నవలలు

(July,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కూలి బతుకులు – ఆరవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                             6

          ‘‘ఎం నాగయ్య బాగున్నవా’’ అన్న పిలుపువిని ముందు మంచంలో కూచున్న నాగయ్య అటు వైపు చూసిండు.

            ఎంకటయ్య సారు చిర్నవ్వులు చిందిస్తూ ఇటే వస్తున్నాడు.

            ‘‘ఎన్నిరోజులాయే సారు మిముల్ని చూడక’’ అన్నాడు నాగయ్య అక్చర్యంగా...

            ‘‘గోదావరిఖనిల పనిబడి వచ్చిన... ఎట్లాగు ఇంత దూరం వచ్చిన కదా అని ఒక్క సారి మనోళ్లను చూసి పోదామని వచ్చిన’’ అంటూ వచ్చి మంచంలో నాగయ్య ప్రక్కన కూచున్నడు.

            ఎనుబై దశకంలో వెంకటయ్య కాట్రక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు. ఒక వెలుగు వెలిగిండు. ఆయన ఒక్క మాటంటే చాలు వెలాది మంది కూలీలు కదిలేది.

            ప్రాణం ఎట్టున్నది’’ అని అడిగిండు వెంకటయ్య...

            ‘‘ఏం ప్రాణమో ఎమో పోకుంటా రాకుంటా ఉంది’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా’’

            అదే ఏమైంది.. ఎవని బ్రతుకు వాడు బ్రతకటమే కష్టమైతాంది’’

            ‘‘సత్తయ్య మంచిగనే పని చేస్తాండుకదా.. వాడు ఇంట్లకేమి ఇస్తలేడా’’

            ‘‘ఎక్కడిది వాడు వాని పిల్లలు బ్రతుకుడే కష్టమైతాంది’’ ఇక మా మొఖం చూసేటట్టుఉందా’’

            ‘‘మరి చిన్నోడు’’

            ‘‘ట్రాక్టరు మీద పని చేస్తాండు’’

            ‘‘మరి నువ్వెమి పనిచేస్తలేవా’’

            ‘‘వయసు వయస్సు వాల్లకే పనులు దొరుకతలేవు నన్నెవ్వడు పనులకు పిలుస్తడు’’ అన్నాడు.

            వీళ్ళ మాటలు విని శాంతమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది’’ వెంకటయ్య సారును చూసి ఎప్పుడొచ్చిండ్లు’’ అంది.

            ‘‘ఇప్పుడే’’

            ‘‘ఎక్కడుంటాండ్లు సారు కన్పిస్తలేరు’’ అంది మళ్ళి..

            ‘‘కరింనగర్‍ల’’

            ‘‘అక్కడికి ఎందుకు పోయిండ్లుసారు.. మీ అటువంటి వాళ్ళులేక పోయే సరికి ఇక్కడ ఎవ్వరు అడిగే టోళ్ళు లేకపోయిరి’’ అంది శాంత...

            ‘‘సారును ఏముండమంటవు... ఇక్కడ ఏమున్నది. అప్పుడంటే ఎక్కడ చూసిన జనం ఉండేది. అందరికి పనులు ఉండేది. సమస్యలు ఉండేవి. వాటిని పరిష్కరించాటానికి యూనియన్‍ అవసరమైంది. ఇప్పుడ జనంలేరు. యూనియన్లు  అ జోరు లేదు’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా...

            వెంకటయ్య ‘‘నిజమే’’ అన్నట్టుగా మౌనంగా తలాడించి ‘‘యూనియన్లు ఏడబోయినవి. మాగున్నయి. కాని నిజాయితీగా పని చేసేటోడులేడు’’ అన్నాడు బారంగా...

            ‘‘నిజమే సారు పర్మినెంటు లోకేషన్ల పని దొరకాలంటే ముప్పయి వెలు నడుస్తాంది’’

            ‘‘అ రోజుల్లో మనం ఎంత ంమందిని క్యాజువల్‍ వర్క్ర్కర్‍గా పెట్టించిలేదు... ఒకరి దగ్గర నయాపైస తీసుకున్నమా’’ అన్నాడు వెంకటయ్య పాత రోజులు తలుచుకొని...

            ‘‘నిజమే సారు ఆరోజులు వేరు...ఇప్పుడెమో నాయకులు పీతలపైస ఏరుకుంటాండ్లు’’ అన్నాడు నాగయ్య...

            అ రోజుల్లో నాగయ్య వెంకటయ్యతోని పనిచేసిండు వెంకటయ్య ఎంత చెప్పితే అంత బంద్‍ అంటే బందుండేది. ఒక విదమైన ఉండేది. నాగయ్య యూనియన్‍లో రాత్రింబవళ్ళు తిరిగేది.

            ఇద్దరు కాసేపు పాతరోజులు జ్ఞాపకం చేసుకున్నారు.

            1976లో ఐఫ్‍.సి.ఐ ఉత్తపత్తి ప్రారంభమైన తరువాత నాల్గెండ్లకు రామగుండం కంట్రాక్టు అండ్‍ క్యాజువల్‍ వర్కర్స్ యూనియన్‍ ప్రారంభమైంది. దాదాపు వెయ్యి మంది పని చేసేవాళ్ళు. ప్లాంట్‍ మెయిన్‍ టెనెన్స్ బాయిలర్స్, సివిల్‍, బిల్డింగ్‍ వర్క్న ఒక్కటేమిటి అరోజు పని కంట్రక్టు కూలీలు చేసే వాళ్ళు, వాళ్ళు మీద సూపర్‍వైజ్‍ చెసెందుకు మాత్రంకంపిని మనష్యులు ఉండేది.

            యూనియన్‍ ఎర్పడక ముందు కంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడిచేది. కనీస వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. అదిరించి బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు. కొంత మంది కంట్రాక్టర్లు కూలీలకు డబ్బులు ఎగ్గోటిన సందర్భలున్నాయి. ఎవరైనా ఎదురు మాట్లాడితే పనులనుండి తొలగించేవాళ్ళు... పంజాబ్‍కు చెందిన ‘‘సంగ’’ అనే ఎలక్ట్రిక్‍ కంట్రాక్టర్‍ మరి దుర్మార్గంగా ఉండేవాడు. అనేక సందర్భలలో కూలీల మీద చెయ్యి చేసుకున్నాడు.

            అటువంటి సమయంలో వెంకటయ్య నాయకత్వంలో యూనియన్‍ పుట్టింది. కంట్రాక్టు కూలీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చెపట్టింది. దాంతో కంట్రాక్టర్లకు కన్నెర అయింది.

            కంట్రాక్టు కార్మికులను గవర్నమెంటు జి.వో ప్రకారం కనీస వెతనాలు చెల్లించాలనే డిమాండ్‍ మీద సమ్మె చేసినప్పుడు పెద్ద పోరాటమే జరిగింది.

            ‘‘చెప్పుకింద రాయిలాగా అణిగి మణిగి ఉండే కూలి నాలి కొడుకులు మాకు ఎదురు తిరుగుతారా’’ అని కంట్ట్రార్ల కోపానికి వచ్చి సంఘంలో ముందు నిలచిన వెంకటయ్య మీద తమ గుండాలను పంపి హత్యప్రయత్నం చెసిండ్లు.

            దాడికి వచ్చిన గుండాల మీదికి కూలీలు ఎదురు తిరిగిండ్లు. రోజంతా మొద్దు కష్టం చేసి దాటు దేలిన కూలీల ముందు గుండాలు నిలువలేక పోయిండ్లు. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిండ్లు.

            వెంకటయ్య మీద హత్యయత్నం చేసిన కంట్రాక్టర్లు తమ పలుకుబడి ఉపయోగించి ‘‘తమ అనుచరుల మీద దాడి చేసిండ్లని దొంగ కేసు పెట్టిండ్లు... పోలీసులు వచ్చి వెంకటయ్యతో సహా కొద్దిమందిని పట్టుక పోయి ఠానా లో వేసి కొట్టి కేసులు పెట్టిండ్లు.

            ఈ సంఘటన కూలీలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే దాక, తమ న్యాయమైన డిమాండ్లను ఓప్పుకునేదాక సమ్మె విరమించేది లేదని కూలీలు తెగెసి చెప్పిండ్లు.

            సమ్మె వారం రోజులు సాగింది. ఎఫ్‍.సి.ఐ ప్రోడక్షన్‍ అగిపోయింది. కూలీలు పని చెయకుండా ఒక్క రోజు కూడా నడువని పరిస్థితి... దాంతో మెనేజుమెంటు దిగివచ్చి కంట్రాక్టర్ల మీద ఓత్తిడి తెచ్చింది.

            ‘‘కూలీలా గొంతమ్మ కొర్కెలు తీరుస్తూ ఇక మాకేమి మిగులు బాటు అయితది’’ అంటూ మొదట కంట్రాక్టర్లు మొండికేసినా మెనేజుమెంటు వారిని కన్విన్స్ చేసి ఒక ఓప్పందానికి వచ్చింది.

            అవిదంగా సమ్మె విజయవంత మైంది. కూలీల జీతాలు పెరిగినవి. యాడాదికి రెండు డ్రెస్‍లు, సేఫ్టీషూస్‍, క్యాంటిన్‍, ప్రావిడెంట్‍ ఫండు కట్టింగ్‍, యాడాది పన్నెండు లీవులు ఇచ్చెలా ఓప్పందం జరిగింది.

            అన్నిటి కంటె ముఖ్యమైంది. గతంలో కంట్రాక్టకూలీలకు నిర్దిష్టమైన పనిగంటలు అనేవి ఉండేవి కావు. కొన్ని సార్లు పన్నెండు గంటలు పని చేయించుకొనేది. ఓప్పందం తరువాత కూలీలను ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయించవద్దని ఒక వేళ అనివార్యమై పనులు చెయించాల్సి వస్తే అదనంగా పని చేసిన గంటలకు ఓవర్‍టైమ్‍ పెమెంట్‍ చేయించాలని ఓప్పందం జరిగింది. అలాగే అరస్టు చేసిన నాయకులను విడుదలచేసారు. కూలీల డిమాండ్స్ ఏవి కొత్తవి కావు. గవర్నమెంట్‍ జివోతో ఉన్న అంశాలే కాని అమలు జరిగేవికావు. ఎప్పుడైతే కూలిసంఘం సమ్మె తరువాతనే అమలు లోకివచ్చినవి.

            సమ్మె విజయవంతం కావటంతో కూలిసంఘం బలపడింది. దీని ప్రబావం ప్రక్కనే ఉన్న ఎన్టిపిసి కార్మికుల మీదప్రబావం చూపింది క్రమంగా అక్కడ కూలి సంఘం బలపడింది. ఎన్టిపిసి లో కార్మికులు తమ సమస్యల మీద మూడు సార్లు సమ్మె చేసి విజయం సాధించారు.

            కూలీలు ఎక్కువగా నివసించే పికే రామయ్య కాలనీలో అంత వరదాక కరెంటు లేదు, యూనియన్‍ అందోళన పలితంగా కరెంటు వచ్చింది. మంచినీళ్ళ కోసం రెండు పంపులు వచ్చినవి. అయినా చాల సమస్యలు పెండింగ్‍లో ఉన్నాయి.

            పోయిన వర్షకాలం మురికి గుంలా ఉండే పికే రామయ్య కాలనీలో కలరా వచ్చి షహి దుర్గ తండ్రి భగవతి నాగమణి భర్త రామయ్య చనిపోయిండ్లు. అ సందర్భంగా యూనియన్‍ అందోళచేస్తె ‘‘ఎంమ్మార్వో’’ వచ్చిండ్లు.

            ఎంమ్మార్వో ముందు కాలనీ వాసులు చాల సమస్యలు ఎకరవు పెట్టిండ్లు. మాకు రెషన్‍ కార్డులు లేవు. ఉచిత బియ్యం వస్తలేవు. మేము ఈ దేశవాసులంకామా? మాకెందుకు ఇవ్వరు.. అని నిలదీసిండ్లు. కాని అన్ని చేస్తామని హమీ ఇచ్చిన ఎంమ్మార్వో అటు తరువాత తన మాట నిలుపుకోలేదు.

            ఉండి ఉండి వెంకటయ్య ‘‘చంద్రయ్య కన్పిస్తాండా’’ అని అడిగిండు.

