ఉత్తరాది భారతంలో
ముసురు పడుతుంది
అది యెడతెర్పిలేకుండా
నెలలతరబడి కురుస్తుంది
యిప్పుడది
ప్రవాహరూపం దాల్చింది
అ ప్రవాహం సంఘీ టిక్రి ఘాజీ
సరిహదులగుండా
సుడులు తిరుగుతూ
టవర్లని కూలుస్తూ
యెన్నో అడ్డుకట్టలని
తొలుచుకొని
అనేక రౌండ్లని ఛేదించుకొని
అలుపెరగని ప్రవాహంగమారింది
కౌటిల్య షాలు
మను మోడిల పాచికలు
అ ప్రవాహాన్ని అపలేకపోతున్నాయి
యిప్పుడది
లక్ష కాలువ(నాగ)లై
రాజధాని వీధుల గుండా
పరేడ్ చేస్తున్నయి
నిజమైన రిపబ్లిక్ ను
ప్రజలకందించడానికి
-
(గణతంత్ర దినోత్సవం నాడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయలని ట్రాక్టలతో పరేడ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ రాసిన కవిత్వం)