగా మురికి తుమ్మ చెట్ల కింది నుండి ‘‘మొగిలీ’’పిలుపు... సత్యం...మొగిలి సత్యంను బిగ్గరగా అలుముకున్నాడు.
‘‘మనోళ్ల సంగతేంది? కామ్రేడ్ చానా మందిని చంపిండ్లు... మొగిలి వనుకుతూ...
‘‘తెలువదు...హోష్కురా...తెలుసుకుందాం... కాల్పులు షురూ కాంగనే నేను చాలా మంది పడిపోయిన తరువాత ఇటు ఉరికచ్చిన’’ సత్యం... ఇద్దరు మురికి తుమ్మ చెట్ల కాలిబాటల నుండి నడుస్తున్నారు.
‘‘ఎటుపోదాం కామ్రేడ్’’ మొగిలి...
పదినిమిషాలు విప్పచెట్టుకింద కూర్చున్నారు. సత్యం చెల్లాచెదరైన తన స్థితిని - కూడ దీసుకున్నాడు... అంతకలలో జరిగినట్లుగా ఉంది - మొదట్లో తుపాకి కాల్పుల మోతలు, తుపాకి గుండ్లు తాకి ఒర్రుతున్న కార్మికులు - చెట్ల మీదికి, చెల్లా చెదురుగా ఉరికిన మనుషులు - బ్రాండి, విస్కీ ఘాటువాసన - సార కర్రమొద్దులు పగిలి పారిన సారా నీచు వాసన...‘‘కామ్రేడ్స్ నేలమీద పండుకోండి’’ గంగాధర్ అరుస్తున్నాడు. కామ్రేడ్సంతా ఒక దగ్గరికి వచ్చి షట్టర్ లోని కౌంటర్లో రక్షణ తీసుకున్నారు... తను అక్కడికి వెళ్లాలనుకున్నాడు. తుపాకులు గురిపెట్టి పోలీసులు వాళ్లను కొట్టుకుంటూ జీబుల దగ్గరికి తీసుకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తారా? తను కూడా పరుగెత్తాలా? జీబులో ఎక్కించారు. కాల్పులాగి పోయినయ్ - తనుడిపో గోడ దూకిండు - తన వెంట పోలీసులు పడ్డారు. మురికి తుమ్మ చెట్ల మధ్య నుండి పరుగు. పోలీసులు తనవెంట రాలేదు.
‘‘కామ్రేడ్ మొగిలీ మనవాళ్లను జీబులెక్కించిండ్లు. ఎంత మంది చనిపోయిండ్లో తెలువది...’’ సత్యం.
‘‘ఆడేంలేదు. అంతఖాళీ’’
‘‘పోలీసులు ఇంకా ఆ ఏరియాను తమాధీనంలోనే ఉంచుకున్నారేమో?’’ సత్యం.
‘‘లేదు అయ్యో చనిపోయినోళ్లను, గాయపడ్లోళ్లను అంబులెన్సులచ్చి తీసుకుపోయిండ్లు. అందరు పోయినంకనే సుట్టుదిగి వచ్చిన అక్కడ గజగజ వనుక్కుంట డిపో మేనేజరున్నడు’’
‘‘వాళ్లే చంపిండ్లు గనుక - వాళ్లు పోస్టుమార్టం చేయిస్తరు’’
రాజేశ్వరిని మేనేజరు కొడుకు హత్య చేసి ఉరిబెట్టినప్పుడు గిట్లనే కాల్పులు జరిగినయ్...ఆ సమయంలో బెల్లంపల్లిల నలుగురు చనిపోయిండ్లు. అదేపని చేసిండ్లు’’ సత్యం.
‘‘మనం దవాఖానకు పోదామా?’’
‘‘అదే మంచిది - ఉన్నొక్క ఆధారం గదే’’ సత్యం...
‘‘మొదలు మనం కొద్దిగా తేరుకోవాలి. జరిగింది - నా అనుమానం - భాస్కర్రావు వాళ్లు’’ సత్యం...
‘‘ఔ! కామ్రేడ్ -మార్కెట్ కాడ, మనం మళ్లా వెనక్కు వద్దామంటే - వాళ్ల డెలిగేట్సు - వాళ్ల ఆఫీసుకాడికి పోయి చెట్లకింద కూసున్నారు. వాళ్ల ఆఫీసుకాడ’’ మొగిలీ...
‘‘అసలు సినిమాటాకీసులో దొర గుండాలున్న సంగతి ఎవరు తెచ్చిండ్లు?’’
‘‘మందిల తెలువలే’’
‘‘నిన్న దెబ్బలు తిన్న ఇబ్రహీం - మళ్ల ఊరేగింపుకెందుకచ్చిండు. ఎన్నడు రాందీ శిబిరం కాడికి భాస్కర్రావు ఎందుకచ్చిండు. ఆ దినం రెండు వందల మందిదాకా వాళ్ల డెలిగేట్సు శిబిరం కాడికి వచ్చిండ్లు - రాత్రి మనం టెంటుకడుతుంటే తొంగిన్నా చూడలే’’
‘‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు - మనలనువాడుకొని యూనియన్ కృష్ణారావును దెబ్బకొట్టిండ్లన్న’’ మొగిలి.
‘‘గంత మందిలో పోలీసోల్లకు మనోళ్లే ఎట్ల తెలిసిండ్లు?’’
‘‘కామ్రేడ్ మనకు పిచ్చిలేత్తది. ఇంకా తుపాకి మోత, మెరుపులు మెదట్ల సత్యం. ఇక్కడికి మాయిల్లు దగ్గరే ఆడికి పోయినంక మాట’’ మొగిలి దారితీసిండు.
దారిపొడుగుతా కట్టతెగిన ప్రవాహంలా సత్యంమాట్లాడుతూనే ఉన్నాడు. సాయంకాలం మూడయ్యింది. మొగిలి గుడిసె చేరుకున్నరు. గుడిసెకుతాళమేసున్నది. మొగిలి ఇంటి వెనకకు వెళ్లి తాళం చెయ్యి పెట్టే చోటవెతికిండు తాళం చెయ్యికింద చిన్న చిట్టీ పెట్టిఉన్నది. తాళం తీసి మంచం వాల్సి దాని మీద కూర్చున్నారు. మొగిలి ఇంటి వెనుకకు వెళ్లి నీళ్లు మీద గుమ్మరిచ్చుకున్నాడు. కొంత రొద తగ్గింది. సత్యం ఇంటి వెనుకకు వెళ్లి వాంతి చేసుకున్నాడు. బట్టల మీద చిల్లింది. నాలుగు చెండుల నీళ్లు కుమ్మరించుకొని - వచ్చిండు. మొగిలి ఇచ్చిన లుంగీ కట్టుకున్నడు. బట్టలు ఉతికి ఎండపొడకు ఆరేసుకున్నడు. మొగిలి చాయ్పెట్టుకచ్చిండు.
‘‘శంకర్ వచ్చిండట - శంకర్ రెహనక్కను, రాయేశ్వరిని -ఈ వాడకట్టు నలుగురైదుగురిని దవాఖానకు తీసుకపోయిండట - అన్న్ని సంగతులు శంకర్ చెప్పిండు - మీరేమిగాభరా పడద్దు - దవాఖానకు రండి లోపట మంచం షెద్దరు కింద నాగయ్య బావ ఉత్తరమున్నది - మనూరి ఏల్పుల సమ్మయ్యతోని పంపిండు’’
ఇద్దరు చాయ్తాగిండ్లు.
‘‘ఇప్పుడు నిమ్మలంగా ఉన్నది. మెదడు పని చేస్తంది’’
‘‘నిమ్మరసం చాయ్ బాగున్నది’’ సత్యం...
‘‘గంగాన్న వాళ్లింటికాన్నుంచి నాలుగేండ్ల జామసెట్టు, నిమ్మసెట్టు తెచ్చి పెట్టిండు - కాయలు గాత్తన్నయి’’ మొగిలి.
‘‘చెలోపోదాందావాఖానకాడికి’’ సత్యం...
మొగిలి గిన్నెలు వెతికాడు. ఒక్కరికి సరిపోయే అన్నం కూర ఉన్నది... సత్యం, కూర అన్నం గంజు ల్నేవేసికలిపి - మొగిలికి సగం పెట్టిండు. తను సగం తిన్నడు.
‘‘మా నాగన్న ఉత్తరం రాసిండంట’’ మొగిలి ఉత్తరం తెచ్చిండు.
‘‘నువ్వే చదువు కామ్రేడ్’’ నాకు జెప్పన సదువరాదు. మొగిలి.
‘‘మీ అన్న ఏం రాసిండో - అట్ల సదువద్దు’’ సత్యం...
‘‘కాదు కామ్రేడ్ - గంగన్న మా అన్న ఎనిమిది నెళ్లు రావాలల్ల ఉన్నరు మూడు నెళ్లు జైల్లున్నరు. మంచి దోస్తులు. గంగన్నను - నాగన్ననే ఎరుక జేసిండు’’
‘‘గంగన్న ఇంటికాడ నేను కల్సిన. మాకు పాటలు నేర్పిండు. మాకు ఒక దినం తెలంగాణ సాయుధపోరాటం గురించి పాఠం జెప్పిండు. సత్యం ఉత్తరం చేతిలోకి తీసుకొని..
