కాలం గడిచినా కన్నీళ్లు ఆగట్లేవు...
జారుతున్న కన్నీరైనా నా కలాన్ని కదింలించట్లేవు...
మారుతున్న మనుషులే కారణమేమో...
గాయపడిన మనసుకి మసిపూసి మంత్రం వేసారేమో...
అందుకే
బయటకు తెలియకుండా భరించలేని బాధతో...
బతకాలో...చావాలో తెలియని స్థితిలో
మతిమరిచిన మది చితిమంటలో
చిముకు చిముకు మంటూ బూడిదవ్వమంటుంది...
కానీ,
నా చావు పలువురి పెదవులపై చిరునవ్వును సమకూర్చినా సరే...
దాంతో వారిలో
అణువణువున తనువంతా ఉదయించిన
అహం,అన్యాయం ,ఆవేశం,అత్యాషలన్నీ
అస్తమిస్తే చాలు...
మరలా రేపటి ఉదయంలో నేనే
రగిలే రవిలా ఉదయించి
ఈ ధరణి అంతటా
ధర్మపు తావినై విరబూస్తా...!!