ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
మేము షాహిదిలం
ఘనీభవించినచోట
ధ్వనిభవిస్తున్నది
ఎముకలు కొరికే చలిలో
జైకిసానంటూ నినదిస్తూ
ఇనుప చువ్వలపై నిలబడి
రక్తాన్ని ధారపోస్తున్నాడు
ఈ దేశం
మట్టి మనుషులను
తట్టి లేపడంకోసం
నివ్వురు గప్పిన
నిప్పును రాజేస్తున్నాడు
నీ భూమిలోంచి
నిన్ను తరిమేసి
'బనిసగా'
మార్చడంకోసం
అంబానీ అదానీలు
వస్తున్నారు
కాషాపు కమలం
కార్పోరేట్లకి
కవచాలుగా
నిలబడింది
నువ్వొక్కసారి
రైతంగ పోరాటలను
నెమరు వేసుకో
జైత్రయాత్రల చరిత్రను
తిరగదోడు
ఇప్పుడు
దేశ రాజధానిలో
నాగల్లు తిరగబడ్డాయి
అవి భారికేడ్లను
బద్దల్ కొడుతూ
రణ రంగాన్ని
నడిపిస్తున్నాయి
అక్కడ రైతు
'జబ్ తక్ కానున్
వాపస్ నహీలెతే
తబ్ తక్ హమ్ లడేంగే
హమ్ మర్జయేంగే
లేకిన్ వాపస్ నహీజయేంగే'
(చట్టం ఉపసంహరిచుకునే వరకు మేము పోరాడుతాము
మేము మరణిస్తాం కాని వెనక్కి వెళ్లం)
అంటూ
గర్జీస్తున్నాడు
మేము షాహిదిలం
బనిసలం కామంటూ
తిరుగుబాటు చేస్తున్నాడు
(ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టల రద్దుకై ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా)