ఇంటర్వ్యూలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ప్రజల భాషలో  రచనలు చేస్తే బాగుంటుంది – అనిల్ కుమార్

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుఅనిల్ కుమార్గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నా పేరు అనిల్ కుమార్ నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న నాకు దూరమైనరు. భూమి భుక్తి విముక్తి పోరులో సాగిన మా అమ్మానాన్నలు అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు.నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మానాన్నలు పార్టీ నుండి బయటకి వచ్చి బతుకుతున్న సమయాన ఆ విషయం తెలుసుకున్న మా తాత (మా అమ్మ వాళ్ళ నాన్న) కుల దురహంకారంతో రగిలిపోతూ వారిని ఏదోలా కనిపెట్టి జైలు పాలు చేశాడు. నేను అక్కడే పుట్టాను ఏ తప్పు చేయకుండానే సంవత్సర కాలంలోనే జైలు జీవితం అనుభవించాను.అదే క్రమంలో అమ్మకు కామ్రేడ్ భారతక్క కలవడం వల్ల వాళ్ళ మధ్య చిగురించిన స్నేహమే భారతక్కను అమ్మని పిలిచేలా చేశాయి. అయితే అమ్మానాన్నలు జైలు జీవితం గడిపి బెయిలు పై వచ్చిన తర్వాత కుల దురహంకారంతో రగిలిపోతున్న మా తాత వల్ల మా నాన్న చనిపోయాడు.ఈ దేశంలో ఉన్న మనువాద బ్రాహ్మణీయ భావజాలం ఎలా అయితే ఆడవాళ్ళని బానిసలా చేసిందో ఆ అసమానతల వల్లనే ఈ సమాజంలో నా తల్లి బ్రతుకలేక నన్ను మా నానమ్మ దగ్గర వదిలేసి అండర్గ్రౌండ్ వెళ్ళిపోయింది.అమ్మ కూడా 2000 సంవత్సరంలో ఒక ఎన్కౌంటర్ లో అమరురాలైంది. అప్పటినుంచి భారతక్క నా మంచి చెడ్డలు చూస్తూ చదివిస్తూ ఇంతవాన్ని చేసింది. నిజంగా వర్గ సంబంధం లో ఏర్పడిన ప్రేమైనా స్నేహమైన చాలా గొప్పది ప్రస్తుతం నేను ఎల్ ఎల్ బి సెకండ్ ఇయర్ చదువుతున్నాను.

2.      మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

ముందుగా విప్లవ సాహిత్యం అయిన దళిత సాహిత్యం అయిన దానికి రాజకీయ అవగాహన ఉండాలి.అలా ఒక రాజకీయ అవగాహన మొట్టమొదటిసారిగా నాకు పరిచయం చేసిన సంస్థ అమరవీరుల బంధుమిత్రుల సంఘం. అప్పటికీ ఆ సంస్థ నా బాధ్యతలు తీసుకొని మంచిచెడ్డలు చూస్తున్న క్రమంలో మీటింగ్ లోకి వెళ్లడం దగ్గర నుంచి విప్లవ రాజకీయ అవగాహన నాలో మొదలైంది. ఆ తరువాత డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పరిచయమైన దగ్గర్నుంచి కుల వర్గ రాజకీయాలు తెలుసుకున్న. ఇవి రెండు సంస్థలు విప్లవ దళిత రాజకీయాలు నేర్పించాయి. డీ ఎస్ యూ లో కార్యకర్తగా కొనసాగుతున్న క్రమంలో వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల మీటింగ్ లకు హాజరు కావడం అన్నిరకాల సాహిత్య సంస్థల మీటింగ్ లకు హాజరు కావడం దొరికిన పుస్తకాలు సేకరించడం మరియు మిత్రుల దగ్గర దొరికిన పుస్తకాలు చదవడంతో భాగంగా శివసాగర్ కవిత్వం, శ్రీశ్రీ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం, జాషువా విశ్వనరుడు కవిత్వం, పాణి రాసిన కలిసి పాడవలసిన గీతమొక్కటే నన్ను సాహిత్యం వైపు ఆకర్షించాయి.

3.      మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయినటువంటి పెట్టుబడిదారీవిధానం కులవివక్షత, మతోన్మాదం మన ప్రజలు పడుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇబ్బందులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.

4.      మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

సాహిత్యం లోకి రాకముందు సాహిత్యాన్ని అభ్యసిస్తున్న క్రమంలో నేను నేర్చుకున్న సాహిత్యాన్ని ఒక కొత్త తరహా పద్ధతిలో చెప్పదలుచుకున్నాను అందులో భాగంగానే విప్లవానికి ప్రేమను జోడిస్తూ విప్లవకారులు తమ తల్లి,తండ్రి,కుటుంబం, స్నేహితులను వదిలి ప్రజల కోసమే నమ్ముకున్న పంథాలో సాగిపోతున్న క్రమంలో వారు చేసే ప్రాణత్యాగం ప్రజలపై సొంత ప్రేమను కనబరిచింది. ఆ ప్రేమనే సాహిత్య రూపంలో చెప్పాలనుకున్న.

5.      మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

నేను గుర్తింపు అయితే కోరుకోలేదు కానీ నా కవిత చదివిన చాలా మంది ప్రశంసించిన కవిత్వం మాత్రం ఆ రోజులు వస్తాయి. దానివల్లనే ఇంకా రాయాలని ఆసక్తి కలిగింది.

6.      ఒక  రచయితగా ప్రస్తుత  సాహిత్యాన్ని   ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ఒకప్పుడు కవిత్వం రచనలలో గ్రాంధిక పదాలు ఎక్కువగా ఉండేవి.పోను పోను ప్రజల భాషలోకి మారుతూ వచ్చిన క్రమంలో సాహిత్యం కూడా ప్రజలకు ప్రజల భాషలో చెప్పదలిచే పదాలను ఉపయోగిస్తూ రచనలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కొన్ని సాహిత్య సంస్థలు ఆ దిశగా రాస్తున్నాయి.

 


ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు