ఓ రాత్రి నాకో కల వచ్చింది
అ కలలో సముద్ర తీరం వెంట నేను నా ప్రభువుతో కలిసి నడుస్తున్నాను
నల్లటి ఆకాశంలో నా జీవితంలోని కొన్ని దృశ్యాలు మెరుపులా మెరిసాయి
ప్రతి దృశ్యంలో రెండు జతల పాద ముద్రలు ఇసుకలో ముద్రించబడి వున్నాయి
అందులో ఒకటి నాది మరొకటి నా ప్రభువుది
నా జీవితంలోని చివరి దృశ్యం నా ముందు ప్రత్యక్షమైన తర్వాత
నేను వెనుతిరిగి ఇసుకలోని ఆ పాదముద్రల వైపు చూసాను
చాలా సార్లు నేను గమనించినదేమిటంటే నా జీవిత ప్రయాణంలో
ప్రత్యేకంగా నేను దుఖ:బరితంగా ఉన్నప్పుడు
ఒక్కజత పాదముద్రలే గోచరించాయి
ఈ విషయం నన్ను చాలా కలిచివేసింది, వెంటనే నేను దీనికి కారణం ప్రభువుని అడిగాను
“ఓ ప్రభు, నేను నీ వెంట నడిచే నిర్ణయం తీసుకున్న తర్వాత
నీవు నావెంటే ప్రయాణిస్తానని మాట ఇచ్చావు
కాని నేను ఒక విషయం గమనించాను
నా జీవితంలో విషాదకరమైన మరియు వేదనాభరితమైన క్షణాల్లో
నా జీవిత గమనoలో ఒక జత పాద ముద్రలు మాత్రమే కనిపించాయి
నాకు అసలే అర్ధంకావడం లేదు ఎందుకు నేవు నన్ను వదిలి వెల్లావు
నాకు నీ అవసరం వున్న సమయంలో
ప్రభువు మెల్లగా అసలు రహస్యం వివరించాడు,
“నా చిట్టి తల్లి, నీవంటే నాకెంతో ఇష్టం నిన్ను నీను ఎన్నటికీ వీడను
నీ కష్టాల్లో మరియు నీ పరీక్షా సమయాల్లో
నీకు కనిపించిన ఆ ఒక్క జత పాదముద్రలు ఎవరివో కావు
నావే,
ఆ సమయంలో నేను నిన్ను ఎత్తుకున్నాను.
(మేరి స్టీవెన్సన్ కవిత Footprints in the Sand కు అనువాదం)