‘‘కామ్రేడ్ మొగిలికి అభినందనలు - మీ విషయాలన్నీ ఎప్పటి కప్పుడు తెలుస్తున్నయి. నువ్వు కామ్రేడ్ శంకర్, లక్ష్మి, రాజేశ్వరి పుస్తకాలు చదువుతున్నందుకు చాలా సంతోషం... ముఖ్య విషయం. మీరు క్రాంతి పత్రిక చూసే ఉంటారు.రైతాంగ పోరాటాలు మన ప్రాంతంలో ముమ్మరంగా జరుగుతున్నయి. మన ఊళ్లో పదిరోజుల కింద - లొల్లి జరిగింది. లక్ష్మి పెండ్లికి అప్పు కిందమూడెకరాల పెరడి బాపనోల్ల కిట్టయ్యదొర గుంజుకున్న సంగతి ఎరికేగదా! లింగుమామ మీ నాయనీ వడ్డీ అసలు కట్టినా కాయిదాలు ఇయ్యలేదు. రైతుకూలి సంఘం ఆ భూమి లింగుమామకు ఇప్పించి నాగండ్లు కట్టిచ్చింది. అట్లాగే నీ నౌఖరి కోసం చిన్నాయినె రయిను బెట్టిన భూమి దున్నిచ్చిండ్లు - అట్లా యాభై ఎకరాలు మనూళ్లే దున్నిండ్లు - పోలీసులచ్చిండ్లు - అందరిని కుప్పేసి కొట్టిండ్లు - నాలుగొద్దులకింద కిట్టయ్య ఇంటిమీద దాడి జరిగింది. అప్పుకాయిదాలు కుప్పేసి కాలబెట్టిండ్లు. వాన్ని వాకిట్ల కట్టేసిండ్లు... పోలీసులచ్చిండ్లు - పడుసోల్లు గుడిమెట్టు అడివిల బడ్డరు. మా నాయినను, మీ నాయినను లింగు మామతో సహా పది మందిని అరెస్టు చేసి కేసుబెట్టిండ్లు - నన్నుకూడా కేసుల బెట్టిండ్లు. మేం దొరికేది లేదు. మన వకీలు బేల్కోసం తిరుగుతండు. రేపోమాపో బేలు వస్తుంది. సాగర్రావు దొర ఊళ్లె నుంచి దెంకపోయిండు. మీరంతా ధైర్యంగా, క్షేమంగా ఉండాలని కొరుకుంటూ పాట పంపుతున్న శంకరన్నయితే మంచిగ పాడ్తడు. కొంచెం సల్లవడ్డంక వచ్చి సూసిపోండ్లి.
‘‘లాల్సలామ్’’
సత్యం పాట మొత్త ఉత్తరం లాగనే సదివిండు.
‘‘మన కన్న ఘోరంగ ఉన్నదిగదా అయినా ముందే ఉన్నరు. పాట జెబర్దస్తీగ ఉన్నది. మంచిపాట - జిమిడికి మీద ఊగిపోతది’’ సత్యం...
మొగిలి నెత్తిగోక్కున్నడు...పాట కాయిదంలాగుజేబుల పెట్టుకున్నడు.
‘‘సరే కామ్రేడ్! నీబట్టలు ఆరలేదు. అట్లనే ఉండనియ్యి ఇగో నా అంగీ లాగువేసుకో’’ మొగిలి బట్టలు తెచ్చియిచ్చాడు. ఇద్దరు డబుల్ సవారి సైకిల్ మీద మేన్రోడ్డు మిదికొచ్చారు. తన సైకిల్ సత్యం కిచ్చి - పాషా దుకాణం దగ్గరకుపోయిండు. పాషా దుకాణం మూసుకొని తనండ్లతనే ఎదో గొనుక్కుంటున్నడు.
‘‘అన్నా సైకిల్ గావన్నా! పాణంబడ్డది. అందరు మంచి గున్నరుగదా! మంది నోటికొచ్చినట్టు చెప్పుకుంటండ్లు’’
పాషా ‘‘బాగుంటేనేకదా! నీకాడికచ్చింది - సైకిల్ గావాలె’’
‘‘నేను రావన్నా - దిమాక్ పని చేస్తలేదు. ఎవన్నన్న ఏసియ్యాల న్నంత గాయిగత్తరగున్నది.’’ పాషా... మొగిలికి నిజంగా అట్లాగే ఉన్నది....ఇద్దరు బయలుదేరిండ్లు...
‘‘తొవ్వల్నే గన్క శిబిరం దగ్గరినుంచి పోదాం’’ సత్యం...
‘‘మరిచేపోయిన -వాళ్లెట్లున్నరో - శిబిరంల పదిమంది ఉండిరి’’ సైకిల్లు నడుస్తున్నాయి...
35
శిబిరం దగ్గరికి పోయేసరికి పదిమంది లేచి వచ్చిండ్లు. వాళ్లు భయంతో గడ్డకట్టుకపోయున్నారు. ఏమైతదో తెలియదు. వాళ్లకు సంగతులన్ని ఎవరో ఒకరు వచ్చిచెప్పుతున్నరు గని ఏమి చేయాలో? ఎవరు చెప్పడంలేదు... శిబిరం ఎత్తేయడమా? ఉంచడమా? పోలీసులు ఇక్కడికి వస్తరా?
సత్యం, మొగిలి అందరిని ఆలింగనం చేసుకున్నారు. చనిపోయిన వాళ్ల పేర్లు వనికే చేతులతో చిన్న చిట్టీని ఇచ్చారు. లోడింగు కార్మికులు, కాటం చంద్రయ్య, శీలంశెట్టి నారాయణ, పానుగంటి పోచం, దుర్గయ్య, చంద్రయ్య - వాళ్లయిదుగురు లోడింగుకార్మికులు - ఇంకొకరు చనిపోయినట్టుగా అందరు అంటున్నారు. అతని గురించి తెలియడంలేదు.
సత్యం మొగిలిని నాలుగుమాటలు మాట్లాడు మన్నాడు.
మొగిలికి ఉద్వేగంతో మాటలు రాలేదు. తనులోడింగు లేబరుగా చేసినరోజులు గుర్తొచ్చినయ్..‘‘మన కోసం అమరలైన మన అన్నలు తమ్ములకోసం రెండు నిమిషాలు తలుచుకుందాం’’ అన్నాడు. అందరు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించిపేరు పేరున మొగిలి పేర్లు చెప్పుతుంటే అందరు జోహర్లు చెప్పారు.
‘‘మనం మంది సొమ్ములు కుప్పేసుకోను గిందులకు దిగలేదు. చావకుండా బతకడానికి ఇగో గిక్కడ మనం పనిచేపే కాడ నిలబడ్డం. ఈ బొగ్గు మనది - ఈ భూమి మనిది... మనం కట్టంజేసి మందిని బతికిత్తం - మనలను బతకనియిమంటన్నం - మనం గెలువాలె - గెలుత్తం. అవద్దం నాశినమైపోతది. నిజం గెలుస్తది. మనం....‘‘మొగిలి మాట ముందుకు సాగలేదు’’
‘‘మనం మనసమస్య తీరేదాకా - పోరాటం ఆపేదిలేదు. అన్ని డివిజన్లలో నిరవధిక సమ్మె నడుస్తంది... అమరుల సాక్షిగా పోరాడుదాం - ఇంతకన్నా మనలను ఇంకా వాళ్లేం చేస్తరు? శిబిరం కోనసాగిత్తం. మిగతా మన కార్మికులంతా దవాఖానకాడున్నట్టు తెలిసింది. ఆడికే పోతన్నం.. మన కార్మికులందరిని ఇక్కడికే తోలుతం. మళ్లీ మేమువస్తం’’ సత్యం చినపోయినవారికి, గాయపడ్డవాళ్లకు పాయమాలుకట్టయ్యాలని చెప్పుండ్లి’’ అన్నారు కార్మికులు సాగదోలుతూ...
( తరువాయి భాగం వచ్చే సంచికలో )
కూలి బతుకులు – నాల్గవ భాగం
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
4
పొద్దున్నె చీకటితోని శ్రీను బయటుదేరి కంట్ట్రార్ దివాకర్రావు ఇంటికి పోయిండు. అప్పటికే అక్కడికి చేరుకున్న భగవాన్ మేస్త్రీ ఎదురొచ్చి ‘‘ఇవ్వాళ పనులు బాగున్నాయి. నువ్వుతొందరగాపోవాలి’’ అంటూ క్షణమాగి జెబులోని చిన్న నోట్ బుక్తీసి లావు పాటి కండ్లద్దలనుండి ఒక సారి పరిక్షగా చూసి.
‘‘ఎలుకలపల్లి గేటు కాడ రోడ్డు పనులు జరుగుతానయి అక్కడ నాల్గు ట్రాక్టర్ల కంకరపోయ్యాలి. పొద్దున పదిగంటలకల్లా తిలక్ నగర్లో కన్స్టక్షన్ జరుగుతున్న బిల్డింగ్ల కాడికి బండ తీసుకపోవాలి. మధ్యహ్నం వరకల్లా పని పూర్తియితే అతరువాత ఏం చెయ్యలన్నది నేను వచ్చి చెప్పుతా అంటూ పని పురమాయించిండు.
రోడ్డుకు కంట్రాక్టర్ బంగ్లాకు మధ్యన వేప చెట్టునీడలో నిలిపి ఉన్న ట్రాక్టర్ను తీసుకోవటానికి ముందుకు కదిలిన శ్రీనుకు హరత్గా ట్రాక్టర్ జాకిలు సరిగా పనులు చేస్తలేవన్న సంగతిగుర్తుకు వచ్చింది.
‘‘మెస్త్రీ జాకీలు సరిగా పనిచేస్తలేవు’’ అన్నాడు.
‘‘మెకానిక్ జానిమియాగానికి చూపించక పోయినవా’’
‘‘చూయించిన బాగా అరిగిపోయినవట కొత్తది మార్చాలంట’’
‘‘సరే ఈ పూటకు ఎట్లాగో నడవనియ్... సాయంత్రం దాని సంగతి చూద్దాం’’ అన్నాడు మెస్త్రీ...
భగవాన్ మెస్త్రీ కంట్ట్రారు దివాకర్రావుకు నమ్మకమైన వ్యక్తి రామగుండాం కాడ కంట్రాక్టరుకున్న రెండు క్రషర్లు ఆయనే చూస్తడు. అర్డర్ తీసుకోవడం, పనులు చేయించటం, సప్లయిచేసి వాటికి డబ్బులు వసలు చేయటం, వర్కర్స్ మంచి చెడు అన్ని ఆయనే నడిపిస్తడు.
భగవాన్ మెస్త్రీ కూడా అందరిలాగే ఓరిస్సా నుండి బ్రతక వచ్చిండు. కాస్త రాతపూత తెలిసినోడు ఏ పని చేసిన ఓళ్ళుదాచుకోకుండా పనిచేస్తడు. అటు వంటి పని మంతుడు దొరకంటంతో కంట్రాక్టరుకు ఏ చీకు చింత లేకుండా పోయింది.
శ్రీను ట్రాక్టర్ తీసుకొని బయలు దేరిండు.
ట్రాక్టర్ మెయిన్ రోడ్డు దిగి మట్టి బాటలో కాస్త దూరం పోయే సరికి ‘‘శీనన్నా శీనన్నా’’ అన్న పిలుపు విన్పించి అటువైపు చూసిండు.
దావన్ కూతురు హీరా, పదమూడు పద్నాల్గెండ్లు ఉంటాయి. కాని అంత వయస్సు ఉన్నట్టు అన్పించదు. బక్కగా ఉంటుంది. నెత్తంతా దుమ్ముకొట్టుక పోయి,మసి బారిన బట్టలో ఉంది.
‘ఏంటి’ అన్నట్టుగా చూసిండు శీను.
‘‘అన్నా జర మా ఇంటిదాక తీసుకపోవా’’ అంది.
అతను పోయే తోవలోనే క్రషర్ నగర్ ఉంది. హిరా వాళ్ళు ఉండేది అక్కడే దాంతో శ్రీను ట్రాక్టరు అపి ‘‘అయితేరా’’ అన్నాడు.
‘‘ఒక్క క్షణం’’ అంటూ అంత వరదాక రోడ్డు దిగువన మొదుగు చెట్టు గుబురుకాడ ఉన్న బొగ్గు బస్తాను బలవంతంగా ఎత్తుకొని వచ్చి ట్రాక్టర్లోవేసి ఎక్కింది.
‘‘ఇంత పొద్దున్నే ఎటు పోయినవు బొగ్గుకా’’ అని అడిగిండు.
‘‘అవునన్నా రెండు రోజులనుండి తిరుగుతాంటే ఇవ్వాళ దొరికింది’’ అంది.
ఇబ్బందేకాని దివాకర్రావు బండ్లను ఎవరు అపరు.
దావన్ ఆయన భార్య ఇద్దరు క్వారీలో పనిచేస్తరు వాలికి ముగ్గురు పిల్లలు కూతురు హీరా పెద్దది. అతరువాత ఇద్దరు మగపిల్లలు భార్య భర్తలు ఇద్దరు పనిలోకి పోతే ‘హీరా’ ఇంటికాడ పనులు చేస్తది. తమ్ముల్లను చూసుకుంటది.
వర్షకాలం కన్స్ట్రక్షన్ పనులు పెద్దగా సాగవు. వర్షలు పోయి ఎండకాలం మొదలవటంతోనే కూలీలకు క్రషర్నగర్ గుట్టబోరు మీద ఉంది. అక్కడ ఒక చెట్టు చేమలేదు. ఓరియా కూలీలు వంట చేసుకోవటానికి బొగ్గు పొయ్యిలను వాడుతారు. గతంలో అయితే ఏది ఇరువై రూపాయలకే సిమెంటు బస్తానిండా బొగ్గు దొరికేది. సింగరేణికంపినికి చెందిన డంపింగ్ యార్డులనుండి, సీలు కుప్పల నుండి పనిపాటలేని పిల్లలు బొగ్గు ఏరుకొని సైకిల్ల మీద తెచ్చి అమ్మెవాళ్ళు. వారికి అదోరకమైన ఉపాధి. కాని ఎప్పుడైతే సింగరేణి కంపిని బొగ్గు దొంగతనాలు అరికట్టడానికి డంపింగ్ యార్డుల చుట్టు పెన్సింగ్ వేసి, అక్కడ మూడు పూటల వాచ్మన్ను పెట్టడంతో డంపింగ్ యార్డుల నుండి బొగ్గుతేవటం కష్టమై పోయింది. దాంతో సేలు కుప్పల కాడ బొగ్గు ఎరుకొని వచ్చేవారు. అక్కడేమో విపరీతమైన పోటి బొగ్గు బాయిలో బొగ్గుతో పాటు సేలుబండలు కూడా వస్తవి. అటువంటి సేలు బండలను ఏరి ఒక చోట కుప్పగా పోయే కంపిని తప్పిదారి పోయి అబండాల మధ్య అక్కడోకటి ఇక్కడోకటిగా మిగిలిపోయిన బొగ్గును ఏరుకొనేందుకు అడమగా పిల్లలు అనకుండా సంచులు పట్టుకొని పోయేవాళ్ళు. పొద్దంతా ఏరినా ఒక బస్తనిలడటం కష్టమయ్యేది. దాంతో మునపటిలా బొగ్గు దొరకటం కష్టమైపోయి బస్తాబొగ్గు ధర యూబై రూపాయలకు పెరిగింది. అంత ధర పెట్టి బొగ్గు కొనే స్థోమతలేక వంట చెఱుకు కోసం అనివార్యంగానైనా బొగ్గు దొంగతనంగా తెచ్చుకోవలిసి వచ్చింది.
ఎన్టిపిసిలో అకలోడింగ్ కోసం అగిన వ్యాగన్ల నుండి దొంగతనంగా బొగ్గు తెచ్చుకునేవాళ్ళు. దీన్ని అరికట్టడం కోసం ఎన్టిపిసి అక్కడ ముసలి వాచ్మెన్ పెట్టింది. వాడేమో కర్రపట్టుకొని ఇయ్యర, మయ్యర కొట్టెవాడు. దాంతో బొగ్గు కోసం వచ్చే పిల్లలకు వాడంటే ఎక్కడ లేని భయం. అయిన బొగ్గు తెచ్చుకోవటం అనివార్యమై వానికంట్లె పడకుండా బొగ్గు దొంగతనం చెయ్యాల్సి వచ్చెది. క్రషర్ నగర్లో నివసించే కూలీలు పనులు లేనప్పుడు తిండికి కటకట లాడుతారు. ఇతరత పనులు ఎమన్నా దొరికితే చేస్తరు లేకుంటే లేదు. అటువంటి సమయంలో ఇండ్లు సగబెట్టు కుంటూనో, సామాన్లు బాగు చేసుకుంటూనో కాలం గడుపుతారు. లేదంటే ఏ చెట్టుక్రిందనో కూచొని పొగాకు నములుతు ప్యాకాట అడుకుంటారు.
హీరాను చూసే సరికి శీనుకు తులసిగుమారి గురించి అడగాలనిపించింది.
‘‘హీరా’’ తులసి కన్పిస్తలేదేమి’’ అన్నాడు యధాలాపంగా అడుగుతున్నట్టు...
‘‘ఉంది... తులసక్క ఇప్పుడు ఇటుకబట్టిల పనికి పోతాంది కదా’’ అంది.
‘‘ఇటుక బట్టిల పనికా’’
‘‘అవును’’
‘‘అదే ఎందుకు’’
‘‘కంట్ట్రారుతోని లొల్లి అయ్యింది కదా ఇక అపని బందుపెట్టింది’’ అంది.
అ మాటలు విని శ్రీనుకు మనసులో బాధనిపించింది.
తులసి గుమారిని మొదటి సారి కలిసింది. సుబాస్ నగర్లోని బాల కార్మికుల పాఠశాలలో కూలీల పిల్లలకు చదువు చెప్పాకే లక్ష్యంతో అంతార్జాతీయ కార్మిక సంఘం నిధులతో ఎర్పాటు చేసింది. దానికి హిందు మజ్దూర్ సంఘంకు చెందిన నరెందర్ దానికి బాధ్యుడు. ఆయనేమో ఎన్టిపిసిలో ఉద్యోగి, పైగా యూనియన్ నాయకుడు వాళ్ళ నాయకత్వాన్ని పట్టుకొని పాఠశాలను సాంక్షన్ చెయించిండు. అందుకోసం దాదాపు ఇరువై లక్షల దాక నిధులు వచ్చాయి,
దాన్ని ఎర్పాటు చేసిన తనికి పిల్లలలకు సేవ చేయాటం కంటే వచ్చే నిధులమీదే అశ ఉండి పోయింది. అర్భాటంగా పాఠశాలను ప్రారంభించిండు. దాన్ని నిజాయితీగా నిర్వహించలేదు. పాఠశాల ఎర్పాటు చేసిన కొత్తలో పిల్లలను చేర్పించటం కోసం, కూలీలు ఎక్కువగా ఉండే వికే రామయ్య కాలని క్రషర్నగర్, కాకతీయనగర్, సుభాస్ నగర్ ఇంటింటికి తిరిగి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుతాం. మధ్యహ్నం తిండి కూడా పెడుతాం, పుస్తకాలు బట్టలు అన్ని ఫ్రీ అని నచ్చచెప్పి దాదాపు యాబై అరువై మంది పిల్లలను జమ చేసిండ్లు.
ఎట్లాగు చదువు లేక తమ బ్రతుకులు అగమైనవి పిల్లలు చదువు కుంటేనైనా బాగు పడ్తరని నాగయ్య తన చిన్న కొడుకు శ్రీను ఆ పాఠశాలకు పంపించిండు.
పరదేశిరాం కూడా తనకూతురు తులసి కుమారిని స్కూలుకు పంపించిండు. ఇద్దరు ఒక్కటే క్లాసు చేరిండ్లు అట్లా వారికి పరిచయం ఎర్పడింది.
సుభాస్ నగర్ ఓర్రె ఓడ్డున ఉన్న విశాలమైన మైదానంలో ఒక్క గుడిసే వేసి అందులో స్కూలు నడిపించేది. చదువు కొని ఏం పనిలేకుండా తిరుగుతున్న ఇద్దరు యువకుల్ని తాత్కలిక టీచర్గా పెట్టిండ్లు.
కొన్ని రోజులు స్కూలు బాగానే నడిచింది. క్రమంగా నిధులు రాక క్రమంగా స్కూలు మూతపడింది. ఒకప్పుడు స్కూలు ఉన్న చోట ఇప్పుడు మొండి గోడలు మిగిలాయి.
తులసి కుమారిది మాతృబాష తెలుగు కాకున్నా తెలుగు చాల స్పష్టంగా మాట్లాడేది. చదువులో అందరి కంటే ముందు ఉండేది. నల్లగా బక్కగా, గుండ్రటి మొఖంతో మెరిసే కండ్లతో హుషారుగా ఉండేది. శ్రీను ఎంత కష్టపడ్డా అమెకు మించి పోలేక పోయేవాడు. ఇద్దరి మధ్య చదువులో పోటి ఉండేది.
అశ్రామ పాఠశాలలో ఐదవ తరగతి చదివిన తరవాత శ్రీను రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలకు పోయిండు. కాలి నడకన రోజు ఐదారు కిలో మీటర్లు పోయి రావల్సి వచ్చేది. అంత దూరం పంపలేక పరదేశిరాం తులసిని బడి మాన్పించిండు. ‘‘అరే మంచిగా చదివే పిల్లను బడి మాన్పిస్తే ఎట్లా’’ అని సార్లు ఎంత చెప్పిన పరదేశి వినలేదు.
పరదేశీరాంది రాజనంద్ గారి నుండి బ్రతక వచ్చిండు. ఆయన భార్య ఈశ్వరి బాయ్... వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు శత్రుఘన్ క్వారిలో బాల కార్మికుడుగా బండరేపని చేసేవాడు. కాస్త రెక్క ముదిరే సరికి బండలు కొట్టె పనికి కుదిరిండు. తల్లి దండ్రులు ఇద్దరు పనిలోకి పోతే తులసి ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసేది. శత్రుఘన్కు పెండ్లి అయిన తరువాత వేరు కాపురం పెట్టిండు.
అప్పుడప్పుడు తులసి కన్పించి మాట్లాడేది. ఆమె మాట్లాడుతుంటే ఎందుకోగాని శ్రీను మంచిగ అన్పించేది. ఎంత సేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలనిపించేది. ఆమెలో చదువు పట్ల అసక్తి తగ్గలేదు. శ్రీను ఎప్పుడు కలిసిన చదువు గురించి అడిగేది. అసక్తిగా పుస్తకాలను చూసేది.
తులసి పాటలు బాగా పాడేది. ఓరియావాళ్ళు తీరిక సమయాల్లో భారత, రామాయణగాధలు పాడుకోవటం వారి సంప్రదాయం అ పాటలేవి చదివి నెర్చుకున్నవి కావు. తరతరాలుగా పాడే వాడు. చాల ఎండ్లు ఆయన బండ పని చేసిండు కాని ఇప్పుడుచాత కాకుండా అయిపోయిండు. కండ్లు కూడా సరిగా కన్పించటం లేదు. ఆయన కొడుకు కిషన్ వద్ద ఉంటున్నాడు. ఎదైనా పండుగ పబ్బం అప్పుడు సామూహికంగా కోలాటం అడుతూ మహిర్తాతతోని పాటలు పాడించుకునే వాళ్ళు. ప్రతిరోజు దుర్బర మైన జీవితం గడిపినా, పండుగలప్పుడు మాత్రం ఉన్నంతలో గనంగాజరుపుకునే వాళ్ళు. అట పాట వాళ్ళజీవితంలో బాగం హోలి పండుగ అడమగ అనకుండా చాల సంబంరంగా జరుపుకుంటారు.
తులసి మాహర్ తాత దగ్గర చాల పాటలు నేర్చుకున్నది. మహర్తాత చాల పెద్ద మనిషి కావటంలో ఇప్పుడు ఎదైనా పండుగలప్పుడు తులసి తోని పాటలు పాడించుకుంటున్నారు. సన్నటి శ్రావ్యమైన గొంతుతో పాడే తులసి పాటంటే అందరు ఇష్టపడేవాళ్ళు.
ఒక సారి హోలి పండుగా రోజున ఎదో పనిబడి శ్రీను మార్కెటుకు పోయినప్పుడు నిండారగా రంగు చల్లుకొన్న గుంపు ఒకటి క్షణాల్లో శ్రీనును చుట్టుముట్టెసి రంగుల్లో ముంచేసింది. తీరా చూస్తే వారితో కిలకిల నవ్వుతు తులసి కన్పించింది.
ఒక విదంగా సాపిగా జరిగిపోతున్న వారి కుటుంబంలో పరదేశిరాంకు క్యారీలో దెబ్బతాకటంతో పరిస్థితులన్ని తలక్రిందులైనవి. అరోజున క్వారీలో ఎత్తయిన బండలను కూల్చటానికి నడుముకు తాడు కట్టుకొని వ్రెలాడుతు బ్లాస్టింగ్ కోసం బండకు రంద్రాలు చేస్తుంటే తాడు తెగి పరదేశి అంతఎత్తునుండి క్రిందపడ్డాడు. నడుముకు బలమైన దెబ్బతాకింది. కంట్రాక్టర్ నష్టపరిహరం ఏమి ఇవ్వలేదు. అడిగేవారు లేరు. అప్పటి నుంచి బండ పనులు చెయ్యలేని పరిస్థితి వచ్చింది. ఆయన పనులు ఆయన చేసుకో గలడు కాని బరువు పనులేమి చెయ్యలేడు.
దేవునింట్ల మన్నుబోయా రాత ఇట్లా రాసేనని దు:ఖాన్ని దిగమింగుకొని ఈశ్వరిబాయి రాళ్ళు కొట్టె పనికి పోతుంది కాని ఇద్దరు చేస్తనే అంతంత మాత్రంగా వెళ్ళె సంసారంలో ఒక్క దానిసంపాధన ఎటు చాల కుండా పోయే సరికి తులసి ఊడా కొన్ని రోజులు బండ కొట్టె పనులకు పోయింది.
వయస్సు తెచ్చిన అందంతో చూడచక్కగా ఉన్నా తులసి పై రంగయ్య అనుచరుడు మంగలి లక్ష్మన్ గాని కన్నుపడింది. వాడుత్తలంగ, అడది కనిపిస్తే చాలు చిత్తకార్తెకుక్కలా మారిపోతాడు. జీవనోపాధిలేని వాళ్ళును, భర్తలు చనిపోయి ఓంటరిగా బ్రతికే వారిని, తిరుగుబోతు స్వబావం కల్గిన వారిని నిస్సయులను నయనా భయానా లొంగదీసుకోనేవాడు.
అటువంటి వాడు ఒక రోజు తులసిని చూసి ‘‘క్యారిలో అ బండ పని ఏంచేస్తవు అపీసులో పనుంది చేస్తావా రోజు కూలి దొరుకుద్ది’’ అంటూ మెల్లగా మాట కలిపిండు.
తులసికి చిన్నప్పటి నుండి అలవాటు లేనేఇ బండపని చేయటం కష్టంగా ఉంద. ఎదో తప్పని సరై అపనిలోకి పోతుంది. ఎప్పుడైతే లక్ష్మన్ అపీసు పని ఉంది చేస్తావా అనే సరికి నీడపాట్టున ఉండి పనిచేయ్యవచ్చు అని అశపడింది. అట్లా పనిలోకి కుదిరింది. నాల్గురోజులు బాగానే గడిచింది. కాని మెల్లగా లక్ష్మన్ దుర్భుద్ది బయట పడసాగింది.
ఒక రోజు ఎవరు లేందీ చూసి తులసి మీద చెయ్యి వేసిండు. ఊహించని పరిణామానికి తులసి మొదట కంగుతిన్నా మరుక్షణం తెరుకొని ఎదురు తిరిగింది. అది తెలిసి ఓరియా కూలీలంత లొల్లి చేసిండ్లు. లొల్లి పెద్దదై పోలీసుస్టెషన్ దాక పోయింది. కాని కంట్రాక్టరు రంగయ్య తన పలుకుబడితోని పోలీసుల నోళ్ళు మూయించిండు. పైగా కంట్రాక్టరు దగ్గర డబ్బు గుంజటానికి తులసి అడిన నాటకంగా ఉల్టాకేసు బనాయించిండ్లు పోలీసులు. అక్కడి నుండి భయటపడటమే గగనమైంది.
అలోచనలో పడిపోయిన శ్రీనుకు క్రషర్ నగర్ వచ్చింది గుర్తులేదు.
‘‘అన్న ఆపు’’ అని హిరా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ట్రాక్టర్ను అపిండు.