            ‘‘ఏ చంద్రయ్య’’

            ‘‘అదే బొందయ్య కొడుకు’’

            ‘‘మొన్న బొందయ్య కన్పించిండు కాని కొడుకు సంగతి ఏం తెల్వలేదన్నాడు. అయినా కొడుకు ఎప్పటికైనా రాకపోతడా అని ఎంత కష్టం వచ్చినాభూమి అమ్మలేదట’’ అన్నాడు నాగయ్య...

            ‘‘బొందయ్య ఇక్కడ ఉంటాండా’’

            ‘‘చాల రోజులాయే ఎల్లిపోయి ఆయన భార్యకూడా చనిపోయిందట... ఊరిమీద తిర్గి అడుక్కొని బతుకుతాండు’’ అన్నాడు నాగయ్య...

            అమాటలకు ఎంకటయ్య మన సులో బాదేసింది. ఎక్కడి దక్కడ చిల్లం కల్లం అయ్యింది. గాలిలో దీపం లాంటి కూలీల బ్రతుకుల్ని కాపాడటానికి ఒక ప్రయత్నమైతే చెసిండు. కాని, తుపానులా వీచిన గాలికి ఆ దీపం అరిపోయింది. కూలీ బ్రతుకుల్లో మళ్ళి చీకట్లు కమ్ముకున్నాయి. కూలీల చమట చుక్కలను లాబాలుగా పిండుకోవటానికి అందరుకు అందరుతోడు దొంగలే. కూలీల బ్రతుకుల్ని బాగు చేస్తామని చట్టాలు చేసిన పాలకులు, అచట్టాలు ప్రభుత్వరంగ సంస్థలోనే అమలు జరుగకుంటే పట్టించుకొని లేబర్‍ అపీసర్లు...

            మొదటి సారి కూలి సంఘం మహాసభలు ఎంతో ఉత్సాహంగాజరిగినవి. ఎన్టిపిసి కమ్యూనిటి హాల్లో మీటింగ్‍ జరిగింది. సహజంగా అయితే మెనేజుమెంటు కూలీలను ఆ చాయలకు కూడా రానివ్వదు. అటువంటిది అందులో మీటింగ్‍ పెట్టుకోవటానికి పర్మిషన్‍ ఇచ్చిందంటే, ఆ రోజుల్లో కూలిసంఘం ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

            వెంకటయ్యకు చంద్రయ్య నల్లటి బక్క మొఖం గుర్తుకు వచ్చింది. దాంతో ఆయన అప్రయత్నంగానే ‘‘వాడు మొదటినుండి అంతే రాజీపడేవాడు కాదు. చెవసచ్చి ఒపిక నశించి మా అటువంటి వాళ్ళు వెనక్కి తగ్గినా... చంద్రయ్య ముందుకే పోయిండు’’ అన్నాడు బారంగా...

            ‘‘మరింక ఏం చేస్తడు. మనిషి ముందు అకలికి చచ్చుడో ఎదురుతిరిగి బ్రతుకుడో తెల్చుకోవాలన్నప్పుడు చంద్రయ్య లాంటి వాళ్ళు ఎదో తిరగటానికే సిద్దమైండ్లు’’ అన్నాడు నాగయ్య...

            కూలి సంఘం బలహినపడటానికి అనేక కారణాలున్నాయి. పనులు లేక చాల మంది బ్రతక పోవం ఒక కారణమైతే కూలి సంఘంలో అంతర్‍ కలహలు ఎర్పడటం మరో కారణమైంది.

            నిత్యం కూలీల మధ్య తిరుగుతు పని చేసేవాల్ళు కొందరైతే రాష్ట్ర నాయకులుగా కెంద్రనాయకులుగా చెలామణి అవుతు వారి మీద పెత్తనం చేసేవాళ్ళు మరికొందరు. సమాజంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలు సంఘంలోకి చొచ్చుకొచ్చింది.

            ఏ రోజుకు ఆరోజు పని చేసకుంటూ తిండికి తికానలేని కూలీల మధ్య పనిచేయటం అంటే మాములు విషయం కాదు. అందుకు ఏంతో ఓపిక పట్టుదల, సేవబావం కావాలి. కాని చాల మందినాయకులకు అలక్షణాలు లేవు. సభలు సమావేశాలప్పుడు తెల్ల బట్టలు వేసుకొని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, క్రింది స్థాయిలో పని చేసే వారి మీదమాత్రం పెత్తనం చేసేవాళ్ళు. అంత వరదాక అందర్గతంగా జరిగే ఘర్షణ క్యాజువల్‍ వర్కర్స్ సమ్మె సందర్భంగా బయటపడింది.

