ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
అయ్యో.......
పల్లవి:
పూటకో పువ్వు రాలినట్టుగా మట్టి బిడ్డ ఘోర మరణం
చేరదీసి బాధ బాపే వాడు లేక అన్నదాత కంట శోకం. (2)
వెళుతుండో వెళుతుం డో
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......
చరణం 1:-
వడ్డీకి దెచ్చినప్పు పంట నిలపక పాయె
పరువే ఉరి తాడై పురుగు మందు తో ప్రాణాలు తీసే
పంట చేతికి వస్తె గిట్టు బాటు ధరలు జాడ లేక
ధీర బోయిన గుండె ముక్కలయ్యి నేల కొరిగే
(పంట) సచ్చినంకనే నష్ట పరిహారము -2
ఉన్నప్పుడు జెయ్యరే సాయము
వెళుతుండో వెళుతుం డో
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......
చరణం 2:-
ఆశలే పెట్టి నాడు గెలిసి గోసలే పెట్టే
సూడు
రైతుల ప్రాణాలతోటి ఆటలే .. ఆడే నేడు
రైతిళ్లలో తిండి లేక
వాళ్ళ కళ్ళలో నీళ్ళింకి పాయే
ఒక్క పూట తిండి గూడ లేక
ఎన్ని గోసలో వాళ్ళ బతుకులో
(పంట) సచ్చినంకనే నష్ట పరిహారము
ఉన్నప్పుడు జెయ్య రే సాయమంటు
వెళుతుండో వెళుతుండో.....
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......