హిరా క్రిందికి దిగి తన బొగ్గుల సంచి ఎత్తుకొని గుట్టమీద దొంతర్లుగా ఉన్న గుడిసెలకేసి పోయింది.
మళ్ళీ బండి స్టార్టు చేస్తుంటే... దూరం నుండి అర్జున్ చూసి ‘‘శ్రీనన్న బండి ఆపు మేము అటే వస్తానం’’ అంటూ కేకేసిండు.
అర్జున్, అత్మరాం, ఈశ్వరిబాయ్, భగవతిమరికొంతమంది సద్దులు పట్టుకొని బయలు దేరినవాళ్ళు పరుగు పరుగున ఉరికి వచ్చి ట్రాక్టర్ ఎక్కిండ్లు. లేకుంటే వాళ్ళు ఉండే చోటు నుండి క్వారీకి దాదాపు నాల్గుకిలో మీటర్లు నడిచి పోవలసివ చ్చేది. కూలీలు పొద్దున సద్దికట్టుకొని వస్తే మళ్ళి సాయంత్రం చీకటి పడ్డతరువాతనే ఇంటికి తిర్గివచ్చేది.
‘‘ఎంటీ ఇవ్వాళ పొద్దు పోయింది’’ అన్నాడు శ్రీను అర్జున్తో మాటకలుపుతు.
‘‘లలేచి వండుకొని తినివచ్చే సరికి ఈ యాల్ల అయ్యే’’ అన్నాడు అర్జున్.
ఇవ్వాళ భగవాన్ మెస్త్రీ వస్తడా! అని అడిగిండు అత్మారాం...
‘‘అదే ఎందుకు’’
‘‘నిన్న కూలీ పైసలు ఇవ్వాల్సి ఉండే నిన్న రాలేదు ఇవ్వాలైనా వస్తడా లేదా’’ అన్నాడు.
కరకరలాడుతు తుర్పున సూర్యుడు పొడుచుకొచ్చిండు.ఈ సారి ఎండలు తొందరగానే వచ్చినవి. బారెడు పొద్దు ఎక్కెసరికి ఎండ సురసుర లాడుతున్నది. ఇక బండల మీద పని చేయ్యటం అం నిప్పుల కొలిమిలో మెసిలినట్టే అందుకే కూలీలు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దున పని ముగించుకోవాలని చూస్తరు.
‘‘నిన్న ఎందుకు రాలేదో ఎమోకాని...భగవాన్ మెస్త్రీ మాట తప్పె మనిషికాదు. ఇవ్వాళ తప్పకుండా వస్తడు’’ అన్నాడు శ్రీను.
మాటల్లో పడిపోయి క్వారీ వచ్చింది తెలియలేదు.
రామగుండంలోని రాముని గుండాలు గుట్టకు దివాకర్రావుకు మొదట ఒక్కటే క్వారీ ఉండేది కాని గిరాకి ఎక్కువగా ఉండటంతో గుట్టకు మరో వైపున ఇంకో క్వారీ మొదలు పెట్టిండు.
రాముని గుండాల గుట్టకు తూర్పువైపున ఒక దోనే (చిన్నగుహ) ఉంది. పెద్ద బండ రాయికి దిగువన నిలువెత్తున దాదాపు పెండు గజాల వెడల్పున దోనే ఉంది. అందులోని ఒక చిన్న బండ మీద మారెండంత ఎత్తుఉండే రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రాహలున్నాయి. సెలవు రోజుల్లో ప్రతి శ్రావణ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అగుహకు ఒక వైపున బండల మీద ప్రాకిన రాళ చెట్టు ఒకటి ఉంది. గుహకు ఎదురుగా కొద్ది దూరంలో నీటి బుంగ ఒకటి ఉంది. వలయాకారంలో ఏటు జానెడువెడల్పు జానెడు లోతు ఉండే బండరాలయి మీద తొలి చినట్టుగా ఉండే బుంగలో ఎప్పుడు నీరు ఉంటుంది. ఆ బుంగలో అనీటిని తోడితే మళ్ళి అంతే నీరు ఊరుతుంది తప్ప అంతకంటే ఎక్కువ నీరు ఊరదు. దాని మీద స్థానికుల్లో ఒక కథనం ఉంది. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజలు అక్కడ గుహలో ఉన్నాడని అ సందర్భంగా ఒక సారి సీతకు దాహం వేస్తే రాముడే స్వయంగా నీటికోసం ఆ బుంగను తొలిచాడని చెప్పుతారు. ఇటువంటి నమ్మకాలకు ప్రజల్లో కొదవలేదు. కాని అట్లా నీరు ఊరడం అంతా రాముని మహిమ అని నమ్ముతారు. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. చుట్టు ప్రక్క గ్రామాల నుండి జనం వస్తారు. అ సమయంలో గుళ్ళో అయ్యగారు రోజు ఉంటాడు. మిగితా సమయంలో ఉండేది తక్కువ.
రాముని గుండాలగుట్ట చాల విశాలంగా పరుచుకొని ఉంటది. గుట్టకు దక్షణం వైపున మొదటి సారీ క్వారీమొదలైనప్పుడు దేవుని గుట్టకు క్వారీ ఎట్లా నడిపిస్తరు అంటూ జనం నుండి వ్యతిరేకత వచ్చింది. కాని దివాకర్రావు తన పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యమంలో ముందు పీటన నిలచిన వారిని నయనా భయానా లొంగదీసుకొని క్వారీ మొదలు పెట్టిండు.
ఇటువంటి సంఘటనలు కరింనర్ జిల్లాలో చాల జరిగినయి. ము్య•ంగా గ్రానైట్ పరిశ్రమ పుట్టుకొచ్చిన తరువాత చాల గుట్టలు మాయమైనవి. ఎంతో చారిత్రక ప్రాదన్యం కల్గిన గుట్టలు దేవుని గుట్టలు కూడా వదలకుండా క్వారీలు చేసిండ్లు. పెద్ద పెద్ద బండరాలను సైజుల వారిగా కట్చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసి గ్రానైట్ పరిశ్రమాధిపతులు వందల కొట్లు సంపాధించిండ్లు. ఇట్లా సంపాధించిన డబ్బులతో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా గ్రానైట్ పరిశ్రమాధినేతలు రాజకీయ నాయకులై, ఎమ్మెల్యెలుగా ఎంపిలుగా గేలిచి మంత్రులు అయ్యిండ్లు. గుట్టల విద్వంసం వలన ఎర్పడుతున్న పర్యావరణన విద్వంసం గురించి పర్యావరణ ప్రేమికులు ప్రజాస్వామిక వాదులు అనేక మార్లు అందోళన చేసిండ్లు. కాని గ్రానైట్ పరిశ్రామధిపతులు ప్రభుత్వా అండతో వాటిని అణిచి వేసిండ్లు. వారి నిరసనలు అరణ్యరోదనే అయ్యింది.
వీళ్ళు అక్కడికి పోయే సరికి అప్పటికే కూలీలు పనులు మొదలు పెట్టిండ్లు. పెద్ద పెద్ద బండలను క్రషర్లోనే వేయాటానికి వీలుగా చిన్నచిన్న ముక్కలుగా కొడుతున్నారు కొందరు. వాటిని తీసుక పోయి క్రషర్ బంకరులో వవేయాటానికి దాదాపు అరువై డెబ్బయి మంది పిల్లలు పనులు చేస్తున్నారు. గుట్టకు కాస్త దిగువన అకాశం కంటూ పొడుచుకున్న క్రషరు పెద్దగా చప్పుడు చేస్తూన్నది. బండాలు చుర అయ్యే క్రమంలో ఎగిసిన దట్టమైన దూళి ఎగజిమ్ముతు అక్కడి వాతవరణం అంతా పేరుకపోయింది. అక్కడ పనిచేస్తున్న వారంత తలకు ,ముక్కుకు మూతికి గుడ్డలు కట్టుకొని ఉన్నారు. అక్కడ పని చేస్తున్న వారంత తెల్లటి బూడిద దుమ్ముతో నిండిపోయింండ్లు.
మరో దిక్కున క్రషర్ బెల్టునుండి చిన్న చిన్న ముక్కలుగా బయిటికి వస్తున్న బండ రాళ్లను కాస్త పెద్ద సైజుబండలను ఏరుతు మరికొంత మంది పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత వేగంగా పని చేస్తున్నరంటే బెల్టు ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా చెతులు అడిస్తూ సైజుల వారిగా బండలు ఏరే పనిలో ఉన్నారు.
అట్లా పని చేసే పిల్లలకు ఇచ్చే కూలి చాల తక్కువ. వాస్తవానికి పిల్లలతో పనులు చేయించటం చట్టరీత్య నేరం. అటు వంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వ లేబర్ డిపార్టు మెంటు ఉంది కాని అది నామ మాత్రమే. లంచాలకు ఎగబడిన అధికారులు అవేవి పట్టించుకోరు. ఎదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడలేని హడావిడి మొదలైతది. అటు తరువాత వాటికి దాతు పిర్యాదు ఉండదు.
లోడర్ వెంకటెశం చెయ్యెత్తి ట్రాక్టర్పోను కాస్త ముందుకు తీసుక రమ్మన్నట్టుగా సైగలు చేసిండు.
శ్రీను ట్రాక్టరును కాస్త ముందుకు తీసుకపోయి కుప్పగా పోసిన కంకర కుప్ప ముందు నిలిపిండు. గతంలో అయితే లోడింగ్, అన్లోడింగ్ అంతా కూలీలే చేసేవాళ్ళు. ఇప్పుడు యంత్రాలు వచ్చిన తరవాత అపని తెలికైంది. కాని అమేరకు కూలి దొరకని పరిస్థితి ఎర్పడింది.