            ఎన్టిపిసిలోని మెకానికల్‍ ఎలక్ట్రికల్‍ సెక్షన్‍లో లోడింగ్‍ అన్‍లోడింగ్‍ చేసే వంటి నిత్యం పనులు ఉండే చోట పనిచేసే కూలీలను క్యాజువల్‍ లెబర్‍గా పర్మినెంటు చేయ్యలనే డిమాండ్‍తో సమ్మె మొదలైంది.

            అయా పనులు స్వబావ రీత్య రోజు ఉండేవి. అయితే ఆ పనులు చేసే కంట్రాక్టర్లు మారి నప్పుడు మారిన కంట్రాక్టరు కొంతమందిని తీసివేసి, తనకు ఇష్టమైన వారిని మరి కొంత మందిని పెట్టుకునే వాళ్ళు. దీన్ని కూలీలలు వ్యతిరేకించిండ్లు. ఎంట్రాక్టర్లు మారిన పర్మినెంటు పనుల చేసే వారిని తీసివేయవద్దు అన్నది డిమాండ్‍. అట్లా చేయటం వలన సంస్థకు వచ్చే నష్టం ఏమి లేదు. కాకుంటే పర్మినెంటు పనులు చేసే కూలీలకు రోజు పని ఉంటుంది. అది కూడా కంట్రాక్టు కూలియే...

            ఎప్పుడైతే సమ్మె మొదలైందో పనులు సాగక మెనేజుమెంటు ఇరకాటంలో పడింది. కంట్రాక్టర్లెమో అందుకు ఓప్పుకోవటంలేదు. ఎందుకంటే కంట్రాక్టర్లు పర్మినెంటు పనులు కూలీలకు కేటాయించాలంటే కూలీల దగ్గర లంచాలు తీసుకొని పనుల్లో నియమించుకునేవాళ్ళు. చివరికి ఇది ఎట్లా పరిణామం చెందిందంటే కంట్రాక్టర్లు మారినప్పుడల్లా తమ పనిని కాపాడుకోవాటానికి సమ్మె ఉధృతి పెరిగే సరికి మెనేజుమెంటు కుట్రపూరితంగా వ్యవహరించింది. అగ్రనాయకులతో మంతనాలు జరిపి వారిని లోబర్చుకుంది.

            నలుబైశాతం మందికి క్యాజవల్‍ వర్కర్లగా పర్మినెంటు పేసుల్లో పనిచేయాటానికి మెనేజుమెంటు ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే గణవిజయంగా నాయకులు చెప్పుకొచ్చిండ్లు.

            ‘‘పదకొండు వందల మంది పర్మినెంటు పనిస్థలాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంటు చేయాలని మనం సమ్మె చేస్తే కనీసం మనతోని విచారించకుండా నాయకులు విద్రోహ పురితమైన ఒప్పంద చేసుకున్నారు’’. అంటూ కూలీలు అవేశపడ్డారు.

            ‘‘ఇంకా నాలుగు రోజులు సమ్మె కొనసాగితే మెనేజుమెంటు అందరికి పర్మినెంటు ఫేసులు ఇచ్చేది. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని కూలీల మధ్యకు పోవాలి. నిత్యం కూలీల మధ్య తిరిగే వారి బాధలు వారికేట్లా అర్థమైతది. అంటూ వెంకటయ్య అవేదన చెందాడు.

            ‘‘లేదన్నా అందర్ని పర్మినెంటు చేసేదాక సమ్మె విరమించవద్దు’’అంటూ చంద్రయ్య అవేశ పడ్డాడు. కూలి సంఘంలో చీలిక వచ్చింది. వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగించాలని పిలుపు ఇచ్చింది.

            ఒప్పందం చేసుకున్న నాయకులు తాము చేసుకున్న ఒప్పందాన్ని సమర్థించుకోవటానికి మీటింగ్‍ పెట్టిండ్లు.

            ‘‘పోరాటం అన్న కాడ సళ్ళుబిగు ఉండాలి. మొండికేస్తే మొదటికే మోసం. అందుకే ఈ సారి 40% మందిని పర్మినెంటు ఫేసులు ఇస్తారు. మిగితావారిని దశలవారిగా పర్మినెంటు చేస్తారు’’ అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసింది.

            ‘‘అట్లా ఏమన్నా ఒప్పందం ఉందా’’ అంటూ చంద్రయ్య సభలోనే నాయకులకు ఎదురు తిరిగిండు.

            కూలీల కోపంతగ్గించటానికి నాయకులు అట్లా చెప్పుకొచ్చిండ్లు కాని వాస్తవానికి అటువంటి ఒప్పందం ఏదీలేదు.

            ‘‘ఇటువంటి దుందుకుడు చర్యలే యూనియన్‍కు నష్టం చేస్తాయి’’ అంటూ నాయకులు అవేశపడ్డారు.

            సమావేశం కాస్త రసాబసాగా మారింది. ‘‘అందరిని పర్మినెంటు చేసేదాక ఎవరు పనులు చేయవద్దు’’ అంటూ వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగిచింది.

            యూనియన్‍ విబేదాలు తారా స్థాయికి చేరింది.

            ‘‘యూనియన్‍ క్రమశిక్షణకు కట్టుబడ కుండా వ్యక్తిగత పని విదానంతో పనిచేస్తున్న వెంకటయ్య మరికొంత మందిని యూనియన్‍ బహిష్కరిస్తున్నట్టుగా అగ్రనాయకత్వం ప్రకటించింది.

            ‘‘పోరాడే వానికి వేదికలే కరువా, వాడు కాకుంటే మనమే ఒక పోటి యూనియన్‍ ఎర్పాటు చేసుకుందాం’’ అన్నాడు సమ్మెకారులు...

            అట్లా వెంకటయ్య నాయకత్వంలో మరో కూలిసంఘం అవిర్భవించింది.

            సమ్మెకొనసాగటం మెనేజుమెంటుకు ఇబ్బంది కల్గించి పోటి సంఘం ఎర్పడటం దాని నాయకత్వంలో సమ్మె కొనసాగటం అగ్రనాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాళ్ళు ఏమి చెయ్యలేక వెంకటయ్యకు రాడికల్స్ సంబందం ఉంది’’ అంటూ పోలీసులకు లోపాయికారిగ ఎగదోసిండ్లు. ఒక రోజు పోలీసులు వచ్చి యూనియన్‍ అపీసుమీద దాడి చేసి వెంకటయ్య, చంద్రయ్య మరి కొంతమందిని అరెస్టు చేసి తీసుక పోయిండ్లు. అవిదంగా సమ్మెకు నాయకత్వం లేకుండా చేసిండ్లు.  మరోవైపు పర్మినెంటు అయిన వారికి కాని వారికి మధ్యన విబేదాలు సృష్టించిండ్లు. పలితంగా సమ్మె విపలమైంది.

            ఈలోపున కుక్కమూతి పిందెల్లా చాల కార్మిక సంఘలు పుట్టుకొచ్చినవి. బిజెపి నాయకుడు, కంట్రాక్టరు అయిన రంగయ్య తన అనచరుడు లక్ష్మన్‍ను  నాయకుడుగా చేసి భారతీయ మజ్దూర్‍ సంఘ్‍ అనుబందంగా కూలి సంఘం ఏర్పాటు చేసిండు. కంది చంద్రయ్య నాయకత్వంలో కాగ్రెసు వాళ్ళు ఒక సంఘం స్థాపించిండ్లు. ఏఐటియుసి వాళ్ళు ఏఫ్‍.సి.ఐలో అపరేటర్‍గా పనిచేసే రామయ్య అనే వాని నాయకత్వంలో కూలి సంఘం పెట్టిండ్లు. ఎవని దుకాణం వానిదైంది. ఇట్లా కూలీలు చీలికలు పేలికలైండ్లు.