నిముషాల్లో లోడర్ ట్రాక్టర్లో కంకరలోడు చేసింది. ఎక్కువ అలస్యం చేయకుండా శ్రీను ట్రాక్టర్ను ఎల్కపల్లి గేటు కేసి పరుగులు పెట్టించిండు.
మద్యాహ్నం వరకు నాలుగు ట్రిప్లు కొట్టిండు ఎండ ముదిరింది. కడుపులో అకలి సురసుర లాడసాగింది. పొద్దున వెంట తెచ్చుకున్న సద్దితిని మళ్ళి పనిలో పడ్డడు.
గతుకుల రోడ్డు మీద ట్రాక్టరు ఎగిరి ఎగిరి పడుతు ముందుకు పోతున్నది.
కాస్త దూరం పోయే సరికి దిలీప్ కన్పించిండు. దీలీప్ని చూసి శ్రీను మనసులో జాలి అన్పించింది. అంత పది పన్నెండు సం।।రాలు మించి ఉండదు. దీలిప్ తల్లి మూడెండ్ల క్రింద దేవ్ చనిపోయింది. దీలిప్ తండ్రి వాళ్ళు వీళ్లు’’ ఎమంత వయస్సు పోయిందని, మళ్ళీ పెండ్లి చేసుకొమ్మన్నరు. కాని భార్య చినపోయిన తరువాత దేవ్ కు జీవితం మీద అసక్తి పోయింది. పిల్లవాన్ని చూసుకుంటు బ్రతుకు తున్నాడు.
దీలిప్ ప్రక్కగా ట్రాక్టరు అపి శీను. ‘‘ఎక్కడికి క్వారికేనా’’ అని అడిగిండు.
‘‘అవును’’ చిన్నగా నవ్వుతు తాలాడించిండు. దిలీప్...
‘‘అయితే ఎక్కు’’
దిలిప్ బండి ఎక్కిండు. చేతిలో సంచి ఉంది. అది చూసి..
‘‘ఏంటది’’ అన్నాడు శ్రీను.
‘‘నాన్నకు సద్దీ’’
‘‘ఎవరు వండిండ్లు’’
‘‘నేనే’’ అన్నాడు మెరిసే కండ్లతో...
‘‘నీకు వంట కూడా వచ్చా’’ అన్నాడు అక్చర్యంగా...
‘‘దీలిప్ తలాడించి’’ రోజు పొద్దున్నె నాన్నె వండి పోతడు కాని ఇవ్వాల వీలు కాలేదు. అందుకే నేను వండిన’’ అన్నాడు.
శ్రీనుకు నిజమే అన్పించింది. పిల్లవాడు అంత దూరం పోయ్యి రావటం కష్టమే అనుకున్నాడు. ఎన్టిపిసిలో పెరెన్నిక పొందిన రెండు స్కూల్లు ఉన్నాయి కాని అందులో కూలి పిల్లలకు సీటు దొరకయి. దాంతో చాల మంది కూలీల పిల్లలు చదువు కునెందుకు అవకాశాలు లేకుండా పోయింది. చెల్డు వెల్ఫేర్ వారి స్కూలు మూత పడ్డతరువాత అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయింది. ఒక లిద్దరు కాని గిరి బడి పెట్టిండ్లు. కాని అది సరిగ్గా నడవక మూసెసిండ్లు. దాంతో కూలిల పిల్లలకు చదువు లేకుండా పోయింది.
ఇంట్లో అడవాళ్ళు ఉంటే అదోతీరు కాని అడదిక్కులేని కాడ, అందులో క్రషర్నగర్ వంటి చోట నీళ్ళు కావాలన్నా పోయిలోకి బొగ్గులు కావాలన్నా ప్రతిది సమస్యే. దేవ్ పనికి పోతే దిలీప్ అ చిన్న వయస్సులోనే ఇంటికాడ పనులన్ని చేసేవాడు.
సైట్మీదికి చేరుకున్నారు. ట్రాక్టర్ను మళ్ళి లోడ్కోసం నిలిపి దీలిప్ను ఉద్దేశించి ‘‘మళ్ళీ పోయేతప్పుడు వస్తవా’’ అన్నాడు బొమ్మలు ఎగరెసి...
‘‘కాసేపు అడుకున్నంక వస్తా’’
‘‘అయితే రెండో ట్రిప్లో తీసుకపోతాలే’’ అన్నాడు శ్రీను...
అన్నాలు తినే వేళ కావటంతో షెడ్డులో చాల మంది కూలీలు ఎక్కడికి అక్కడ కూచొని బోజనాలు చేస్తున్నారు. ఇంతలోనే బుర్ బుర్ లాడుతు భగవాన్ మెస్త్రీ మోటారు సైకిల్ చప్పుడు విన్పించింది.
భగవాన్ మెస్త్రీ బండిని క్రషర్ అపీసు ముందు నిలిపి అపీసులోకి వస్తూ శ్రీనును చూసి
‘‘అరేయ్ శ్రీను ఎంత వరకు వచ్చింది పని’’ అని అడిగిండు. ఎల్కలపల్లి గేటుకు కంకర కొట్టుడు అయిపోయింది’’ అంటూ బదలిచ్చిండు.
‘‘కంట్రాక్టరు పోన్ల మీద పోన్లు చేస్తాండ్లు. తిలక్నగర్కు (బెందడి) బెస్మెంట్ రాయి తీస్కపోవాలి. తొందరతినిపో...’’ అని పురమాయించి మళ్ళి వెనక్కి తిర్గి అపీసుకు పోబోతుంటే అత్మరాం ‘‘మెస్త్రీ ఇవ్వాళ పైసలు ఇస్తరా’’ అని అడిగిండు.
‘‘అరే ఇస్తం బిడ్డా.... నీపైసలు ఎక్కడికి పోవు... కూలి ఇచ్చినంకనే ఇక్కడి నుంచిపోత సరేనా’’ అన్నాడు నవ్వుతూ...
(తరువాతి భాగం వచ్చే సంచికలో )
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
32
సింగరేణి వ్యాపితంగా అన్ని డివిజన్లలో లారీలోడిండు కంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కంట్రాక్టు పద్దతి ఎత్తేసి - సింగరేణి యాజమాన్యమే నేరుగా కంట్రాక్టర్ లోడింగు లేబర్ను బదిలీ పిల్లర్లుగా తీసుకొని లారీ లోడింగునేరుగా చేయించాలి. మధ్య దళారులు లేకుండా సింగరేణి యాజమాన్యమే కార్మికులకు చెల్లింపులు చేయాలి.
మొదట గోదావరిఖనిలో డిశంబర్ ఆఖరు వారంలో ఆరంభమైన సమ్మె మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కొత్తగూడెంలో జనవరి మొదటి వారంలో కార్మికులు సమ్మెలోకి దిగారు. సమ్మెకు మద్దతుగా రాడికల్స్ పోస్టర్లు వేశారు. బొగ్గు యార్డులోనే శిబిరాలు వేశారు. శిబిరంలో రిలే నిరాహరదీక్షలు కొన సాగుతున్నాయి. సింగరేణి వ్యాపితంగా కంట్రాక్టులేబర్ యూనియన్లన్ని దాదాపుగా ఏఐటియుసియే నడుపుతున్నది. కనుక మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొనకతప్పలేదు. కంట్రాక్టర్లంతా దాదాపుగా దొరలు లేదా కాంగ్రెసు అనుబంద యూనియన్ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. సింగరేణి వ్యాపితంగా బలంగా ఉన్న ఈ రెండు యూనియన్ల మధ్య ఈ సమ్మె యుద్ధవాతావరణాన్ని తెచ్చింది. దీని మూలకంగా కంట్రాక్టర్లు గుండాల ఆర్థిక మూలల మీద దెబ్బకొట్టి - అన్ని రంగాలల్లో విస్తరించి యున్న దొరల మీద దెబ్బతీసినట్లుగా రాడికల్స్ భావించారు.
అయితే రాడికల్స్ -కమ్యునిస్టు అనుబంద కార్మిక సంఘం లోనే పనిచేస్తున్నారు. వాళ్లెవరన్నది గుర్తుపట్టలేక - ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో - నిర్వీర్యమైన తమ యూనియనుకు తీవ్రత పెరిగి - బలం పుంజుకోగలదని - కమ్యూనిస్టుల అంచనా - ఏదిఏమైనా - సింగరేణిలో ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. యాజమాన్యం మొత్తం సింగరేణి కంపెనీ పాలసీకి సంబందించిన విషయం కనుక - హైదరాబాదులో రెండు దపాలుగా చర్చలు జరిపినా - రెండు యూనియన్ల లక్ష్యాలు పరస్పర విరుద్దమైనవి గనుక ఒక కొలిక్కి రాలేదు...
ఈ విషయం మీద కార్మికులకు మద్దతు కూడ గట్టడానికి గంగాధర్, షరీప్, శంకరయ్య, సత్యం, శంకర్ వారివారి రంగాలల్లో రోజు తిరుగుతున్నారు. అన్నిపిట్ కమిటీలు ప్రత్యేక సమావేశం చేసుకొని సమ్మెకు మద్దతు ప్రకటించాయి. చందాలు వేసుకొని సమ్మెలో ఉన్న కంట్రాక్టు కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. విద్యార్థులు వీధుల్లో తిరిగి చందాలు వసూలు చేసి వచ్చిన మొత్తాన్ని కంట్రాక్టు కార్మికుల కిచ్చారు.
జనవరి అయిదవ తేది - సి.యస్.పిదగ్గరి శిబిరం దగ్గర దాదాపు వందమంది కంట్రాక్టు కార్మికులున్నారు. పదిమంది షామిషానలో రిలే నిరహార దీక్షలో కూర్చున్నారు. వాళ్లకు మద్దతుగా విద్యార్థులు, రెహనా, లక్ష్మి, సరిత వారితో పాటు కూడా కూర్చున్నారు...
సియస్పి దగ్గరి నుండి మేన్ రోడ్డు దాకా దాదాపు మూడు వందలకు పైన్నే లారీలు ఆగి ఉన్నాయి. లారీల డ్రైవర్లు, క్లీనర్లు లారీల దగ్గరే వంటలు చేసుకొని అశాంతిగా యార్డంతా తిరుగుతున్నారు. కోల్యార్డులో కోల్ గుట్టలు గుట్టలుగా పడున్నది. సేల్ పరీకార్మికులకు ఆ కుప్పల మధ్య పనిచేయడం కుదరడంలేదు. అందరు చుట్టూ ముగారు.
అలాంటి సమయంలో గంగాధర్ ముప్పయి మందితో శిబిరం దగ్గరికి వచ్చారు. చాలా వరకు ఆ డివిజన్ లోని ఫిట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తరుపున తమ పూర్తి మద్దతు తెలుపుతామని - అవసరమైతే - స్కూల్లు బందు పెడుతామని విద్యార్థుల తరుపున శంకర్ మాట్లాడాడు...
శంకరయ్య వీరులారా మీకు వందనం పాట పాడిండు. కళాకారులు ప్రదర్శణ చేశారు. పెదనాన్న పోశెట్టి ఒళ్లో కూర్చున్న సంవత్సరం మూడు నెలల పిల్ల తపతప అడుగులేస్తూ శంకరయ్య బృందం దగ్గరకు చేరింది, కళాకారులు ఎత్తుకున్నారు ఫిట్ కమిటీల తరపున షరీప్ మాట్లాడిండు ‘‘మీరు సింగరేణి కోసం పని చేస్తున్న కార్మికులే - మునుపు ఎవరికి వారే కొట్లాడి దెబ్బలు తిన్నాం - సింగరేణి కార్మికులం మీవెంటే ఉన్నాం’’ భరోసా యిచ్చాడు.
ఎప్పుడు లేంది - రెహానా, లక్ష్మి, సరితతో పాటు మరో పదిమంది మహిళలు మీటింగులో కూర్చున్నారు. మహిళల తరపున రెహనా’’ గింత మందిల పస్టుసారి...గుండె కొట్టుకుంటంది... మా తిప్పలు మేం బడ్తన్నం. మీరు గోస పడ్తండ్లు. మీ కట్టం - సుఖం గిట్ల సూడటం - మీతో పాటు మీమందరం నిలబడ్తం. సలాం’’ కూర్చున్నది. లక్ష్మి షేక్హాండిచ్చింది.
లోడర్ల తరపున వెంకులు మాట్లాడిండు. అతనికి మాట్లాడటం ఇదే మొదటిసారి - ‘‘అన్నలారా! నాకాళ్లు గజగజ వనుకుతన్నయ్. లోపటినుంచి దు:ఖం ఎగదన్నుకత్తంది. ఒకప్పుడు అర్జన్న మాతో పని చేసిన అర్జన్న - నిలబడి సమ్మె జేసినం. అర్జన్నను సంపిరైలు పట్టాలకేడీసిండ్లు -ఆ కథంతా మేంజూసినం. ఇగో ఇక్కడ కూసున్న మొగిలన్నకు గ కథంతా ఎరుకే బతకవశం కావటం లేదు... బయమైతంది... మీకందరికి శనార్థి’’ కూర్చున్నాడు...
అయిదు గంటల దాకా మీటింగు కొనసాగింది....
ఆఖరున గంగాధర్ మాట్లాడిండు.
‘‘ఇప్పుడిది మన ఒక్క దగ్గరి సమస్యకాదు. మొత్తం సింగరేణంతా జరుగుతోంది. కామ్రేడ్స్ - మీ మీద ఒక్క దెబ్బపడ్డా ఇది సింగరేణి కార్మికులమీద అందరి మీద పడ్డదెబ్బే - అగ్గై మండుతది. ఇది సింగరేణిలో తరతరాలుగా చాప కింది నీళ్లలాగా చేరి - అధికార్లదాకా వ్యాపించిన దొరల ఆర్థిక మూలాల మీద దెబ్బ - అధికారులను, మార్కెటును తమ చేతుల్లో పెట్టుకోవడానికి - గుండాలను పోషించడానికి మీ నెత్తురు చెమట నుండి వేలాది రూపాయలు దోపిడి చేసి వాళ్లు ఒక శక్తిగా ఎదిగారు.ఈ దెబ్బతో మార్కెటు మీద దొరల ఆదిపత్యం పోతుంది. ప్రజలు మనుపటిలాగాలేరు. కార్మికులు సింగరేణిలో జరిగే ప్రతిచర్యను గమనిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ సమస్య ఆలశ్యం చేసేది కాదు. సుమారు ముప్పైవేల లారీలు అన్ని డివిజన్లలో ఆగిపోయాయి. చిన్న పరిశ్రమలు బొగ్గులేక ఆగిపోయే పరిస్థితి వచ్చింది... చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏసి రూముల్లో - హైదరాబాదులో కాదు - సమ్మె శిబిరాల దగ్గరికివచ్చి కార్మికులతో చేయాలని మేం డిమాండు చేస్తున్నాం... వాళ్లు అట్లా చేయకపోతే ఈ సమ్మె సింగరేణి గనులకు వ్యాపిస్తుంది... కార్మికులందరు జనరల్ మేనేజరు ఆఫీసుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. వేలాది రూపాయల జీతాలు తీసుకొని - విలాసవంతమైన జీవితం గడిపే అధికారులారా! కార్మికుల చెమట, నెత్తురుతోనే మీరంతా బతుకుతున్నారు. సమస్యను పరిష్కరించండి. కార్మికులు మీ శత్రువులు కాదు. గులాములు కాదు. కార్మికులు బొగ్గులో ఉండే ఇంధన శక్తి...’’ గంగాధర్ ముగించాడు....
శంకరయ్య సైకిల్ తీసుకున్నాడు.లక్ష్మి కూతురు నెత్తుకొని వెనుక సీటు మీద కూర్చున్నది. రాత్రికి శిబిరం దగ్గర పడుకోవడానికి వస్తామని వెళ్లిపోయారు... అప్పుడు కమ్యూనిస్టు నాయకులు ఇబ్రహీం, కరీం, కొమురయ్యతో పాటు ముప్పై మంది వచ్చారు....పోశెట్టితో చేతులు కలిపారు. మీటింగు మళ్లీ మొదలయ్యింది.
అదే సమయంలోసినిమా టాకీసుగేట్లు మూసి దాదాపు యూభై మంది గుండాలతో కృష్ణారావు మీటింగు ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో లోడింగు మొఖద్దమ్లు, బ్రాండి, కల్లు, సారా దుకాండ్ల దగ్గర గుండాలు, కటికె దుకాణాలు నిర్వహించే గుండాలు, మేకల మండీలవాళ్లు, చిట్టీలు,వడ్డీలు వసూలు చేసేవాళ్లు, బ్రాండి, సారా గోడౌను దగ్గరి గుండాలు, సారాకాచే వాళ్లమీద దాడి చేసే గుండాలు, మార్కెట్ చూసే గుండాలు, ఫిట్ కమీటీలు, సేప్టీ కామిటీలు, ఆఫీసులదగ్గర పైరవి కార్మికులు, యూనియన్ ఆఫీసుబేరర్లుల నుండి ఎంపిక చేసుకున్న వారిని మాత్రమే పిలిశారు.
క్రిష్ణారావు ముఖమంతా నెత్తురు పేరుకపోయి కూర్చున్నాడు. రాఘవులు కృష్ణారావు కుర్చీపక్క దూరంగా నిలబడి - ‘‘గిప్పుడు మననేతలు కార్యకర్తలు - సారలి, శంకర్లకోసం రొండు నిమిషాలు మౌనం పాటించుదాం’’ అన్నాడు.
‘‘గలత్తకోరోల్ల కోసమా? ఎవడన్న ఇంటె ముడ్డితోటి నవ్వుతడు’’ మందిల నుంచి ఎవడో గుణిగిండు.
కృష్ణారావు ఒక సారి మందిలకు చూసి గీసోదేంది?’’ అన్నట్టు రాఘవులు ముఖం చూసిండు.
అందరు లేచి నిలబడి మౌనం పాటించారు. కీష్ణారావు లేవడం కూచోవడం ఇబ్బందయ్యింది.
‘‘సారలి’’
‘‘అమర్హై’’
‘‘శంకర్’’
‘‘అమర్హై’’
అందరు అరిచారు - ‘‘కొంపదీసి రాఘవులు గాడు డబుల్గేమ్ ఆడ్తలేడుగదా! కమ్యూనిస్టు తీర్తం పుచ్చుకొని’’ - కటికె వీరస్వామి చేపల మార్కెట్లు పెద్ద నర్సింగం చెవులూదిండు.
‘‘వింటెగీన్నే నీదవుడలు - నీదవుడలు సదురుతరు’’ నర్సింగం.
‘‘ఆత్మీయులారా! మన ప్రియమైన కార్యకర్తలు హత్యకు గురై సుమారు తొమ్మిదినెల్లు...’’
‘‘అప్పుడే దెబ్బకు దెబ్బతీస్తే గింతదాక వచ్చేదికాదు’’ నరేందర్ లేచి నిలబడి...
‘‘ఆలమ్డికొడుకు తాగిండా!’’ కృష్ణారావు.
‘‘నేను చెప్పేది వినుండ్లి - ఆ తరువాత మాటలు. ప్రతిదానికి రీతి రివాజుంటది. ప్లానుంటది. మనం చెప్పినట్టు ప్రపంచం నడిస్తే’’
కృష్నారావుకు కోపం పెరిగిపోయింది.
ఆయన లేచి నిలబడ్డడు.
‘‘రాఘవులు గాన్ని మాట్లాడనిస్తే - తెల్లారెదాక మాట్లాడ్తడు. గింత కాలం నాపేరు చెప్పుకొని, యూనియన్ పేరు చెప్పుకొని మీరంత తిన్నరు - తాగిండ్లు. తడి బట్టేసుకొని బేఫికర్గ పన్నరు...సారలి గాడు శంకర్ గాడు ప్రతిదానికి ముందటివడి కొట్లాడి ఏచిన్న సమస్యను కూడా మీదాక, మాదాక రానిచ్చేటోళ్లుగాదు...పైన కంపెనీ ఎట్ల ఎన్నిడిజన్లతో నడుత్తందో - మన వ్యాపారాలు గన్ని గిక్కడున్నయి - ఇంత కాలం కమినిస్టోడు తోకలేవట్టలే గిప్పుడు రాడికల్లోల ఎంటే సుకొని తోకలు మిడ కొడుతండ్లు గాళ్ల తోకలు మీరు కత్తిరింత్తరా? నేనే ఆపని చేసి మీతోకలు కత్తిరించి - కొత్తవాళ్లను బిజినెస్లకు తెమ్మంటరా? ఊకే బైసెందుకు?’’ మీరు బొత్తలు పెంచి ఆరాముగా సెటిలయ్యిండ్లు - గిప్పుడు గట్ల నడువది’’
‘‘అరెశ్రీనివాస్’’ పిలిచిండు.
సినిమాటాకీస్ మేనేజర్ శ్రీనివాసు ముందుకొచ్చి నిలుచున్నడు.
‘‘అన్ని ఇంతె జాములు చేసినవ్గద’’
‘‘చేసినదొర - రాఘవులును ఎంట తీసుక పోండ్లి - నేను పోలీసులకు చెప్పిపెట్టిన - మీ ఎంటిక పీకెటోడెవడులేడు’’ కృష్ణారావు దొర చరాచరా నడిచి అక్కడి నుండి వెళ్లిపోయాడు...
సినిమాటాకీసు ముందు కార్లో తమ్ముడు రాజేశ్వరరావు ఎదురుచూస్తున్నడు కారెక్కి ఇంటికి పోయిండు.
మరోపది నిమిషాలు తర్జన భర్జన - ఆరున్నరకే చలికాలం గన్క చీకటయ్యింది...ఒక ట్రక్కు వచ్చి సినిమా టాకీసు గేటులోపల సొచ్చింది - రాఘవులుతో సహా - కత్తులు ,గొడ్డండ్లు, కర్రలు పట్టుకొని ముప్పైమంది గుండాలు మేన్రోడ్డువెంట గాకుండా దొంగతొవ్వల మీదుగా బయలు దేరింది.
చీకటి దారలు గుండా లారీ శిబిరం కు ముందు బోయి చీకట్లో బొగ్గు కుప్పల మధ్య ఆగింది.
శిబిరం దగ్గర ఇబ్రహీం మాట్లాడుతున్నాడు’’ మనయూనియన్ అమరుడు కామ్రేడ్ శేషగిరిరావు దగ్గరినుండి - అమరుడు మక్దూం లాంటి వారి స్పూర్తితో కామ్రేడ్ భాస్కర్రావు గారి నాయకత్వంలో కొట్లాడుతోంది. ఏమైనా -దొరలు సంచులు పదురుకొని దుకాణం బందు చేయాల్సిందే. మరింక దొరల రాజ్జెం నడువదు... సింగరేణిలో అన్ని డివిజన్లలో మన నాయకత్వంలో సమ్మె జరుగుతోంది. మన కామ్రేడ్ భాస్కరరావు చర్చలకు హైదరాబాదు వెళ్లి వచ్చిండు. తప్పక మనమే విజయం సాధిస్తాం. రేపు ఉదయం కార్మికునికి ఒక్కంటికి పదిరూపాల చొప్పున సహాయం చేయడానికి మన యూనియన్ నిర్ణయించింది. ఎన్నినెలలైనా సమ్మెఅపేది లేదు. సింగరేణి యాజమాన్యం - ఐయన్టియుసి దొరల యూనియన్ కలిసి నాటకాలు ఆడుతున్నారు..’’
లైట్లు ఆరిపోయాయి. బొగ్గుకుప్పల సాటునుండి గుండాలుదాడి చేశారు. అందరు ఒక్కపెట్టున లేచారు. లొల్లి అరుపులు -పెడీల్ పెడేల్న దెబ్బలు - ‘‘సత్తిరో’’ మొత్తుకోళ్లు ఉరుకులు పరుగులు... అయిదు నిమిషాలు అల్లకల్లోలం శిభిరం కూలిపోయింది..షామియాన మీద నెగడు దగ్గరి నిప్పులు వేసిండొకడు. సామియాన కాలుతోంది. లారీల దగ్గరి డ్రైవర్లు టార్చిలైట్లు పట్టుకొని వందమంది దాకా ఉరికొచ్చారు వాళ్లు. ఎఐటియుసి వాళ్లనుకొని గుండాలు పరిగెత్తారు....
అంతా అయిదు నిమిషాలల్లో ముగిసింది. అక్కడ దెబ్బలు తాకి బొగ్గుకుప్పల్లో పడిపోయి పదిమందున్నారు. పోశెట్టి, కరీం, కొమురయ్యలతో పాటు మరో ఏడుగురికి రక్తం కారుతోంది. ఎవరూ చనిపోలేదు. డ్రైవర్లకు ఏంచేయాలో అర్థంకాలేదు. అందులో ఒక సర్దార్ ‘‘క్యారే క్యాదేఖ్తే - జాన్వర్జైసే లడే - ఆదిమీహైరే’’ అన్నాడు.
‘‘ఎటుబోయి ఎటస్తదో - అసలే అంత గందరగోళంగా ఉన్నది’’ ఇంకోడ్రైవర్...
‘‘అరెభయ్ రోడ్డు మీద ఆక్సిడెంటయితది - అందరు అట్లంటె మనపనేంగావాలె’’ అన్నడు ఇంకోడ్రైవర్..
నలుగురు డ్రైవర్లు పదిమంది క్లీనర్లు కలిసి గాయపడిన వాళ్లందరిని హాస్పిటల్కు లారీలో తీసుకొనిపోయారు... అప్పుడు రాత్రి ఎనిమిది గంటలౌతోంది...
33
శంకరయ్య, లక్ష్మి ఇల్లు చేరుకునేసరికి రాత్రి ఏడయ్యింది. చిన్న పిల్ల స్నేహలత ఏడుపుషురు చేసింది. శంకరయ్య పొయ్యి ముట్టించి ఉడుకు నీళ్లు పెట్టిండు. పిల్లకు నీళ్లు పోసిన తరువాత ఏడుపు తగ్గింది. లక్ష్మిపాలు వేడి చేసి తాగిచ్చింది.
‘‘మళ్ల విబిరం దగ్గరికి పోవాలె...రాత్రి ఆడనే పడుకోవాలె. జెప్పన వంట చేసుకుందాం’’ దడిపొంట పోయి సొరకాయ తెచ్చిండు. గీకితనే కూరవండిండు...
లక్ష్మిబియ్యం కడుగుతాంటె ‘‘ఎందుకైనా మంచిది ఎక్కువ పెట్టు, సత్యం, శంకర్ వస్తరేమొ?’’ శంకరయ్య...
‘‘గంగన్న మొఖం పీక్కపోయింది. ఏడ తింటండో - ఏడ పంటండో - మీకందరికి సంసారం - బాయిపని - ఇల్లు ఉన్నాయి.’’ లక్ష్మి...
అదేమనకు ఒక్కిల్లింటే అయినకు వందల ఇండ్లు. మన ఇండ్లన్ని ఆయనయే గంగన్న సదువుల పస్టు - ఇంజెనీరు సదివిండు. బంగారు బిళ్ల ఇచ్చిండ్లట - మద్రాసుల మంచి ఉద్యోగం చేసిండట...వాళ్ల తల్లికి మొక్కాలె - అచ్చం నీలోన్నాయే - లోపటేమనుకుంటదోగని - మనిషి సూస్తే పిరికెడు. గంగన్న - అయినె సెల్లె సరిత ఇండ్లనే తిరుగుతండ్లు - వాళ్ల నాయినకు కోపం’’ శంకరయ్య మొఖమంతా వెలిగిపోంగ చెప్పుకచ్చిండు.
లక్ష్మి భీరిపోయి నిల్చున్నది. స్నేహలత వచ్చి తండ్రి చేతుల్లో చేరిపోయింది. లక్ష్మి ముఖంలో భయం.
‘‘నీ సంగతి సూత్తె ఎప్పుడో సెంగోబిళ్ల అనేటట్టున్నవు. అయ్యా కామ్రేడ్! నేను దిక్కు మాలినదాన్ని - మునుపటితీర్గ - తాగుతిను. కోపమత్తే తన్ను గుద్దగని - నన్ను ఒదిలిపోకు లక్ష్మి కళ్లల్లోనీళ్లు - కంఠం రుద్దమై పోయింది...
‘‘కామ్రేడ్ లక్ష్మి మొదటి సారిగా శిబిరానికి వస్తివిగదా! ఏమనిపిచ్చింది ?’’ శంకరయ్య మాటమారుస్తూ...