            ఒకప్పుడు బలంగా పని చేసిన కూలి సంఘంబలహినమైంది. వెంకటయ్య తదితరులు బయిటికి పంపిన నాయకులు ఎన్టిపిసి ఎంప్లాయి ఈలోపున ఐఫ్‍సిఐ మూత పడింది. వాస్తవానికి ఎర్పాటు చేయాటమే లోపభుయిష్టంగా జరిగింది దానికి తోడు అడుగు అడుగున అవనీతి చోటు చేసుకున్నది. టెక్నాలజీ సప్లయి చేసిన  బహుళ జాతి సంస్థలు ఇచ్చె లంచాలకు ••క్కుర్తి పడిన అధికారంలో ఉన్న పెద్దలు పనికి మాలిన, అవుట్‍డేట్‍ అయిన సెకండరీగ్రెడ్‍ టెక్నాలజీని అంగట్టారు. ఎఫ్‍సిఐ చుట్టు సింగరేణి బొగ్గు గనులున్నా, ఏఫ్‍సిక్ష్మ గోడను అనుకొని 2100మెగావాట్ల విధ్యుత్‍ ఉత్పత్తి చేసే ఎన్టిపిసి ఉన్నా, బొగ్గు కొరత వలన కరెంటు కొరత వలన సంస్థకు వందల కొట్లు నష్టాలు సంభవించింది. పలితంగా ఎఫ్‍సిఐని మూసివేసిండ్లు.

            ప్యాక్టరీ మూత పడటంతో వందలాది మంది కూలీలకు పనులు లేకుండా పోయింది. దాంతో తట్టాబుట్టా పట్టుకొని చాల మంది కూలీలు మళ్ళీ వలస పోయిండ్లు.

            ఈ అటుపొట్ల మధ్య ఒంటరి పోరాటం చెయ్యలేక వెంకటయ్య సంఘం వదులుకొని కరింనగర్‍కు బ్రతక పోయిండు.

            ఎక్కడికి పోయినా కూలిల బ్రతుకు ఇంతేనని బావించిన చంద్రయ్య లాంటి అవేశపరుడు కూలి బ్రతుకులు మారలంటే కూలిరాజ్యం రావాలని అందుకు పోరాటమే మార్గమని అడవి బాట పట్టిండు.

            వెంకటయ్యకు గతమంత గుర్తుకు వచ్చి మనసు కకావికలమైంది. ఆయన మెల్లగా పోవటానికి లేచిండు. అది చూసి నాగయ్య ‘‘సారు పోతాండ్లా’’ అన్నాడు.

            ‘‘రాజయ్యను కలిసి పోతా’’

            ‘‘ఉన్నడో లేడో’’

            ‘‘అదే’’

            ‘‘ఎంలేదు. మనిషి పుర్తిగా చాతకాకుండా అయ్యిండు’’

            ఎప్పుడన్నా గట్లనే కన్పిస్తడు కాని రెండు మూడు రోజులాయే కన్పిస్తలేడు’’

            ‘‘సరే మనొళ్ళు ఎవరన్నా కలుస్తరో చూస్తా’’ అంటూ వెంకటయ్య లేచిండు.

            ‘‘అయ్యా చిన్న పని’’ అన్నాడు నాగయ్య...

            ‘‘ఎంటీ’’ అంటూ క్షణమాగి పరిక్షగా చూసిండు వెంకటయ్య...

            ‘‘పనులు లేక కష్టమైతాంది. మీరే ఎవరికైన చెప్పి పని ఇప్పించాలి’’ అంటూ నాగయ్య నసిగిండు.

            ‘‘ఎనకట అంటే నడిచింది. ఇప్పుడు మనమాట ఎవరు వింటరు. సరే ఒపని చేస్తాం’’

            నాగయ్య అసక్తిగా చూసిండు.

            ‘‘లక్ష్మన్‍ ఇప్పుడు స్వంతంగా బిల్డింగ్‍ కట్టి పనులు చేస్తాండు కదా వానితో చెప్పుతా... ఎదో ఒకపని వాడే చూయిస్తడు. నువ్వు పొయి ఆ యాన్ని కలువు’’ అన్నాడు.

            సరే అంటూ నాగయ్య రెండు చేతులు జోడించిండు.

            వెంకటయ్య బారంగా ముందుకు కదిలిండు.

       (తరువాయి భాగం వచ్చే సంచికలో)


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు